అన్వేషించండి

iPhone Vs Android: ఆండ్రాయిడ్ యూజర్లతో పోలిస్తే ఐఫోన్ యూజర్లకే ఉబెర్ ఛార్జీలు ఎక్కువ!

iPhone Vs Android : సోషల్ మీడియాలో షేర్ చేసిన స్క్రీన్‌షాట్‌ల ప్రకారం, ఆండ్రాయిడ్ వినియోగదారులను రూ. 290.79 చెల్లించమని ఉబెర్ కోరగా, ఐఓఎస్ వినియోగదారులు రూ. 342.47 చెల్లించాలని కోరింది.

iPhone Vs Android : ఆండ్రాయిడ్ యూజర్లతో పోలిస్తే ఐఫోన్ యూజర్లు ఉబెర్ కు ఎక్కువ ఛార్జీలు చెల్లిస్తున్నారనే వార్తలు వైరల్ అవుతన్నాయి. ఒకే ట్రిప్ కోసం రెండు ఫోన్‌లలో వేర్వేరు ధరలుండడంపై నెటిజన్లు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న స్ర్కీన్ షాట్స్ ప్రకారం, ఆండ్రాయిడ్ ఫోన్ లో రూ. 290.79 ధర ఉంటేగా, ఐఫోన్ అదే ట్రిప్‌కు రూ. 342.47గా కనిపించింది. సుధీర్ అనే సోషల్ మీడియా యూజర్ షేర్ చేసిన పోస్ట్ ఈ అసమానతలను ప్రశ్నించింది. 

సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ పోస్ట్ నెటిజన్లను ఆలోచించేలా చేసింది. వారు కూడా ఈ పోస్ట్ కి అంగీకరించారు. తమక్కూడా అలానే అవుతుందన్నారు. కొన్నిసార్లు రెండు ఫోన్లలో రూ.30 -50 కంటే ఎక్కువ తేడా ఉండడం లేదని కొందరు చెప్పారు. మొదటగా ఈ పోస్ట్ లోని అసలైన ఫొటోను లింక్డ్‌ఇన్‌లో వ్యవస్థాపకుడు నిరాలీ పరేఖ్ షేర్ చేసినట్లు సమాచారం. అయితే ఈ సమస్యను మరోసారి హైలైట్ చేయడానికి తాను దాన్ని మళ్లీ పోస్ట్ చేశానని సుధీర్ స్పష్టం చేశాడు.

ఉబెర్ ఏం చెప్పిందంటే..

ఆండ్రాయిడ్, ఆపిల్ ఐఫోన్లలో ఛార్జీల్లో తేడాలపై ఉబెర్ స్పందించింది. ఉపయోగించిన ఫోన్ రకం ఆధారంగా ఉబెర్ ఛార్జీలు విధించదని స్పష్టం చేసింది. బుక్ చేసుకునే టైం, దూరం, డిమాండ్ ను బట్టి ఛార్జీలుంటాయని చెప్పింది. “ఈ రెండు రైడ్‌లలోని అనేక వ్యత్యాసాలు ధరలను ప్రభావితం చేస్తాయి. ఈ అభ్యర్థనలపై పికప్ పాయింట్, ETA, డ్రాప్-ఆఫ్ పాయింట్ మారుతూ ఉంటాయి. దీని వల్ల రెండు ఫోన్ల రకాలలో వివిధ ఛార్జీలు ఉంటాయి. రైడర్ సెల్ ఫోన్ తయారీదారు ఆధారంగా ఉబెర్ ట్రిప్ ధరలను వ్యక్తిగతీకరించదు" అని రైడ్-హెయిలింగ్ యాప్ తెలిపింది.

iPhone Vs Android: అసలైన తేడాలివే

స్మార్ట్ ఫోన్ ను వినియోగిస్తోన్న వాళ్లలో ఐఫోన్ యూజర్ల కంటే ఆండ్రాయిడ్ యూజర్లే ఎక్కువ. ఎందుకంటే ఐఫోన్ ధర చాలా ఎక్కువగా ఉంటుంది. మరికొందరేమో ఆండ్రాయిడ్ ఫోన్స్ ఫ్రెండ్లీ యూజర్ గా ఉంటాయి. అంతే కాకుండా ఆండ్రాయిడ్ యూజర్లతో పోలిస్తే ఐఫోన్ యూజర్లు యాప్‌లు, సబ్‌స్క్రిప్షన్‌లు, ప్రీమియం సర్వీస్ లపై ఎక్కువ ఖర్చు చేస్తాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. సైన్స్-టెక్ టుడే ప్రకారం, ఐఫోన్ యూజర్లు ఒక్కో యాప్‌కు సగటున 12.77 డాలర్లు అంటే రూ. 1,087 చెల్లిస్తారు. అయితే ఆండ్రాయిడ్ యూజర్లు 6.19 డాలర్లు అంటే రూ. 527 ఖర్చు చేస్తారు. ఆండ్రాయిడ్ (Android)పరికరాల కోసం 0.43 డాలర్లు అంటే రూ. 36తో పోల్చితే, యాప్‌లో కొనుగోళ్లు కూడా ఐఫోన్ (iPhone)లకు 1.07 డాలర్లు అంటే రూ. 91 వద్ద ఎక్కువగా ఉన్నాయి. ఈ తరహా తేడాలు ఐఓఎస్ (iOS) యూజర్స్ కోసం కంపెనీలు అధిక ధరలను నిర్ణయించవచ్చనే ఊహాగానాలకు దారితీసింది. అయితే ఈ ఆరోపణలపై ప్రస్తుతానికైతే ఎలాంటి స్పష్టతా లేదు.

Also Read : BSNL Broadband Plan: బీఎస్ఎన్ఎల్ బెస్ట్ వైఫై ప్లాన్ - రోజుకు 200 జీబీ హైస్పీడ్ డేటా!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget