అన్వేషించండి

Paris Paralympics 2024: పతక విజేతలకు కేంద్రం నజరానా , ఇక టార్గెట్ 2028పై దృష్టి

Paris Olympics 2024: పారిస్‌ వేదికగా జరిగిన పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు సత్తా చాటారు. 29 పతకాలు సాధించి అద్భుతం చేశారు. దీంతో కేంద్రం అథ్లెట్లకు ప్రోత్సహకాలు ప్రకటించింది.

Paralympics medallists felicitated: పారిస్ ఒలింపిక్స్‌(Paris Olympics 2024)లో భారత అథ్లెట్లు అంచనాలు అందుకోలేక విఫలమైన చోటే.. పారా అథ్లెట్లు సత్తా చాటారు. పారాలింపిక్స్‌(Paralympics 2024) చరిత్రలోనే అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. పారిస్‌ వేదికగా జరిగిన పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు సత్తా చాటారు. చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా 29 పతకాలు సాధించి అద్భుతం చేశారు. ఇప్పటివరకూ టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌ 19 పతకాలు సాధించింది. ఇప్పటివరకూ ఇండియా అత్యుత్తమ ప్రదర్శన. అయితే ఈ పతకాల రికార్డును పారిస్‌ పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు కాల గర్బంలో కలిపేశారు. టార్గెట్‌ 25 లక్ష్యంతో బరిలోకి దిగిన భారత పారా అథ్లెట్లు... ఆ లక్ష్యం కంటే ఎక్కువ పతకాలే సాధించారు.  పారిస్‌లో మొత్తం 84 మందితో కూడిన భారత బృందం బరిలోకి దిగగా... 29 పతకాలు వచ్చాయి. భారత్‌ ఖాతాలో 7 స్వర్ణ పతకాలు.. 9 రజతాలు, 13 కాంస్యాలు ఉన్నాయి. పతకాల పట్టికలో భారత్‌ 18వ స్థానంలో నిలిచింది. పారా ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన అథ్లెట్లకు ప్రభుత్వం, పారిశ్రామిక దిగ్గజాలు నజరాన ప్రకటిస్తున్నాయి. కేంద్రం కూడా అథ్లెట్లకు ప్రోత్సహకాలు ప్రకటించింది.
 
ఎంత ఇచ్చారంటే.. 
ఢిల్లీలో పారాలింపిక్స్‌ పతక విజేతలను కేంద్ర క్రీడామంత్రి మన్‌సుఖ్‌ మాండవియా(Dr. Mansukh Mandaviya) ఘనంగా సన్మానించారు. పతకాలతో భారత ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన అథ్లెట్లకు నజరానాలు కూడా ప్రకటించారు. పారాలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్స్‌ సాధించిన క్రీడాకారులకు రూ.75 లక్షల ప్రోత్సాహకం ప్రకటిస్తున్నట్లు మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు. సిల్వర్‌ మెడల్‌ గెలిచిన వారికి రూ.50 లక్షలు, కాంస్య పతక విజేతలకు రూ.30 లక్షలు నగదు బహుమతి అందజేస్తామని మాండవీయ తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలో మాండవీయ మరో కీలక ప్రకటన చేశారు. 2028లో అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌లో జరిగే పారాలింపిక్స్‌ లో ఇప్పుడు సాధించిన పతకాల కంటే ఎక్కువ మెడల్స్‌ సాధించేలా అథ్లెట్లకు సంపూర్ణ మద్దతు అందిస్తామని వెల్లడించారు. పారా అథ్లెట్లకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామన్న ఆయన... ప్రపంచ క్రీడా వేదికపై ఇటీవల భారత ప్రదర్శన అత్యుత్తమంగా ఉందని కొనియాడారు. 
 
