By: ABP Desam | Updated at : 06 Jan 2022 08:38 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
రాష్ట్రంలో కొవిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మెున్నటి వరకు వందల్లో నమోదైన కేసులు ఇప్పుడు వేలకు చేరుకుంటున్నాయి. కొత్తగా తెలంగాణలో 1,913 కొత్త కేసులు నమోదయ్యాయని రాష్ట్ర, వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఒక్కరోజులో 54,534 టెస్టులు నిర్వహించారు. వైరస్ కారణంగా ఇద్దరు మృతి చెందారు. 24 గంటల వ్యవధిలో 232 మంది బాధితులు కోలుకున్నారని చెప్పింది. ప్రస్తుతం తెలంగాణలో 7,847 యాక్టివ్ కేసులున్నాయని తెలిపింది. ఇప్పటివరకూ.. మెుత్తం రాష్ట్రంలో 6,87,456కు చేరుకున్నాయి. ఇందులో 6,75,573 మంది కోలుకున్నారు. వైరస్ కారణంగా తెలంగాణలో 4,036 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణాల రేటు 0.58శాతంగా ఉండగా.. రికవరీ రేటు 98.27శాతంగా ఉంది.
దేశంలో పెరుగుతున్న కేసులు
దేశంలో కరోనా టాప్ గేర్లో వ్యాప్తి చెందుతోంది. కొత్తగా లక్షకు దగ్గరగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 90,928 మందికి కరోనా సోకింది. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య 56% పెరిగింది. మరోవైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 2,630కి చేరింది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య మహారాష్ట్రలో 797కు చేరింది.
19,206 మంది తాజాగా కరోనా నుంచి కోలుకున్నారు. 325 మంది వైరస్తో మృతి చెందారు.
మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. కొత్తగా 26,538 మందికి కరోనా సోకింది. ఒక్క ముంబయిలోనే 15,166 కేసులు నమోదయ్యాయి. 8 మంది వైరస్తో మృతి చెందారు.
మంగళవారంతో పోలిస్తే మహారాష్ట్రలో కేసులు 43.71 శాతం పెరిగాయి.
Also Read: Corona Cases: ఏపీలో మళ్లీ పెరుగుతున్న కరోనా.. తగ్గినట్టే కనిపించి ఎక్కువవుతున్న కేసులు
Also Read: Numaish Exhibition: కరోనా ఎఫెక్ట్.. నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ రద్దు
Godavarikhani Crime: షాకింగ్ - గోదావరిఖనిలో నడి రోడ్డుపై రౌడీ షీటర్ దారుణ హత్య
Bandi Sanjay: ముందస్తుకు మేం కూడా రెడీ, కానీ అదొక్కటే షరతు అంటున్న బండి సంజయ్
BRS Corporators Arrest : మేడిపల్లిలో పేకాట స్థావరంపై దాడి, డిప్యూటీ మేయర్ సహా 7గురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు అరెస్టు
Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజయ్ హర్షం, కానీ నియంత పాలన అంటూ ట్విస్ట్
Srisailam Bus Accident : శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సుకు తప్పిన పెనుప్రమాదం
Lakshmi Parvathi About TarakaRatna: తారకరత్నకు సీరియస్గా ఉంటే ఒక్కరోజైనా పాదయాత్ర ఆపలేరా?: లక్ష్మీపార్వతి ఫైర్
Rajinikanth Notice: ఇక నుంచి అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు - రజనీకాంత్ పబ్లిక్ నోటీస్!
IND vs NZ 2nd T20: న్యూజిలాండ్పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ - మూడో మ్యాచ్ గెలిస్తే సిరీస్ మనదే!
-Rahul Gandhi In Srinagar: ప్రతిపక్షాల మధ్య విభేదాలున్నా, ఆరెస్సెస్- బీజేపీకి వ్యతిరేకంగా ఏకమవుతాం: రాహుల్ గాంధీ