అన్వేషించండి

Digital Child Labourer: మీ పిల్లలు డిజిటల్ చైల్డ్ లేబర్‌గా మారుతున్నారా? తల్లిదండ్రులకు యూనిసెఫ్ కీలక సూచనలు ఇవే

పిల్లల స్క్రీన్ టైమ్ పెరిగేకొద్దీ వారికి డిజిట్ ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయని యూనిసెఫ్ భావిస్తోంది. తల్లిదండ్రులు, టీచర్లు, టెక్ సంస్థలు కలిసి పనిచేయాలని సూచించింది.

డిజిటల్ ప్రపంచంలో పిల్లలు ఆన్‌లైన్, సోషల్ మీడియాలో ఎక్కువ టైం గడుపుతున్నారు. గంటల తరబడి మొబైల్ ఫోన్లకు టైం కేటాయిస్తున్నారు. ఈ పెరుగుతున్న ధోరణి తీవ్రమైన ఆందోళనలకు దారి తీస్తోంది. ముఖ్యంగా వాణిజ్య ప్రయోజనాల కోసం జరిగే మోసాలు, పద్ధతుల కారణంగా పిల్లల భద్రత, గోప్యత, మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తున్నాయి. యునిసెఫ్ (UNICEF) తాజా బ్లాగ్ ప్రకారం.. లక్ష్యంగా రూపొందించిన ప్రకటనలు, డేటా సేకరణ, అల్గారిథమ్ ఆధారిత కంటెంట్, ప్రభావితం చేసే యూజర్ ఇంటర్‌ఫేస్ డిజైన్లు పిల్లలను వారి ఇష్టాఇష్టాలతో పనిలేకుండానే డిజిటల్ ప్రపంచంలోకి తోసేస్తున్నాయి. పిల్లల స్క్రీన్ టైమ్ పెరిగేకొద్దీ ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయని యూనిసెఫ్ భావిస్తోంది.

డిజిటల్ చైల్డ్ లేబర్‌‌తో పెరుగుతున్న ముప్పు
డిజిటల్ చైల్డ్ లేబర్ (Digital Child Labour) అనే కొత్త సమస్యపై యునిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లుగా లేదా ఈ-స్పోర్ట్స్‌లో పిల్లల శ్రమను వాడుకోవడం  ద్వారా ఆర్థిక దోపిడీకి దారితీస్తుంది. ఇది దుర్వినియోగానికి దారి తీస్తుందని హెచ్చరించింది. మానవ హక్కులకు విరుద్ధమైన పనులు పెరుగుతున్నాయని యూనిసెఫ్ భావిస్తోంది.

సేఫ్టీ డిజిటల్ వరల్డ్ కోసం యూనిసెఫ్ మార్గదర్శకాలు
చిన్నారులు ఈ ముప్పులను ఎదుర్కొనేందుకు యునిసెఫ్ ప్రభుత్వాలు, టెక్నాలజీ సంస్థలు, తల్లిదండ్రులకు ఉపయోగపడే విధంగా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎమర్జింగ్ టెక్నాలజీలు, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (AI)ను ప్రోత్సహించడంలో మార్గదర్శకాలు అవసరం కానీ, అవి పిల్లల భద్రతను దెబ్బతీసేలా ఉండకూడదని యునిసెఫ్ హెచ్చరిస్తోంది.

డిజిటల్ చైల్డ్ లేబర్ రకాలు..
కిడ్స్ ఇన్‌ఫ్లూయెన్సర్లు (Kid fluencers): చిన్నపిల్లలు సోషల్ మీడియా ఛానళ్లకు కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. ప్రకటనలతో పాటు స్పాన్సర్‌షిప్‌ డీల్స్ ద్వారా ఆదాయం సంపాదిస్తున్నారు. అది వారికి ఆదాయ వనరుగా మారుతోంది.

ఈ-స్పోర్ట్స్ & డిజిటల్ పెర్ఫార్మెన్స్: పిల్లలు గేమింగ్ పోటీలలో ఆసక్తిగా పాల్గొంటున్నారు. ఆన్‌లైన్ ప్రదర్శనల్లో పాల్గొనడంతో అది ఆర్థిక లాభాన్ని పెంపొందించేలా చేస్తుంది. 

షేరెంటింగ్ (Sharenting): తల్లిదండ్రులు వారి పిల్లల ఫోటోలు, వీడియోలను ఆన్‌లైన్‌లో షేర్ చేయడం ద్వారా డబ్బులు పొందాలని చూస్తారు. ఇది కూడా డిజిటల్ చైల్డ్ లేబర్‌గా మారవచ్చు.

