అన్వేషించండి

CSK Vs PBKS: కింగ్స్ పోరులో పంజాబ్ విజయం - ఓటముల్లో చెన్నై హ్యాట్రిక్!

ఐపీఎల్‌లో నేటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై పంజాబ్ కింగ్స్ 54 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఐపీఎల్ 2022లో చెన్నైకి వరుసగా మూడో ఓటమి ఎదురైంది. పంజాబ్ కింగ్స్ చేతిలో 54 పరుగుల తేడాతో చెన్నై చిత్తుగా ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. అనంతరం చెన్నై 18 ఓవర్లలో 126 పరుగులకే ఆలౌట్ అయింది. అర్థ సెంచరీ చేయడంతో పాటు రెండు వికెట్లు కూడా తీసుకున్న లివింగ్‌స్టోన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

ఆరంభం అరిపించినా...
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. కెప్టెన్, ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌ను (4: 2 బంతుల్లో, ఒక ఫోర్) ఇన్నింగ్స్ రెండో బంతికే ముకేష్ చౌదరి అవుట్ చేశాడు. ఇక ఫాంలో ఉన్న వన్‌డౌన్  బ్యాటర్ భనుక రాజపక్స (9: 5 బంతుల్లో, ఒక సిక్సర్) రెండో ఓవర్లో ధోని మార్కు మెరుపు రనౌట్‌కు పెవిలియన్ బాట పట్టాడు. దీంతో పంజాబ్ 14 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఈ దశలో శిఖర్ ధావన్‌తో (33: 24 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) జత కలిసిన లియాం లివింగ్‌స్టోన్ (60: 32 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లు) సిక్సర్లతో చెలరేగాడు. ముకేష్ చౌదరి వేసిన ఐదో ఓవర్లో లివింగ్ స్టోన్ కొట్టిన 108 మీటర్ల సిక్సర్ టోర్నమెంట్‌లోనే అతి పెద్దది. ఈ ఓవర్లో లివింగ్ స్టోన్ రెండు సిక్సర్లు, మూడు ఫోర్లతో 26 పరుగులు పిండుకున్నాడు. వీరిద్దరూ 50 పరుగుల భాగస్వామ్యాన్ని కేవలం 27 బంతుల్లోనే అందుకున్నారు. మరో వైపు శిఖర్ కూడా వేగం పెంచడంతో పవర్‌ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ రెండు వికెట్ల నష్టానికి ఏకంగా 72 పరుగులు సాధించింది.

జడేజా బౌలింగ్‌లో లివింగ్‌స్టోన్‌ను క్యాచ్‌ను రాయుడు వదిలేశాడు. ఆ తర్వాత కూడా లివింగ్ స్టోన్ సిక్సర్లతో చెలరేగాడు. మూడో వికెట్‌కు 52 బంతుల్లోనే 95 పరుగులు జోడించిన అనంతరం ఇన్నింగ్స్ 10వ ఓవర్లో బ్రేవో బౌలింగ్‌లో ధావన్ అవుటయ్యాడు. ప్రమాదకరంగా మారిన లివింగ్‌స్టోన్‌ను కూడా జడేజా అవుట్ చేయడంతో చెన్నై తిరిగి మ్యాచ్‌లోకి వచ్చింది.

ఆ తర్వాత చెన్నై పంజాబ్‌ను అస్సలు కోలుకోనివ్వలేదు. వరుస విరామాల్లో వికెట్లు తీస్తూనే ఉన్నారు. యువ ఆటగాడు జితేష్ శర్మ కాసిన్ని మెరుపులు మెరిపించాడు. అయితే డ్వేన్ ప్రిటోరియస్ తెలివైన బంతికి నిర్లక్ష్యమైన షాట్ ఆడి రాబిన్ ఊతప్ప చేతికి చిక్కాడు. తర్వాత వచ్చిన బ్యాటర్లలో ఎవరూ నిలదొక్కుకోలేకపోవడంతో ఒక దశలో 230 పరుగుల వరకు చేస్తుందనుకున్న పంజాబ్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 180 పరుగులకే పరిమితం అయింది. మొదటి 10 ఓవర్లలో 109 పరుగులు చేసిన పంజాబ్ కింగ్స్, చివరి 10 ఓవర్లలో కేవలం 71 పరుగులు మాత్రమే సాధించగలిగింది.

దూబే దమ్ము సరిపోలేదు...
ఇక 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి చెన్నై 27 పరుగులు మాత్రమే చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత ఎనిమిదో ఓవర్లో అంబటి రాయుడు (13: 21 బంతుల్లో, రెండు ఫోర్లు) కూడా అవుటయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు కేవలం 36 పరుగులు మాత్రమే.

ఆ తర్వాత శివం దూబే (57: 30 బంతుల్లో, ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు), మహేంద్ర సింగ్ ధోని (23: 28 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) చెన్నైని ఆదుకున్నారు. ఈ దశలోనే శివం దూబే కేవలం 26 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేశాడు. ఆరో వికెట్‌కు 62 పరుగులు జోడించిన అనంతరం వేగంగా ఆడే ప్రయత్నంలో దూబే అవుటయ్యాడు.

ఆ తర్వాత డ్వేన్ బ్రేవో (0: 1 బంతి), డ్వేన్ ప్రిటోరియస్ (8: 4 బంతుల్లో, ఒక సిక్సర్) కూడా అవుట్ కావడంతో ఒత్తిడంతా ధోనిపై పడింది. వేగంగా ఆడబోయి రాహుల్ చాహర్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. దీంతో చెన్నై పరాజయం దాదాపుగా ఖాయం అయింది. అదే ఓవర్లో క్రిస్ జోర్డాన్ (5: 5 బంతుల్లో) కూడా అవుట్ కావడంతో చెన్నై 18 ఓవర్లలో 126 పరుగులకు ఆలౌట్ అయింది. పంజాబ్ బౌలర్లలో రాహుల్ చాహర్ మూడు వికెట్లు తీయగా... లియామ్ లివింగ్ స్టోన్, వైభవ్ అరోరా రెండేసి వికెట్లు తీశారు. రబడ, అర్ష్‌దీప్ సింగ్, ఒడియన్ స్మిత్‌లకు తలో వికెట్ దక్కింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
DGP  Ravi Gupta : ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం  చేశారో తెలుసా ?
ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం చేశారో తెలుసా ?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Congress Leader Feroz Khan |ఒవైసీ ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా: ABP Straight Talkలో ఫిరోజ్‌ఖాన్SRH vs RCB AT Uppal | Fans Reactions | ఉప్పల్ వద్ద ఫ్యాన్స్ రచ్చ.. కోహ్లీ ఫ్యాన్సే పాపం..! | ABPCM Revanth Reddy on PM Modi | రాజ్యాంగాన్ని మార్చే కుట్ర బీజేపీ చేస్తుందన్న రేవంత్ రెడ్డి | ABPPawan Kalyan From Pithapuram | Public Opinion | పిఠాపురం గుండె చప్పుడు ఏంటీ..? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
DGP  Ravi Gupta : ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం  చేశారో తెలుసా ?
ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం చేశారో తెలుసా ?
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Chandragiri Tension : చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత  - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
Embed widget