అన్వేషించండి

AIని నియంత్రించే దిశగా ప్రభుత్వం చర్యలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటెంట్‌పై లేబుల్ తప్పనిసరి!

భారత ప్రభుత్వం AI నియంత్రణ నిబంధనలు మార్చింది. AI కంటెంట్‌పై లేబుల్ తప్పనిసరి. ఫోటోలు, వీడియోలు సహా అన్నింటికీ ఇది వర్తిస్తుంది.

భారత ప్రభుత్వం AI ని నియంత్రించడానికి, దాని దుర్వినియోగాన్ని నిరోధించడానికి మొదటి అడుగు వేసింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనల ప్రతిపాదనలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు తమ వినియోగదారులకు AI ద్వారా రూపొందించిన లేదా మార్పు చేసిన ఫోటోలు, వీడియోలతో సహా అన్ని రకాల కంటెంట్‌పై లేబుల్‌లను ఉంచడం తప్పనిసరి చేసింది. ప్రతిపాదనలో లేబులింగ్ బాధ్యతను సోషల్ మీడియా కంపెనీలకు అప్పగించారు, అయితే ఈ కంపెనీలు నిబంధనలను పాటించని ఖాతాలను ఫ్లాగ్ చేయవచ్చు. ఈ నిబంధనలు అమలులోకి వచ్చిన తర్వాత, AI ద్వారా సృష్టించిన, మార్పు చేసిన కంటెంట్‌పై సమాచార లేబుల్ ఉండటం తప్పనిసరి అవుతుంది.        

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత చాలా వీడియోలు, పొటోలు ఒరిజినల్ మాదిరిగానే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. నిజమైనదేదో, ఏఐ కంటెంట్ ఏదో గుర్తించలేని పరిస్థితి వచ్చింది. దీని వల్ల జరిగే ప్రయోజనం కంటే జరిగే నష్టం ఎక్కువగా ఉంటోంది. ప్రజలు మోసపోతున్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు మరింత ఎక్కువ అవుతాయని గ్రహించిన ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇకపై ఇలాంటివి ఉపేక్షిస్తే ప్రమాదమని ఈ కీలక నిర్ణయం తీసుకుంది.         

ఈ మధ్య కాలంలో చాలా ఏఐ రిలేటెడ్‌ యాప్స్ వస్తున్నాయి. నిజమైన కంటెంట్‌ను పోలిన ఏఐ కంటెంట్‌ను జనరేట్ చేస్తున్నారు. దీని వల్ల ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. అనని మాటలను అన్నట్టుగా, చేయని పనులను చేస్తున్నట్టుగా భ్రమింపజేస్తున్నారు. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇకపై ఏఐ ఫొటోలు,వీడియోలు ఇతర కంటెంట్‌పై ఇది ఏఐ జనరేటెడ్ అని వాటర్ మార్క్ ఉండాలి. లేదంటే చర్యలు తీసుకుంటారు.   

లేబుల్ కోసం ఈ షరతులు

కొత్త నిబంధనలు వచ్చిన తర్వాత, సోషల్ మీడియా కంపెనీలు AI కంటెంట్‌పై స్పష్టంగా కనిపించే AI వాటర్‌మార్క్‌ను పోస్ట్ చేయాలి. దీని పరిమాణం లేదా వ్యవధి మొత్తం కంటెంట్‌లో 10 శాతం కంటే ఎక్కువ ఉండకూడదు. ఉదాహరణకు, ఏదైనా AI రూపొందించిన వీడియో 10 నిమిషాలు ఉంటే, అందులో ఒక నిమిషం వరకు AI వాటర్‌మార్క్ కనిపించాలి. కంపెనీలు ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే, వారిపై చర్యలు తీసుకోవచ్చు. 

నవంబర్ 6 వరకు సూచనలు ఇచ్చే సమయం     

ప్రభుత్వం ప్రతిపాదిత నిబంధనలపై పరిశ్రమ వాటాదారుల నుంచి సూచనలను కోరింది. నవంబర్ 6 వరకు ఈ సూచనలను సమర్పించవచ్చు. కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, ఇంటర్నెట్‌లో డీప్‌ఫేక్ కంటెంట్ వేగంగా పెరుగుతోందని అన్నారు. అటువంటి పరిస్థితిలో, కొత్త నిబంధనలు వినియోగదారులు, కంపెనీలు , ప్రభుత్వం జవాబుదారీతనాన్ని పెంచుతాయి. ఒక ప్రభుత్వ అధికారి మాట్లాడుతూ, ప్రభుత్వం AI కంపెనీలతో మాట్లాడిందని, మెటాడేటా ద్వారా AI కంటెంట్‌ను గుర్తించవచ్చని వారు చెప్పారు. ఇప్పుడు డీప్‌ఫేక్‌లను గుర్తించి నివేదించే బాధ్యత కంపెనీలదే. కొత్త నిబంధనల ప్రకారం, AI కంటెంట్‌ను కంపెనీలు తమ కమ్యూనిటీ మార్గదర్శకాలలో చేర్చాలి.      

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Iran Israel Conflict: గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
AP Judicial Academy: ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
Virosh Couple : సీఎం రేవంత్ ఫ్యామిలీని కలిసిన రష్మిక - వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం
సీఎం రేవంత్ ఫ్యామిలీని కలిసిన రష్మిక - వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం
TTD Chairman BR Naidu: అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు

వీడియోలు

Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Pakistan Out of T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్ నుంచి పాకిస్థాన్ అవుట్
India vs West Indies T20 World Cup Team India Batting Lineup | భార‌త అసిస్టెంట్ కోచ్ కీల‌క వ్యాఖ్య‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran Israel Conflict: గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
AP Judicial Academy: ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
Virosh Couple : సీఎం రేవంత్ ఫ్యామిలీని కలిసిన రష్మిక - వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం
సీఎం రేవంత్ ఫ్యామిలీని కలిసిన రష్మిక - వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం
TTD Chairman BR Naidu: అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
Money Laundering Case: జైలులో జీవితం నరకమే... తీహార్‌లో చావు కోసం చూశానని నటి ఆవేదన
జైలులో జీవితం నరకమే... తీహార్‌లో చావు కోసం చూశానని నటి ఆవేదన
Iran New Supreme Leader: ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరు? ఈ కీలక బాధ్యతలు ముళ్ల కిరీటమే!
ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరు? ఈ కీలక బాధ్యతలు ముళ్ల కిరీటమే!
Nawab Cafe OTT : ఆ ఓటీటీలోకి నవాబ్ కేఫ్ - నెల రోజుల్లోపే స్ట్రీమింగ్... ఎప్పుడు, ఏ ప్లాట్ ఫాంలో అంటే?
ఆ ఓటీటీలోకి నవాబ్ కేఫ్ - నెల రోజుల్లోపే స్ట్రీమింగ్... ఎప్పుడు, ఏ ప్లాట్ ఫాంలో అంటే?
Affordable Mileage Bikes: 70 కి.మీ మైలేజ్, అద్భుతమైన ఫీచర్లు.. బడ్జెట్ ధరలో టాప్ 5 బైక్స్ ఇవే
70 కి.మీ మైలేజ్, అద్భుతమైన ఫీచర్లు.. బడ్జెట్ ధరలో టాప్ 5 బైక్స్ ఇవే
Embed widget