అన్వేషించండి

BJP Yatra : బీజేపీలో ప్రజాసంగ్రామ యాత్ర జోష్.. ప్రత్యేక టీంను పంపిన అమిత్ షా !

బండి సంజయ్ పాదయాత్రకు మంచి స్పందన వస్తోందని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. టీఆర్ఎస్‌పై ఉన్న ప్రజా వ్యతిరేకతను అనుకూలంగా మల్చుకునేలా వ్యూహాలు రూపొందించేందుకు ప్రత్యేక బృందాన్ని అమిత్ షా పంపారు.

తెలంగాణ భారతీయ జనతా పార్టీలో ప్రజాసంగ్రామ యాత్ర కొత్త ఊపు తీసుకు వస్తోంది. బీజేపీ హైకమాండ్ కూడా యాత్రకు వస్తున్న స్పందనతో సంతృప్తిగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్రలు రాజకీయాలనే మార్చిన చరిత్ర ఉండటంతో  బీజేపీ హైకమాండ్ బండి సంజయ్ పాదయాత్ర విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. యాత్ర విజయవంతానికి కావాల్సిన సాయం అంద చేస్తోంది. హోంమంత్రి అమిత్ షా ప్రత్యేకంగా ఓ టీంను హైదరాబాద్‌కు పంపినట్లుగా తెలుస్తోంది. ఈ టీం మార్గదర్శనంలోనే ప్రస్తుతం పాదయాత్ర వ్యూహాలు అమలు చేస్తున్నారని తెలుస్తోంది.
BJP Yatra : బీజేపీలో ప్రజాసంగ్రామ యాత్ర జోష్.. ప్రత్యేక టీంను పంపిన అమిత్ షా !

Also Read : వైఎస్ సంస్మరణకు ఆత్మీయులు ఎందుకు హాజరు కాలేదు ?
 
ప్రజాసంగ్రామ యాత్రను బండి సంజయ్ ప్రారంభించి వారం అవుతోంది. వారం రోజుల పాటు ఆయన యాత్ర జరిగిన తీరును బీజేపీ హైకమాండ్ విశ్లేషించింది. యాత్రపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షా కూడా సమాచారం తెలుసుకుంటున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అమిత్‌ షా పర్యవేక్షణలో పనిచేసే ఆరుగురు సభ్యుల బృందం యాత్ర ప్రారంభాని కంటే ముందే హైదరాబాద్ వచ్చింది. ఆ టీం యాత్రను కోఆర్డినేట్ చేస్తోంది. ఆరుగురు సభ్యుల బృందం ప్రజా సంగ్రామ యాత్ర వెంటే సాగుతూ ఎప్పటికప్పుడు అమిత్‌ షాతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాలకు  నివేదికలు పంపుతోంది. ఇప్పటి వరకూ బీజేపీ హైకమాండ్ సంతృప్తి చెందినట్లుగా తెలుస్తోంది.
BJP Yatra : బీజేపీలో ప్రజాసంగ్రామ యాత్ర జోష్.. ప్రత్యేక టీంను పంపిన అమిత్ షా !

Also Read : ప్రధాని అపాయింట్‌మెంట్ కోసం కేసీఆర్ వెయిటింగ్

పాదయాత్రకు సంఘిభావం తెలిపేందుకు కేంద్రం ప్రతినిధులుగా ప్రతీ వారం ఓ కేంద్రమంత్రి లేదా జాతీయ స్థాయి నాయకుడ్ని పంపించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్‌లో పార్టీ నిర్వహించే బహిరంగసభలో అమిత్‌ షా పాల్గొంటారు. అక్టోబర్‌ 2న తొలి విడత పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొననున్నారు. వికారాబాద్‌లో నిర్వహించే సభలో మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఆ తర్వాత జరగనున్న కార్యక్రమాల్లో ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం రమణ్‌సింగ్, బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య, ఇతర ముఖ్యనేతలు పాల్గొనేలా షెడ్యూల్ రూపొందించారు.  జిల్లాల్లో బీజేపీపాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు కూడా పాల్గొనేలా చూస్తారు.
BJP Yatra : బీజేపీలో ప్రజాసంగ్రామ యాత్ర జోష్.. ప్రత్యేక టీంను పంపిన అమిత్ షా !

తెలంగాణ బీజేపలో వర్గ పోరాటం ఉందన్న ప్రచారం ఉంది. అయితే  ఈ వర్గ పోరాటాలు పార్టీ పనితీరుపైనా.. పాదయాత్రపైనా ప్రభావం చూపకుండా బీజేపీ హైకమాండ్ జాగ్రత్తలు తీసుకుంటోంది.  అన్ని స్థాయిల్లోని నాయకులు ఈ యాత్రలో ఎంతమేరకు భాగస్వాములవుతున్నారనేదానిపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. కార్యకర్తల్లో మరింత ఉత్సాహం నెలకొనేందుకు ఏం చేయాలనేదానిపై సూచనలు చేస్తున్నారు.  టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ప్రజల దృష్టిలో ఉండాలంటే ఏం చేయాలో హైకమాండ్  తెలంగాణ బీజేపీ నేతలకు  స్పష్టమైన దిశానిర్దేశం చేస్తోంది. 

Also Read : హైదరాబాద్ వాసులకు మరో వరద కాళరాత్రి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు

వీడియోలు

Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!
Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Divi Vadthya Bikini Pics: బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
Akhanda 2 Premiere Show Collection: 'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
Cognizants Campus in Visakhapatnam: ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Embed widget