అన్వేషించండి

YSR Meet : వైఎస్ సంస్మరణకు ఆత్మీయులెవరూ ఎందుకు రాలేదు..? రాజకీయమే డామినేట్ చేసిందా..?

వైఎస్ఆర్ సంస్మరణ సభ వెలవెలబోయింది. ఆయన హయాంలో వెలుగు వెలుగిన నేతలెవరూ హాజరు కాలేదు. ప్రయోజనాలు పొందిన వారు కూడా రాలేదు. కొద్ది మంత్రి మాత్రమే హాజరు కావడంతో రాజకీయ ప్రభావం సమావేశంపై పడినట్లయింది.

 

వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12వ వర్థంతి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సారి ఆసక్తి రేకెత్తించింది. వర్థంతి సందర్భంగా ఆయనతో అనుబంధాన్ని  ఆయనకు ఆత్మీయులైన వారందరూ గుర్తు చేసుకున్నారు. అయితే ఇదే సందర్భంగా ఆయన సతీమణి వైఎస్ విజయలక్ష్మి ఏర్పాటు చేసిన సమావేశానికి మాత్రం వారెవరూ హాజరు కాలేదు. రాజకీయాలకు అతీతమైన సంస్మరణ అని చెప్పినప్పటికీ రాజకీయ కారణాలతోనే దాదాపుగా అందరూ డుమ్మా కొట్టారు. హాజరైన ఒకరిద్దరు కూడా రాజకీయ కారణాలతోనే హాజరయ్యారు. వైఎస్ సంస్మరణను ఎందుకింత రాజకీయం అయింది..? ఆయనతో ఆత్మీయంగా ఉన్న వారెవరూ ఆత్మీయ సమావేశానికి ఎందుకు రాలేదు..? రాజకీయేతర సమావేశం అని అందర్నీ పిలిచి రాజకీయం చేయాలని వైఎస్ విజయలక్ష్మి అనుకున్నారా..?
YSR Meet : వైఎస్ సంస్మరణకు ఆత్మీయులెవరూ ఎందుకు రాలేదు..? రాజకీయమే డామినేట్ చేసిందా..?

Also Read : కోమటిరెడ్డిపై కాంగ్రెస్ హైకమాండ్ చర్యలు తీసుకుంటుందా ?

వైఎస్‌కు అత్యంత ఆప్తులూ డుమ్మానే..!

హైదరాబాద్‌లోని ప్రముఖ స్టార్ హోటల్ల్లో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ సంస్మరణ సభకు వైఎస్ హయాంలో ప్రయోజనాలు పొందిన రాజకీయ నేతలు, ఇతర వర్గాలకు చెందిన 350 మంది వరకూ ప్రముఖుల్ని ఆహ్వానించారు. వారిలో రాజకీయ నేతలే ఎక్కువ. రాష్ట్ర విభజనకు ముందు వైఎస్ సీఎంగా చేసినందున రెండు రాష్ట్రాల్లోనూ ప్రతి జిల్లాలోనూ ఆయనకు అత్యంత సన్నిహితులైన నేతలు ఉన్నారు. వైఎస్ మరణం తర్వాత అంతా చెల్లాచెదురైపోయారు. తమకు రాజకీయ  భవిష్యత్ ఎక్కడ ఉంటుందో అక్కడ చేరిపోయారు. చాలా కొద్ది మంది మాత్రమే కాంగ్రెస్‌లో ఉన్నారు. అయితే కాంగ్రెస్‌తో వైఎస్ కుటుంబం బంధం తెంచుకుంది. అదే సమయంలో  వైఎస్ కుటుంబంలోనూ విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలూ ఆ సమావేశానికి హాజరు కాలేకపోయారు. అంటే కాంగ్రెస్‌లో ఉన్న నేతలూ హాజరు కాలేదు. ఇతర పార్టీల్లో ఉన్న నేతలూ హాజరు కాలేదు. చివరికి సొంత కుటుంబ సభ్యుడు పెట్టిన పార్టీలో చేరిన నేతలూ హాజరు కాలేదు. దీంతో సంస్మరణ సభ వెలవెలబోయింది.
YSR Meet : వైఎస్ సంస్మరణకు ఆత్మీయులెవరూ ఎందుకు రాలేదు..? రాజకీయమే డామినేట్ చేసిందా..?

రాజకీయ కారణాల వల్లే దూరంగా ఉన్న నేతలు..!

