అన్వేషించండి

Olympics 2024: బరువు విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నారు, సమయం అడిగినా ఇవ్వలేదు - వినేశ్ ఫోగట్‌ అనర్హతా వేటుపై WFI

Vinesh Phogat: వినేశ్ ఫోగట్ అనర్హతా వేటుపై WFI కీలక వ్యాఖ్యలు చేసింది. తాము సమయం అడిగినా నిర్వాహకులు అంగీకరించలేదని స్పష్టం చేసింది.

Vinesh Phogat Disqualification: వినేశ్‌ ఫోగట్‌పై అనర్హతా వేటు వేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. రెజ్లింగ్‌లో భారత్‌కి పతకం ఖాయం అనుకుంటున్న సమయంలో ఈ వార్త షాక్ ఇచ్చింది. ప్రధాని మోదీ సహా పలువురు దీనిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలోనే వందగ్రాముల బరువు ఎక్కువగా ఉన్నారన్న కారణంగా ఈ పోటీ నుంచి తప్పించారు. అయితే..ఈ నిబంధనపైనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రకటనపై ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ స్పందించింది. వినేశ్ ఫోగట్‌పై అనర్హతా వేటు పడిందని చెప్పేందుకు చాలా చింతిస్తున్నట్టు స్పష్టం చేసింది. ప్రస్తుతానికి ఇంతకు మించి ఏమీ మాట్లాడలేమని వెల్లడించింది. బరువు తగ్గించుకునేందుకు రాత్రంతా ఎంతో కష్టపడిందని, అయినా ఇలా జరిగిందని అసహనం వ్యక్తం చేసింది. అయితే.. ఒలింపిక్స్ నిబంధనల ప్రకారం ఏ అథ్లెట్ అయినా నిర్దేశించిన బరువు లేకపోతే వెంటనే అనర్హత వేటు వేస్తారు. ఈ నిర్ణయం తీసుకోగానే రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI)తో పాటు ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ కాస్త సమయం ఇవ్వాలని అక్కడి నిర్వాహకులను కోరాయి. కానీ అందుకు వాళ్లు అంగీకరించలేదు. 

"మేం చాలా ప్రయత్నించాం. కాస్తంత సమయం ఇవ్వాలని కోరాం. ప్రత్యామ్నాయ మార్గమేమైనా ఉందా అని అడిగాం. కానీ వాళ్లు దేనికీ ఒప్పుకోలేదు. రూల్స్ ప్రకారం నడుచుకోక తప్పదని తేల్చి చెప్పారు. ఈ విషయంలో వాళ్లు చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నారు. మాకు చాలా తక్కువ సమయం ఉంది. అందుకే రాత్రంతా బరువు తగ్గేందుకు ట్రైనింగ్ ఇచ్చాం. ఫోగట్ చాలా కష్టపడింది. ఈ క్రమంలోనే డీహైడ్రేషన్‌కి గురైంది. ప్రస్తుతానికి విశ్రాంతి తీసుకుంటోంది. భారత్‌ గోల్డ్ మెడల్ కోల్పోయిందని చాలా బాధ పడుతున్నాం. మన అథ్లెట్స్ ఎంతో కష్టపడి ఇక్కడి వరకూ వచ్చారు. కనీసం 2-3 మెడల్స్ అయినా రావాలని కోరుకుంటున్నాను"

- సంజయ్ సింగ్, WFI ప్రెసిడెంట్ 

 

వినేశ్‌కి పెరుగుతున్న మద్దతు..

ఇప్పటికే ఈ నిర్ణయం వివాదాస్పదమవుతోంది. కచ్చితంగా కుట్ర జరిగిందని ప్రతిపక్షాలు తీవ్రంగా మండి పడుతున్నాయి. ప్రభుత్వం జోక్యం చేసుకుని ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇండియన్ ఒలిపింక్ అసోసియేషన్‌ని అలెర్ట్ చేశారు. వేరే ఆపషన్స్ ఏమైనా ఉన్నాయేమో చూడాలని ఆదేశించారు. IOA ప్రెసిడెంట్ పీటీ ఉషతో సంప్రదింపులు జరుపుతున్నారు. రాజకీయ, సినీ ప్రముఖుల నుంచి వినేశ్ ఫోగట్‌కి మద్దతు పెరుగుతోంది.

Also Read: Vinesh Phogat: వినేశ్ ఫోగట్ అనర్హత వేటుపై రాజకీయ రగడ, కచ్చితంగా కుట్రేనన్న వాదనలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Bhogapuram Airport : వాయువేగంతో రెడీ అవుతున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు - బోగాపురం మరో శంషాబాద్ కానుందా ?
వాయువేగంతో రెడీ అవుతున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు - బోగాపురం మరో శంషాబాద్ కానుందా ?
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Dussehra 2024: అక్టోబర్ 3 నుంచి బెజవాడ దుర్గ గుడిలో దసరా నవరాత్రులు ప్రారంభం
అక్టోబర్ 3 నుంచి బెజవాడ దుర్గ గుడిలో దసరా నవరాత్రులు ప్రారంభం
Embed widget