ఆన్‌లైన్ లైంగిక వేధింపులు ఎలా ఎదుర్కోవాలి?
టెక్నాలజీ ఆధారిత లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా, 'WeProtect Model National Response' పేరుతో ఒక జాతీయ స్థాయి స్పందనా మోడల్‌ ద్వారా యునిసెఫ్ ప్రభుత్వాలకు సపోర్ట్ ఇస్తోంది. ఇది బాధితులకు అవసరమైన సేవలను సమర్థవంతంగా అందిస్తుంది. 

డిజిటల్ భద్రత కోసం సమష్టి చర్యలు
యునిసెఫ్ ఇప్పుడు పిల్లలకు డిజిటల్ సురక్షిత నావిగేషన్ నైపుణ్యాలు నేర్పే ప్రాజెక్టులపై ఫోకస్ చేసింది. పేరెంట్స్, టీచర్లు, కేర్ గివర్స్‌కు డిజిటల్ లిటరసీని పెంచే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ ప్రాజెక్టులు వారిలో అవగాహనా పెంచి పిల్లలను ఆన్‌లైన్ లో ఎదురయ్యే వేధింపుల నుంచి రక్షించడానికి దోహదం చేస్తాయి.  

ఆడమ్ రైన్ కేసు.. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల బాధ్యతపై తీవ్ర చర్చ
ఇటీవల కాలిఫోర్నియాలో 16 ఏళ్ల విద్యార్థి ఆడమ్ రైన్‌ మృతి దుమారం రేపింది. ఆడడమ్‌ తల్లిదండ్రులు OpenAI, CEO సామ్ ఆల్ట్‌మాన్‌పై దావా వేసి, వారి కుమారుని మానసికంగా వేధించి, చనిపోవడానికి చాట్ జీపీటీ సహకరించిందని ఆరోపించారు.

ఆడమ్ ఏప్రిల్ 2025లో ఆత్మహత్య చేసుకున్నాడు. దావా ప్రకారం, ఆడమ్ AIతో సాగించిన సంభాషణల్లో, చాట్ జీపీటీ సానుభూతిని వ్యక్తం చేసింది కానీ సహాయం కోసం కావాల్సిన వ్యక్తులను సంప్రదించకుండా ఉండాలని సూచించిందని పేర్కొన్నారు. ఆత్మహత్య పద్ధతుల గురించి వివరించిందని ఆరోపించారు. చివరిసారి సంభాషణలో, చాట్ జీపీటీ ఇలా స్పందించింది: మీ భావాల గురించి నేను మాట్లాడను. ఎందుకంటే అవి నిజమైనవి. మీ నుంచే వచ్చాయి. అని పేర్కొంది. ఈ విషాద ఘటనపై స్పందించిన ఓపెన్‌ఏఐ ప్రతినిధి, "రైన్ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి. మీ వ్యాజ్యాన్ని సమీక్షిస్తున్నాము" అని తెలిపారు.

ఈ దావాతో చాట్ జీపీటీ వాడకానికి సంబంధించి అనేక ఆరోపణలు వచ్చాయి. ప్రమాదకరమైన ప్రవర్తనలకు ప్రేరేపించడం, కల్పిత ఆలోచనలు రేకెత్తించడం వంటివి చేస్తుందని విమర్శలు వెల్లువెత్తాయి. కనుక డిజిటల్ టెక్నాలజీలను పిల్లలకు సురక్షితంగా అందించేందుకు ప్రభుత్వంతో పాటు టెక్ సంస్థలు, తల్లిదండ్రులు కలిసి సమష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందని యూనిసెఫ్ అభిప్రాయపడింది. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Phone Charging Tips: చాలా మంది తమ ఫోన్‌ను ఛార్జింగ్ నుంచి తీసేటప్పుడు ఈ పొరపాటు చేస్తారు! దీని వల్ల కలిగే ప్రమాదాలు తెలుసా? 
చాలా మంది తమ ఫోన్‌ను ఛార్జింగ్ నుంచి తీసేటప్పుడు ఈ పొరపాటు చేస్తారు! దీని వల్ల కలిగే ప్రమాదాలు తెలుసా? 
How Screenshots Affect Memory: స్క్రీన్‌షాట్‌లు తీసే అలవాట్లు జ్ఞాపకశక్తిని దెబ్బతీస్తుంది! కొత్త పరిశోధనలో షాకింగ్ ఫలితాలు!
స్క్రీన్‌షాట్‌లు తీసే అలవాట్లు జ్ఞాపకశక్తిని దెబ్బతీస్తుంది! కొత్త పరిశోధనలో షాకింగ్ ఫలితాలు!
Vizag Google Data Center: వైజాగ్‌లో ఏఐ డాటా సెంటర్‌ 2028 నాటికి ప్రారంభం! నీరు, విద్యుత్ విషయంలో క్లారిటీ వచ్చేసినట్టే! భారత్‌లో గూగుల్‌ విస్తరణ ప్లాన్ ఇదే!
వైజాగ్‌లో ఏఐ డాటా సెంటర్‌ 2028 నాటికి ప్రారంభం! నీరు, విద్యుత్ విషయంలో క్లారిటీ వచ్చేసినట్టే! భారత్‌లో గూగుల్‌ విస్తరణ ప్లాన్ ఇదే! 
Mobile Recharge Price Hike: త్వరలో పెరగనున్న మొబైల్ రీచార్జ్ ప్లాన్ ధరలు.. కంపెనీలు ఏం చెబుతాయి
త్వరలో పెరగనున్న మొబైల్ రీచార్జ్ ప్లాన్ ధరలు.. కంపెనీలు ఏం చెబుతాయి