నిజానికి రాజకీయాలకు అతీతమైన సభగా ప్రకటించారు. కానీ రాజకీయ నేతలకు మాత్రం నమ్మశక్యం అనిపించలేదు. వైఎస్‌కు నివాళి అని చెప్పినప్పటికీ అక్కడకు వెళ్లిన తర్వాత రాజకీయ ప్రసంగాలు చేస్తే ప్రస్తుతం తాము ఉన్న పార్టీలో తమకు ఎదురుగాలి వీస్తుందని.. తమ తమ అధినాయకత్వాలు తమపై అపనమ్మకం పెంచుకుంటాయన్న అభిప్రాయంతో ఎక్కువ మంది నేతలు సమావేశానికి దూరమయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలదీ అదే పరిస్థితి. తమ పార్టీ మూల  పురుషుడిగా భావించే వైఎస్ఆర్ సంస్మరణ కార్యక్రమానికి ఆయన కుమారుడు జగనే దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో తాము వెళ్తే తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయన్న కారణంగా మిగిలిన వారూ ఆగిపోయారు. వారెవరకూ వైఎస్‌పై అభిమానం లేక కాదు. రాజకీయ కారణాల ఆటంకాల వల్లే వారు ఆగిపోయారు.
YSR Meet : వైఎస్ సంస్మరణకు ఆత్మీయులెవరూ ఎందుకు రాలేదు..? రాజకీయమే డామినేట్ చేసిందా..?

Also Read : ఏపీలో ఇళ్లలోనే వినాయక చవితి

ఇతర రంగాలకు చెందిన కొద్ది మంది హాజరు..!

తెలుగు రాష్ట్రాల నుంచి ఉండవల్లి అరుణ్ కుమార్, కేవీపీ రామచంద్రరావు, రఘురవీరారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, కూనశ్రీశైలం గౌడ్ మాత్రమే హాజరైన వారిలో గుర్తించుకోదగ్గ నేతలు. వీరిలో తెలంగాణకు చెందిన ముగ్గురు నేతలు కాకుండా ఏపీ నేతలు ముగ్గురూ క్రియాశీలక రాజకీయాల్లో లేరు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరు వెనుక కూడా రాజకీయ కారణాలే ఉన్నాయి. వైఎస్ పాలనలో మేళ్లు పొందిన ఇతర రంగాలకు చెందిన వారు హాజరయ్యారు. వారికి రాజకీయాలతో సంబంధం లేదు. అప్పటి వైఎస్ ప్రభుత్వ విధానాల కారణంగా.. పదవుల పరంగా సాయం పొందిన వారు విజయలక్ష్మి ఆహ్వానాన్ని మన్నించారు. అందరూ వచ్చారు. తమ శక్తి మేరకు వైఎస్‌ను స్మరించుకున్నారు.  సినీ నటలూ రాలేదు. కృష్ణ వీడియో సందేశం, మోహన్ బాబు ఆడియో సందేశం మాత్రమే పంపారు. వైఎస్ఆర్‌తో గొప్ప అనుబంధం ఉన్న చిరంజీవి, నాగార్జున వస్తారని అనుకున్నారు. కానీ వారూ హాజరు కాలేదు.
YSR Meet : వైఎస్ సంస్మరణకు ఆత్మీయులెవరూ ఎందుకు రాలేదు..? రాజకీయమే డామినేట్ చేసిందా..?

షర్మిల పార్టీ కోసమే సమావేశం..!

అయితే సమావేశం జరిగిన తీరు.. అందులో వైఎస్ విజయలక్ష్మి చేసిన ప్రసంగం... చేసిన విజ్ఞప్తులను చూస్తే పక్కా రాజకీయ సమావేశం అని సులువుగానే అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డను ఆదరించాలని.. ఆమెకు అందరూ అండగా ఉండాలన్న సందేశంతోనే ఈ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వచ్చినట్లయితే.. ఇతర రాజకీయ నాయకులు నిజంగానే రాజకీయంగా ఇబ్బందిపడి ఉండేవారన్న అభిప్రాయాలున్నాయి. మొత్తానికి రాజకీయ ఎజెండా లేదని చెప్పి ఏర్పాటు చేసిన సంస్మరణ కార్యక్రమం పూర్తిగా రాజకీయంగా మారిపోయింది. వైఎస్ చర్మిష్మాను ఇప్పటికీ రాజకీయ ఎదుగుదలకు వాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారన్న విశ్లేషణలు రావడానికి ఈ సభ కారణం అవుతోంది. 

 

Also Read : వర్షానికి మునిగిన న్యూయార్క్

టాప్ హెడ్ లైన్స్

Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Nadendla Manohar: తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం.. సబ్సిడీ విక్రయాలు ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్
తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం.. సబ్సిడీ విక్రయాలు ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
MI Trade Rumours: హార్దిక్ ,CSK డీల్ ప్రచారం నిజమేనా.. MI అఫీషియల్స్ షాకింగ్ క్లారిటీ, ట్రేడింగ్ డ్రామాలో ఊరించే ట్విస్ట్!
హార్దిక్ ,CSK డీల్ ప్రచారం నిజమేనా.. MI అఫీషియల్స్ షాకింగ్ క్లారిటీ, ట్రేడింగ్ డ్రామాలో ఊరించే ట్విస్ట్!

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Embed widget