అన్వేషించండి

Samsung and LG Cases: మోడీ ప్రభుత్వంపై సామ్‌సంగ్, ఎల్‌జీ కంపెనీల కేసులు, ఈ-వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్‌పై వివాదం

Samsung and LG Cases: ఎలక్ట్రానిక్-వ్యర్థాల రీసైక్లింగ్‌ రూల్స్‌కు వ్యతిరేకంగా LG, Samsung గళం విప్పాయి. భారత ప్రభుత్వంపై న్యాయపోరాటానికి సిద్ధపడ్డాయి.

E-Waste Management: ఎలక్ట్రానిక్-వ్యర్థాల రీసైక్లర్లకు చెల్లింపులను పెంచే విధానాన్ని రద్దు చేయాలని దక్షిణ కొరియా కంపెనీలు LG, Samsung భారత ప్రభుత్వంపై పిటిషన్ వేశాయి. దీని వ్యాపారం నిర్వహణపై పెను ప్రభావాన్ని చూపుతోందని అనేక ఇతర పెద్ద కంపెనీలు దీనిపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయని  భారతదేశ పర్యావరణ రూల్స్‌ను సవాలు చేశాయి. ఈ కేసు మంగళవారం విచారణకు రానుంది. వ్యర్థాల నిర్వహణ పద్ధతులపై విదేశీ కంపెనీలు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం మధ్య పెరుగుతున్న వివాదానికి ఈ కేసు ఉదాహరణగా నిలుస్తోంది. దీనిపై కీలకమైన ప్రశ్నలను రాయిటర్స్  సందించింది. ఈ ప్రశ్నలకు రెండు కంపెనీలు ఇంకా స్పందించలేదు. ఇటు భారత పర్యావరణ మంత్రిత్వ శాఖ కూడా ఎటువంటి ప్రతిస్పందన ఇవ్వలేదు.

ఈ కంపెనీలు కూడా మోడీ ప్రభుత్వంపై పిటిషన్ వేశాయి
చైనా, US తర్వాత భారతదేశం మూడో అతిపెద్ద ఈ-వ్యర్థాల ఉత్పత్తిదారుగా ఉంటోంది. కానీ గత సంవత్సరం దేశంలోని ఈ-వ్యర్థాలలో 43 శాతం మాత్రమే రీసైకిల్ అయినట్టు ప్రభుత్వం చెబుతోంది. ఈ రంగంలో 80 శాతం అనధికారిక స్క్రాప్ డీలర్లు ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. వాళ్లు చేస్తున్న రీసైక్లింగ్ పద్ధతులు పర్యావరణానికి ప్రజల ఆరోగ్యానికి మంచిది కాదని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. 

డైకిన్, భారతదేశానికి చెందిన హావెల్స్, టాటా వోల్టాస్ ఇప్పటికే మోడీ ప్రభుత్వంపై పిటిషన్లు వేశాయి. కేంద్ర ప్రభుత్వ తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం ఎలక్ట్రానిక్స్ కంపెనీలు ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, టీవీలు, ఇతర ఉపకరణాలను రీసైకిల్ చేయడానికి ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది, అయితే కంపెనీలు అధిక అనవసరమైన ఖర్చుగా చెబుతున్నాయి. 

ప్రభుత్వం కనీస చెల్లింపును ఎందుకు నిర్ణయించింది?
రీసైక్లర్లకు కనీస ఛార్జ్ వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి వ్యతిరేకంగా Samsung , LG లాబీయింగ్ చేశాయి. అయితే ప్రభుత్వం ఈ-వేస్ట్ రీసైక్లింగ్‌లో పెట్టుబడులను ప్రోత్సహించడం , ఈ రంగంలోకి మరింత అధికారిక డీలర్లను తీసుకురావడం అవసరమని చెబుతోంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా అనధికారిక వ్యర్థాల రీసైక్లింగ్ వ్యవస్థ అభివృద్ధి చెందుతోంది. ఈ పనిలో రీసైక్లర్లు పార్టులను తొలగించిన తర్వాత వ్యర్థాలను బహిరంగంగా కాల్చివేస్తున్నారు. లేదా యాసిడ్ లీచింగ్ వంటి పద్ధతులను అవలంబిస్తారు, ఇది పర్యావరణానికి ప్రమాదకరం.

ప్రభుత్వ కొత్త నిబంధనలతో కంపెనీలకు ఇబ్బంది 
న్యూఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన LG కీలక కామెంట్స్ చేసింది. రీసైక్లర్లకు కనీస మొత్తాన్ని చెల్లించాలన్న నియమం ద్వారా ప్రభుత్వం సాధించాలనుకున్న లక్ష్యాన్ని సాధించలేదనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవడంలో విఫలమైందని పేర్కొంది, 'కాలుష్య కారకాల చెల్లింపు' పేరుతో పన్ను విధించడం ద్వారా కంపెనీలను దోచుకోవడమేనని తెలిపింది. ప్రభుత్వం అనధికారిక రీసైక్లర్లను ఈ నిబంధన పరిధిలోకి తీసుకురాలేకపోతే అది పరిపాలన వైఫల్యమేనని కూడా అభిప్రాయపడింది. 

ధర నిర్ణయించడం ద్వారా పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలు సాధించే వీలు లేదని శామ్సంగ్ తన పిటిషన్‌లో పేర్కొంది. దీనికి కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది. కొత్త నిబంధనల ప్రకారం, వినియోగదారు ఎలక్ట్రానిక్స్ వస్తువులను రీసైక్లింగ్ చేయడానికి కిలోకు కనీసం రూ. 22 , స్మార్ట్‌ఫోన్‌లకు కిలోకు రూ. 34 చెల్లించడం తప్పనిసరి అవుతుందని ఇది భారంగా మారుతుందని తెలిపింది. 

స్మార్ట్‌ఫోన్‌ల వంటి తేలికైన గాడ్జెట్‌లతో పోలిస్తే యూనిట్‌కు రీసైక్లింగ్ ఖర్చు గణనీయంగా పెరిగినందున ఇది ఎయిర్ కండిషనర్ తయారీదారులపై ఎక్కువగా ప్రభావితం అవుతుంది. అమెరికాతో పోలిస్తే భారతదేశ రీసైక్లింగ్ రేట్లు ఇప్పటికీ తక్కువగా ఉన్నాయని పరిశోధనా సంస్థ రెడ్‌సీర్ ఫిబ్రవరిలో తెలిపింది. అమెరికాలో, అవి ఐదు రెట్లు ఎక్కువ, చైనాలో కనీసం 1.5 రెట్లు ఎక్కువ అని వెల్లడించింది. 

టాప్ హెడ్ లైన్స్

Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
స్పీడ్ లవర్స్‌కు గుడ్ న్యూస్‌.. కొత్త 2027 కవాసాకి నింజా 300 వచ్చేసింది, అప్పుడే డెలివరీలు కూడా ప్రారంభం
2027 కవాసాకి నింజా 300 ఎంట్రీ.. యూత్‌ కోసం స్మూత్‌ థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, పవర్‌లో తగ్గేదేలే!
Fridge Water : వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Embed widget