 
భారీ పురోగతి
2016లో జరిగిన పారా ఒలింపిక్స్‌లో భారత్‌ కేవలం నాలుగంటే నాలుగే పతకాలు సాధించింది. ఆ తర్వాత 2020లో టోక్యో వేదికగా జరిగిన విశ్వ క్రీడల్లో టీమిండియా 19 పతకాలు సాధించి పర్వాలేదనిపించింది. పారిస్‌ వేదికగా జరిగిన పారాలింపిక్స్‌లో మాత్రం భారత అథ్లెట్లు అద్భుతమే చేశారు,. పారిస్‌లో 29 పతకాలతో భారత్‌ చరిత్ర సృష్టించింది. ఈ పారాలింపిక్స్‌తో ఇండియా మొత్తం పతకాల సంఖ్య 50 చేరింది. సారి భారతదేశం ట్రాక్ అండ్‌ ఫీల్డ్ విభాగంలో భారత్‌ ఏకంగా 17 పతకాలు గెలిచింది.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu News: చంద్రబాబును ఆకాశానికెత్తేసిన నార్వే మాజీ మంత్రి - సీఎం రిప్లై ఏంటంటే
చంద్రబాబును ఆకాశానికెత్తేసిన నార్వే మాజీ మంత్రి - సీఎం రిప్లై ఏంటంటే
Poonam Kaur: త్రివిక్రమ్‌పై మా అసోసియేషన్‌కు పూనమ్‌ ఫిర్యాదు - గురూజీని ప్రశ్నించండి... సినీ పెద్దలకు నటి రిక్వెస్ట్‌
త్రివిక్రమ్‌పై మా అసోసియేషన్‌కు పూనమ్ ఫిర్యాదు - గురూజీని ప్రశ్నించండి... సినీ పెద్దలకు నటి రిక్వెస్ట్‌
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాజీనామా - లెఫ్టినెంట్ గవర్నర్‌కు రాజీనామా లేఖ సమర్పణ
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాజీనామా - లెఫ్టినెంట్ గవర్నర్‌కు రాజీనామా లేఖ సమర్పణ
Fake News on Minister Birthday : శ్రీవారితో పెట్టుకోవద్దు జగన్ - లోకేష్ వార్నింగ్ - ఏం జరిగిందంటే ?
శ్రీవారితో పెట్టుకోవద్దు జగన్ - లోకేష్ వార్నింగ్ - ఏం జరిగిందంటే ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నిజాం రాజ్యం ఇండియాలో విలీనమయ్యాక ఖాసిం రజ్వీ ఏమయ్యాడు?Operation Kagar Maoists Death Toll | ప్రాణాలు కోల్పోతున్న అడవిలో అన్నలు | ABP Desamసింపుల్‌గా గుడిలో పెళ్లి చేసుకున్న అదితి రావు, సిద్దార్థ - ఫొటోలు వైరల్ట్రాఫిక్ వాలంటీర్లుగా గౌరవంగా బతుకుతామంటున్న ట్రాన్స్‌జెండర్స్‌

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu News: చంద్రబాబును ఆకాశానికెత్తేసిన నార్వే మాజీ మంత్రి - సీఎం రిప్లై ఏంటంటే
చంద్రబాబును ఆకాశానికెత్తేసిన నార్వే మాజీ మంత్రి - సీఎం రిప్లై ఏంటంటే
Poonam Kaur: త్రివిక్రమ్‌పై మా అసోసియేషన్‌కు పూనమ్‌ ఫిర్యాదు - గురూజీని ప్రశ్నించండి... సినీ పెద్దలకు నటి రిక్వెస్ట్‌
త్రివిక్రమ్‌పై మా అసోసియేషన్‌కు పూనమ్ ఫిర్యాదు - గురూజీని ప్రశ్నించండి... సినీ పెద్దలకు నటి రిక్వెస్ట్‌
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాజీనామా - లెఫ్టినెంట్ గవర్నర్‌కు రాజీనామా లేఖ సమర్పణ
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాజీనామా - లెఫ్టినెంట్ గవర్నర్‌కు రాజీనామా లేఖ సమర్పణ
Fake News on Minister Birthday : శ్రీవారితో పెట్టుకోవద్దు జగన్ - లోకేష్ వార్నింగ్ - ఏం జరిగిందంటే ?
శ్రీవారితో పెట్టుకోవద్దు జగన్ - లోకేష్ వార్నింగ్ - ఏం జరిగిందంటే ?
Viral News: దొంగకు దేహశుద్ధి చేసి పులిహోర తినిపించారు - నల్గొండ జిల్లాలో ఘటన, వైరల్ దృశ్యాలు
దొంగకు దేహశుద్ధి చేసి పులిహోర తినిపించారు - నల్గొండ జిల్లాలో ఘటన, వైరల్ దృశ్యాలు
What is Kejriwal strategy : రాజీనామాతో కేజ్రీవాల్ మరోసారి తప్పిదం చేస్తున్నారా ? రాజకీంగా మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నారా ?
రాజీనామాతో కేజ్రీవాల్ మరోసారి తప్పిదం చేస్తున్నారా ? రాజకీంగా మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నారా ?
Devara: దేవర మేనియా - అక్కడ భారీగా మిడ్‌నైట్ బెనిఫిట్‌ షోలకు ప్లాన్‌, టికెట్‌ రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే!
దేవర మేనియా - అక్కడ భారీగా మిడ్‌నైట్ బెనిఫిట్‌ షోలకు ప్లాన్‌, టికెట్‌ రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే!
Telugu News: మేకపాటి విరాళానికి రాజకీయం అడ్డంకి- చంద్రబాబుకు స్పీడ్ పోస్టు- తెలంగాణలో మాత్రం నేరుగా అందజేత!
మేకపాటి విరాళానికి రాజకీయం అడ్డంకి- చంద్రబాబుకు స్పీడ్ పోస్టు- తెలంగాణలో మాత్రం నేరుగా అందజేత!
Embed widget