అన్వేషించండి

Paralympics 2024: మరో క్రీడా సంబురం, 25 పతకాలే భారత్‌ లక్ష్యం

Paralympics 2024: . ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా పారా ఒలింపిక్స్‌ క్రీడలు ప్రారంభం కానున్నాయి. 12 రోజుల పాటు కొనసాగనున్న ఈ టోర్నీలో భారత్ తరపున 84 మంది అథ్లెట్లు రంగంలోకి దిగుతున్నారు.

The Paralympic Games Will Start From Today: మరో క్రీడా సంరంభం ఆరంభమైంది. పారిస్‌ మరో క్రీడా సంబరానికి వేదికైంది. దివ్యాంగుల కోసం జరిగే ఈ విశ్వ క్రీడల్లో మొత్తం 168 దేశాల నుంచి 4400 మంది అథ్లెట్లు  తమ సత్తా చాటేందుకు పాల్గొంటున్నారు. పారిస్‌ ఒలింపిక్స్‌(Olympic Games Paris 2024)ను స్వర్ణ పతకం లేకుండా ముగించిన భారత బృందం.. పారాలింపిక్స్‌(Para Olympics 2024)లో మాత్రం పసిడి పతకాన్ని సాధించాలని పట్టుదలగా కసిగా ఉంది. నేటి నుంచి పారాలింపిక్స్‌  పారిస్‌ వేదికగా ప్రారంభం కాబోతున్నాయి. అభిమానుల్లో స్ఫూర్తిని నింపేందుకు.. క్రీడల్లో దివ్యాంగుల ప్రతిభను క్రీడా ప్రపంచానికి చాటేందుకు పారాలింపిక్స్‌ సిద్ధమైంది. 11 రోజుల పాటు పారిస్ పారాలింపిక్స్‌ మనల్ని అలరించి స్ఫూర్తి నింపబోతున్నాయి. ఇవాళ డిలా కాంకార్డ్‌ వేదికలో పారాలింపిక్స్‌ సందడిగా ఆరంభం కానున్నాయి. ఒలింపిక్స్‌ లాగానే పారాలింపిక్స్‌ కూడా చరిత్రలో తొలిసారి స్టేడియంలో కాకుండా బహిరంగ ప్రదేశంలో ఆరంభం కానున్నాయి. పారిస్‌ ఒలింపిక్స్‌ జరిగిన క్రీడా వేదికల్లోనే పారాలింపిక్స్‌ క్రీడలు కూడా జరగనున్నాయి. చైనా 282 మందిని అత్యధికంగా పారాలింపిక్స్‌కు పంపుతోంది.
 
 
భారత్‌ నుంచి బరిలో 84 మంది
పారాలింపిక్స్‌లో భారత్‌ 84 మందితో బరిలోకి దిగనుంది. ఈసారి భారత్‌పై భారీగా పతక ఆశలు ఉన్నాయి. అథ్లెటిక్స్‌ (38), బ్యాడ్మింటన్‌ (13), షూటింగ్‌ (10), ఆర్చరీ (6), పవర్‌లిఫ్టింగ్‌ (4), పారా కనోయింగ్‌ (3), సైక్లింగ్, జూడో, టేబుల్‌ టెన్నిస్, రోయింగ్‌ (2), తైక్వాండో, స్విమ్మింగ్‌ (1) మన అథ్లెట్లు పోటీపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి జీవాంజి దీప్తి, కొంగనపల్లి నారాయణ, షేక్‌ అర్షద్‌, రొంగలి రవి పారిస్‌కు వెళ్లారు. టోక్యో క్రీడల్లో స్వర్ణం నెగ్గిన కృష్ణ నగార్, సుమిత్‌ అంటిల్, మనీశ్‌ నర్వాల్‌ ఈసారి ఆ పతకాన్ని నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉన్నారు.  చేతులు లేకపోయినా విలువిద్యలో అద్భుతాలు చేసే శీతల్‌ దేవి తొలి పారాలింపిక్స్‌లో తన ముద్ర వేయాలనే సంకల్పంతో ఉంది. 2020 టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌ 5 బంగారు పాతకాలతో కలిపి  19 పతకాలు సాధించింది. ఈసారి 25 పతకాలు అయినా తేవాలని నిశ్చయించుకుంది. భాగ్యశ్రీ జాదవ్, సుమిత్‌ అంటిల్‌ ఇండియా ఫ్లాగ్‌ బేరర్‌లుగా ఉండనున్నారు. 
 
 
సమయమిలా...
పారిస్‌లోని పారాలింపిక్స్‌లో ఈవెంట్‌లు ఉదయం 11 గంటలకు ఆరంభం అవుతాయి. అర్ధరాత్రి వరకు కొనసాగుతాయి. భారత్‌ ఈవెంట్‌లు అన్నీ దాదాపుగా సాయంత్రం, రాత్రి వేళల్లో జరుగుతాయి. పారిస్ పారాలింపిక్స్‌లో 22 క్రీడలలో 549 ఈవెంట్‌లలో పతక పోటీలు జరుగుతాయి. వీటిలో 12 క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం ఉంటుంది. అథ్లెట్ల శారీరక బలహీనత, కార్యకలాపాల స్థాయిని బట్టి 'స్పోర్ట్ క్లాస్'లుగా విభజిస్తారు. దృష్టి లోపం, మేధోపరమైన బలహీనతతో పాటుగా ఎనిమిది రకాల శారీరక వైకల్యాలను పారాలింపిక్స్‌లో వర్గీకరించారు. పారాలింపిక్స్‌లో 167 దేశాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. రష్యా, బెలారస్ దివ్యాంగులు తటస్థ పారా అథ్లెట్లుగా బరిలో దిగుతున్నారు.
 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలులెబనాన్‌లో పేజర్ పేలుళ్ల కలవరం, ఇజ్రాయేల్‌పై ఆరోపణలుభారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Balineni Srinivasa Reddy: జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Embed widget