అన్వేషించండి

Riyaz Encounter Nizamabad: రియాజ్ ఎన్‌కౌంటర్‌పై స్పందించిన డీజీపీ- అందుకే కాల్పులు జరిపినట్టు ప్రకటన 

Riyaz Encounter Nizamabad: ప్రజల ప్రాణాలు కాపాడేందుకే రియాజ్‌పై కాల్పులు జరపాల్సి వచ్చిందని డీజీపీ తెలిపారు. నిజామాబాద్‌లో జరిగిన ఘటనపై ఆయన స్పందించారు. 

Riyaz Encounter Nizamabad: నిజామాబాద్‌లో జరిగిన రియాజ్ ఎన్‌కౌంటర్‌పై రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి స్పందించారు. ఇప్పటికే కానిస్టేబుల్‌ను హత్య చేసి మరికొందరిని గాయపరిచిన వ్యక్తి చేతికి గన్ వచ్చి ఉంటే ఆసుపత్రిలో బీభత్స జరిగేది అన్నారు. అందుకే అన్నింటి గురించి ఆలోచించిన తర్వాత పోలీసులు కాల్పులు జరిపారని పేర్కొన్నారు. మరోవైపు ఇలాంటి ఘటనలపై ప్రతిపక్షంగా ఘాటుగా విమర్శలు చేస్తోంది. రాష్ట్రంలో గన్ కల్చర్ పెరిగిపోయిందని పోలీసులకు రక్షణ లేకుండా పోతుందని ఆరోపిస్తోంది. 

రియాజ్ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. పోలీసుల భద్రతపై కూడా అనేక అనుమానాలు నెలకొన్నాయి. మూడు రోజుల క్రితం కానిస్టేబుల్‌ను హత్య జరిగిన తర్వాత ఈ కేసు ఎంత సంచలనంగా మారిందో ఇప్పుడు హంతకుడి ఎన్‌కౌంటర్ దేశవ్యాప్తం సంచలనంగా మారింది. అరెస్టు అయ్యి 24 గంటల కాక ముందే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి ఎన్‌కౌంటర్‌లో హతమవ్వడం పెను ప్రకంపనలు సృష్టించింది. అందుకే దీనిపై డీజీపీ కీలక ప్రకటన చేశారు. ప్రజల ప్రాణాలుక కాపాడేందుకే ఎన్‌కౌంటర్ చేసినట్టు తెలిపారు. ఇప్పటికే కానిస్టేబుల్‌ను హత్య చేసి, మరికొందర్ని తీవ్రంగా గాయపరిచిన వ్యక్తి చేతిలో గన్ పడితే ఎలాంటి ప్రమాదం జరుగుతుందో అని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే పోలీసులు ఆసుపత్రిలో గన్ ఫైర్ ఓపెన్ చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. 

శుక్రవారం నుంచి సోమవారం వరకు అనేక మలుపులు 

శుక్రవారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు రియాజ్ కేసులో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. బైక్ చోరీలు, ఇతర నేరాల్లో కీలక నిందితుడిగా ఉన్న రియాజ్ కోసం చాలా కాలంగా పోలీసులు వెతుకుతున్నారు. శుక్రవారం సాయంత్రం ఇతని గురించి పోలీసులకు ఓ లీడ్ దొరికింది. అతను ఉన్న ప్రాంతం గురించి తెలిసిన వెంటనే కానిస్టేబుల్ ప్రమోద్‌ తాను ఆసుపత్రికి వెళ్లడం మానేసి తన మేనల్లుడిని బైక్‌పై ఎక్కించుకొని రియాజ్ ఉన్న ప్రాంతానికి వెళ్లాడు. ఇంతలో స్టేషన్‌కు సమాచారం ఇచ్చాడు. వాళ్లు కూడా వచ్చారు. ఇంతలో కానిస్టేబుల్ ప్రమోద్‌ను పట్టుకొని తన పైక్‌పై కూర్చొబెట్టుకొని స్టేషన్‌కు తీసుకెళ్లడం ప్రారంభించాడు. ప్రమోద్ బైక్ డ్రైవ్ చేస్తుంటే రియాజ్ మధ్యలో కూర్చొని ఉన్నాడు. వెనుకాల ప్రమోద్ మేనల్లుడు ఉన్నాడు. 

బైక్‌ స్టేషన్‌కు వెళ్తున్న టైంలో రియాజ్ ఎదురు తిరిగాడు. అప్పటి వరకు సైలెంట్‌గా కూర్చొని ఉన్న రియాజ్ తన వద్ద ఉన్న కత్తిని ప్రమోద్ గుండెల్లో దించాడు. అంతే బైక్‌ పక్కతో కిందపడిపోయాడు. రియాజ్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించిన ప్రమోద్ మేనల్లుడు కూడా ప్రయత్నించాడు. వెనకాలే వస్తున్న ఎస్సై కూడా ట్రై చేశాడు. కానీ వారిద్దర్ని గాయపరిచి పారిపోయాడు రియాజ్.

కానిస్టేబుల్‌ను హత్య చేసి ఎస్సైతోపాటు పౌరుడిని గాయపరిచి పారిపోయిన రియాజ్ కేసు తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది. పోలీసులకే రక్షణ కరవైందని ప్రతిపక్షాలు విమర్శు చేయడం మొదలు పెట్టాయి. నేరస్తులు రెచ్చిపోతున్నారని ఆరోపించాయి. దీంతో కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసి రియాజ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రెండు రోజుల తర్వాత ఆదివారం వాళ్లకు లీడ్ దొరికింది. సారంగపూర్ అటవీ ప్రాంతంలో ఉన్నట్టు తెలిసింది. వెంటనే వెళ్లి పట్టుకునేందుకు యత్నించారు. కానీ అక్కడ కూడా పోలీసులపై ఎదురు తిరిగేందుకు రియాజ్ ట్రై చేశాడు. అతన్ని పట్టుకునే క్రమంలో ఓ యువకుడు కూడా గాయపడ్డాడు. 

పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో గాయపడిన రియాజ్‌ను, అతన్ని పట్టుకునే ప్రయత్నంలో గాయపడిన మరో యువకుడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. రియాజ్‌ దుర్మార్గం గురించి తెలిసిన పోలీసులు అతని కాళ్లు చేతులు కట్టేసి మరీ ఆసుపత్రికి తరలించారు. నిజామాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఈ ఉదయం ఎక్స్‌రే కోసం తరలిస్తుండగానే ఏఆర్ కానిస్టేబుల్ వద్ద ఉన్న గన్ లాక్కున్నాడు రియాజ్. ఆ గన్‌తో బెదిరించడం మొదలు పెట్టాడు. ప్రజలపైకి కూడా కాల్పులు జరిపేందుకు యత్నించాడు. దీంతో ఆత్మరక్షణ, ప్రజల ప్రాణాల రక్షణ కోసం పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎదురు కాల్పుల్లో రియాజ్ హతమయ్యాడు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bihar Election 2025:  బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గురువారం 121 స్థానాల్లో పోలింగ్; బరిలో 16 మంది మంత్రులు సహా 1314 మంది అభ్యర్థులు
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గురువారం 121 స్థానాల్లో పోలింగ్; బరిలో 16 మంది మంత్రులు సహా 1314 మంది అభ్యర్థులు
Andhra ACB Raids: ఒకే సారి 120 చోట్ల ఏసీబీ రెయిడ్స్ -ఏపీలో భారీ ఆపరేషన్ -సంచలన వివరాలు
ఒకే సారి 120 చోట్ల ఏసీబీ రెయిడ్స్ -ఏపీలో భారీ ఆపరేషన్ -సంచలన వివరాలు
Akbaruddin Owaisi: అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే  - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan:  అవనిగడ్డ ఎదురుమొండి దీవుల ప్రజల చిరకాల కోరిక తీరుస్తున్న పవన్ -  కృష్ణా నదిపై హై లెవల్ వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
అవనిగడ్డ ఎదురుమొండి దీవుల ప్రజల చిరకాల కోరిక తీరుస్తున్న పవన్ - కృష్ణా నదిపై హై లెవల్ వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
Advertisement

వీడియోలు

Ghazala Hashmi New Lieutenant Governor | వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ గా తొలి ముస్లిం మహిళ | ABP Desam
Zohran Mamdani won Newyork Mayor Election |  న్యూయార్క్ మేయర్ గా గెలిచిన జోహ్రాన్ మమ్ దానీ | ABP Desam
పాక్ ప్లేయర్ తిక్క కుదిర్చిన ICC.. కానీ మన సూర్యకి అన్యాయం!
రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ బర్త్ డే స్పెషల్
ఫెషాలీ, దీప్తి కాదు.. తెలుగమ్మాయి వల్లే గెలిచాం: రవిచంద్రన్ అశ్విన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bihar Election 2025:  బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గురువారం 121 స్థానాల్లో పోలింగ్; బరిలో 16 మంది మంత్రులు సహా 1314 మంది అభ్యర్థులు
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గురువారం 121 స్థానాల్లో పోలింగ్; బరిలో 16 మంది మంత్రులు సహా 1314 మంది అభ్యర్థులు
Andhra ACB Raids: ఒకే సారి 120 చోట్ల ఏసీబీ రెయిడ్స్ -ఏపీలో భారీ ఆపరేషన్ -సంచలన వివరాలు
ఒకే సారి 120 చోట్ల ఏసీబీ రెయిడ్స్ -ఏపీలో భారీ ఆపరేషన్ -సంచలన వివరాలు
Akbaruddin Owaisi: అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే  - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan:  అవనిగడ్డ ఎదురుమొండి దీవుల ప్రజల చిరకాల కోరిక తీరుస్తున్న పవన్ -  కృష్ణా నదిపై హై లెవల్ వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
అవనిగడ్డ ఎదురుమొండి దీవుల ప్రజల చిరకాల కోరిక తీరుస్తున్న పవన్ - కృష్ణా నదిపై హై లెవల్ వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
YSRCP Leader Roja: తమిళ సినిమాల్లో బిజీ అవుతున్న రోజా - టీవీ షోలు కూడా - రాజకీయాలకు దూరమేనా?
తమిళ సినిమాల్లో బిజీ అవుతున్న రోజా - టీవీ షోలు కూడా - రాజకీయాలకు దూరమేనా?
Mexican president kiss: మెక్సికో అధ్యక్షురాలికి చేదు అనుభవం - ప్రజల కష్టాలు తెలుసుకుంటూంటే హత్తుకుని ముద్దుపెట్టుకున్న వ్యక్తి !
మెక్సికో అధ్యక్షురాలికి చేదు అనుభవం - ప్రజల కష్టాలు తెలుసుకుంటూంటే హత్తుకుని ముద్దుపెట్టుకున్న వ్యక్తి !
India Test Team Against South Africa : దక్షిణాఫ్రికాతో జరిగే టెస్ట్ జట్టును ప్రకటించిన BCCI, టీంలోకి వచ్చిన రిషబ్ పంత్
దక్షిణాఫ్రికాతో జరిగే టెస్ట్ జట్టును ప్రకటించిన BCCI, టీంలోకి వచ్చిన రిషబ్ పంత్
Train Accident: చునార్ రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం, రైలు ఢీకొని పలువురు దుర్మరణం
చునార్ రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం, రైలు ఢీకొని పలువురు దుర్మరణం
Embed widget