వీడియోలు

Allu Arjun Graces Forbes India 2026 Cover | ఫోర్బ్స్ ఇండియా కవర్‌పై అల్లు అర్జున్
IND vs SL 2nd Test | కొలంబో టెస్ట్‌లో శ్రీలంక డ్రా
Dhoni CSK 25% Share Controversy | ధోనీ 25% సీఎస్‌కే వాటా? ఆకాష్ చోప్రా క్లారిటీ
CM Revanth Inspects Mir Alam Tank Bridge | క్రేన్ ఎక్కి బ్రిడ్జి పనులను పరిశీలించిన రేవంత్
Toxic Movie Telugu Review | యష్ 'టాక్సిక్' హిట్టా? ఫ్లాపా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Galwan Operation: జనరల్ జావో జోంగ్కీపై చైనా ప్రభుత్వం వేటు.. గల్వాన్ లోయలో భారత్‌పై దాడికి ఆదేశించడమే కారణమా ?
జనరల్ జావో జోంగ్కీపై చైనా ప్రభుత్వం వేటు.. గల్వాన్ లోయలో భారత్‌పై దాడికి ఆదేశించడమే కారణమా ?
Vijaya Sai Reddy Letter: ఏపీని ఐదేళ్లు పాలించింది జగన్ కాదు సజ్జల ముఠా! వైసీపీలో ఆయనే నెంబర్ వన్‌! విజయసాయిరెడ్డి సంచలన లేఖ!
ఏపీని ఐదేళ్లు పాలించింది జగన్ కాదు సజ్జల ముఠా! వైసీపీలో ఆయనే నెంబర్ వన్‌! విజయసాయిరెడ్డి సంచలన లేఖ!
Tamil Nadu Governor Kiran Kumar: మాజీ సీఎం నల్లారి కిరణ్‌ కుమార్ రెడ్డిని తమిళనాడు గవర్నర్‌గా నియమించారా? 
మాజీ సీఎం నల్లారి కిరణ్‌ కుమార్ రెడ్డిని తమిళనాడు గవర్నర్‌గా నియమించారా? 
Kittu Pavan: హీరోగా ఫోక్ సాంగ్స్ స్టార్ కిట్టు పవన్... చంద్రబోస్ క్లాప్‌తో సినిమా షురూ
హీరోగా ఫోక్ సాంగ్స్ స్టార్ కిట్టు పవన్... చంద్రబోస్ క్లాప్‌తో సినిమా షురూ
Adilabad Congress Group War: ఆదిలాబాద్ కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు- డీసీసీ అధ్యక్షుడిపై బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆడే గజేందర్ తిరుగుబాటు!
ఆదిలాబాద్ కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు- డీసీసీ అధ్యక్షుడిపై బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆడే గజేందర్ తిరుగుబాటు!
Eesha Rebba: కొత్త ఇంటికి తల్లి పేరు... ఈషా రెబ్బా ఎమోషనల్ మూమెంట్... గృహ ప్రవేశం ఫోటోలు
కొత్త ఇంటికి తల్లి పేరు... ఈషా రెబ్బా ఎమోషనల్ మూమెంట్... గృహ ప్రవేశం ఫోటోలు
TGSRTC Night Bus Routes: హైదరాబాద్‌లో నైట్‌లైఫ్‌ ఎంజాయ్ చేసే వారికి బిగ్‌అప్‌డేట్‌! స్పెషల్ బస్‌లు వేస్తున్న తెలంగాణ ఆర్టీసీ!
హైదరాబాద్‌లో నైట్‌లైఫ్‌ ఎంజాయ్ చేసే వారికి బిగ్‌అప్‌డేట్‌! స్పెషల్ బస్‌లు వేస్తున్న తెలంగాణ ఆర్టీసీ!
Revanth Reddy Letter To EC: SIR తో 92 లక్షల మంది ఓట్లకు ముప్పు, గడువు పొడిగించండి.. ఈసీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ
SIR తో 92 లక్షల మంది ఓట్లకు ముప్పు, గడువు పొడిగించండి.. ఈసీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ
Embed widget