అన్వేషించండి

IPL 2021 Rule Changes: IPLలో కొత్త రూల్స్... ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని రెండో దశ ఐపీఎల్‌ కోసం సరికొత్త రూల్స్‌(NEW RULES)ని తీసుకొచ్చింది.

కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది IPL-2021 మధ్యలోనే అర్థంతరంగా ఆగిపోయింది. మిగిలిన మ్యాచ్‌లను నిర్వహించేందుకు ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయి. యూఏఈ(UAE)వేదికగా లీగ్‌లో మిగిలిపోయిన 31 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇప్పటికే రెండో దశ లీగ్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) ప్రకటించింది. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 15 వరకు ఈ మెగా టోర్నీ సెకెండ్‌ హాఫ్‌ జరగనుంది. అయితే IPLతొలి దశలో ఎదురైన సమస్యలకు చెక్‌ పెట్టేందుకు బీసీసీఐ తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టింది. 


ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని రెండో దశ ఐపీఎల్‌ కోసం సరికొత్త రూల్స్‌(NEW RULES)ని తీసుకొచ్చింది. ఎవరైనా బ్యాట్స్‌మెన్ బంతిని స్టాండ్స్‌లోకి బాదితే... ఆ బంతిని తిరిగి ఉపయోగించవద్దనే నిబంధనను తెరపైకి  తెచ్చింది. ఎందుకంటే... బంతి స్టాండ్స్‌లోకి వెళ్లినప్పుడు ఇతరులు తాకే అవకాశం ఉంది. దీంతో ఆటగాళ్లకు కరోనా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఆ బంతి స్థానంలో కొత్త బంతిని వినియోగించాలని బీసీసీఐ ప్రతిపాదించింది. ఐపీఎల్‌ సెకెండ్‌ ఫేస్‌ మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతిస్తున్నందున ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చినట్లు బీసీసీఐ స్పష్టం చేసింది.


IPL 2021 Rule Changes: IPLలో కొత్త రూల్స్... ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

కాగా, బీసీసీఐ ప్రతిపాదించిన ఈ కొత్త రూల్‌ బ్యాట్స్‌మెన్లకు లాభం చేకూరుతుంది. కానీ, బౌలర్లు మాత్రం టెన్షన్‌. ఎందుకంటే కొత్త బంతి హార్డ్‌గా ఉంటూ సులువుగా బ్యాట్‌ పైకి వస్తుంది. పైగా యూఏఈ పిచ్‌లు స్పిన్నర్లకు సహకరిస్తాయి. అయితే ఈ నిబంధన కారణంగా కొత్త బంతి వచ్చిన ప్రతీసారి బౌలర్లు దానికి అనుగుణంగా బౌల్‌ చేయాల్సి ఉంటుంది. దీంతో బౌలర్లకు బంతిపై పట్టుచిక్కలంటే కష్టమే. ఇది బ్యాట్స్‌మెన్‌కు అడ్వాంటేజ్‌గా మారుతుంది. అందుకే ఈ నిబంధన బౌలర్ల‌కు పెద్ద శిక్షేనని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. స్టాండ్‌కు వెళ్లే బంతిని పూర్తిగా శుభ్రపరిచిన తర్వాత బాల్ లైబ్రరీలో దాచనున్నారు. ఈ ఒక్క నిబంధనే కాదు... చాలా కొత్త నిబంధనలు తీసుకువచ్చింది BCCI.ఇదంతా ఆటగాళ్ల భద్రత కోసమే అని స్పష్టం చేస్తోంది బీసీసీఐ. 

* బంతి షైన్ కోసం ఆటగాళ్లు ఉమ్మి రాస్తారు. కరోనా కారణంగా ఉమ్మి రాయడాన్ని నిలిపివేశారు. ఒకవేళ ఏ ఆటగాడైనా మర్చిపోయి ఉమ్మి రాస్తే అంపైర్ ముందుగా వార్నింగ్ ఇస్తారు. అయినప్పటికీ అలాగే చేస్తే ప్రత్యర్థి జట్టుకు 5 పరుగులు ఇస్తారు. 


* ఎవరైనా ఫ్రాంఛైజీ సభ్యులు, కుటుంబసభ్యులు బయో బబుల్ నిబంధనలను ఉల్లంఘిస్తే మాత్రం ఊరుకునేది లేదని BCCI మరోమారు స్పష్టం చేసింది. 


రెండో విడత ఐపీఎల్‌ మ్యాచులు వచ్చే నెల 19 నుంచి అక్టోబర్‌ 15 వరకు జరుగనున్నాయి. తొలి మ్యాచ్ ముంబయి ఇండియన్స్ x చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. 

 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirupati Laddu Controversy : రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
Supreme Court On Note For Vote Case: ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
Rangarajan: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
Tirumala Tirupati Laddu: తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చాలా బాధగా ఉంది, చర్యలు తీసుకోవాల్సిందే - లడ్డు వివాదంపై పవన్ కామెంట్స్చార్మినార్ వద్ద అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడిన మంటలుJani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Laddu Controversy : రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
Supreme Court On Note For Vote Case: ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
Rangarajan: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
Tirumala Tirupati Laddu: తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
Share Market Record 20 Sept: స్టాక్‌ మార్కెట్లలో రికార్డ్‌ రన్‌ - సెన్సెక్స్ 1300pts జంప్‌, 25,800 పైన నిఫ్టీ
స్టాక్‌ మార్కెట్లలో రికార్డ్‌ రన్‌ - సెన్సెక్స్ 1300pts జంప్‌, 25,800 పైన నిఫ్టీ
Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... వీరమల్లు సెట్స్‌లోకి మళ్లీ జనసేనాని వచ్చేది ఆ రోజే
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... వీరమల్లు సెట్స్‌లోకి మళ్లీ జనసేనాని వచ్చేది ఆ రోజే
iPhone 16 Sale: రిలీజ్‌ సినిమా టికెట్లలా ఐఫోన్ 16 కోసం యుద్ధాలు! - యాపిల్​ స్టోర్ల బయట భారీగా యూజర్స్​!
రిలీజ్‌ సినిమా టికెట్లలా ఐఫోన్ 16 కోసం యుద్ధాలు! - యాపిల్​ స్టోర్ల బయట భారీగా క్యూలు​!
IND vs BAN : బంగ్లా పతనం ఆరంభం, మెరిసిన ఆకాశ్‌ దీప్
బంగ్లా పతనం ఆరంభం, మెరిసిన ఆకాశ్‌ దీప్
Embed widget