By : ABP Desam | Updated: 28 Aug 2021 05:14 PM (IST)
ఇంగ్లండ్తో లీడ్స్లో జరిగిన మూడో టెస్టులో టీమిండియా చేతులెత్తేసింది. బౌలింగ్ బ్యాటింగ్ అన్ని విభాగాల్లోనూ అత్యంత ఘోరమైనా విఫల్యంతో ఇన్నింగ్స్ ఓటమి తన ఖాతాలో వేసుకుంది. రెండు ఇన్నింగ్స్ల్లోనూ కోహ్లీ సేనను ఆండ్రసన్, రాబిన్సన్ కోలుకోలేని దెబ్బకొట్టారు. దీంతో ఐదు టెస్టుల సిరీస్ ఇప్పుడు 1-1తో సమమైంది.
రహానే తర్వాత ఎవరూ ఓ ఓవర్ పాటు క్రీజ్లో ఉండి ఎదుర్కొనే ధైర్యం చేయలేకపోయారు. పంత్, షమి, ఇషాంత్ శర్మ ఇంతా ఒకరి వెంట ఒకరు క్యూ కట్టారు. షమీ, జడేజా కాసేపు మెరుపులు మెరిపించారు.
రహానే మళ్లీ ఫెయిల్ అయ్యాడు. మొదట్లో రెండు ఫోర్లు కొట్టి ఊపు తీసుకొచ్చిన రహానే.. కోహ్లీకి అండగా నిలిచాడు. 237పరుగుల వద్ద కోహ్లీ ఔటవగా.. తర్వాతి ఓవర్లోనే..రహానే పెవిలియన్ చేరాడు. ఇప్పుడు ఇండియా ఐదు వికెట్లు కోల్పోయి 239పరుగులు చేసింది. ఇంకా 115 పరుగులు వెనకంజలో ఉంది.
పుజారా ఔటైన తర్వాత కోహ్లీకి రహానే జత కలిసి స్కోరు బోర్డును ముందుకు కదలించారు. స్కోరు నెమ్మదిగా పరుగులు పెట్టిస్తూనే... కోహ్లీ అర్థసెంచరీ పూర్తి చేశాడు. తర్వాత రాబిన్సన్ బౌలింగ్లో ఔటయ్యాడు.
ఓవర్ నైట్ స్కోర్కు ఒక్క పరుగు కూడా జత చేయకుండానే భారత్ తన మూడో వికెట్ కోల్పోయింది. నాల్గో రోజు స్టార్టింగ్ నుంచి నెమ్మదిగా ఆడినా పుజారా తన వికెట్ను సమర్పించుకోక తప్పలేదు. రాబిన్సన్ బౌలింగ్గా ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అంజిక్యా రహానే కోహ్లీకి జతగా వచ్చాడు.
215/2 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆట ముగించిన కోహ్లీ సేన.. నాల్గోరోజును చాలా స్లోగా స్టార్ట్ చేసింది. తొలి మూడు ఓవర్లకు ఒక్క రన్ కూడా చేయలేదు. పిచ్ మొదట్లో బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుందని పిచ్ పరిశీలకులు చెప్పినా... కోహ్లీ, పుజారా ఎక్కడా తొందర పడలేదు.
మూడో టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. భారత్ ఇంకా ఫస్ట్ ఇన్నింగ్స్లో 139 పరుగుల వెనుకంజలో ఉంది.
I am Jarvo, went back on the pitch; this time to help them in Batting. I am proud to be the first white person to play for India”. 😃😃 #INDvsENG #ENGvIND #INDvENG
— Karamdeep (@oyeekd) August 27, 2021
pic.twitter.com/idP1EGTlpB
లంచ్ అనంతరం టీమిండియా నిలకడగా ఆడుతోంది. ఓపెనర్ రోహిత్ శర్మ 39, పుజారా 22 పరుగులతో క్రీజులో ఉన్నారు.
90 Virender Sehwag
78 MS Dhoni
69 Sachin Tendulkar
62 Rohit Sharma *
61 Kapil Dev
రెండో ఇన్నింగ్స్లో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఓవర్టన్ బౌలింగ్లో కేఎల్ రాహుల్ (8) బెయిర్ స్టోకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఆచి తూచి ఆడుతున్నారు. 15 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా 20 పరుగులు చేసింది.
భారత్తో జరుగుతోన్న మూడో టెస్టులో ఆతిథ్య ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. మూడో రోజు ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే రెండు టెయిలెండర్ల వికెట్లను భారత బౌలర్లు పడగొట్టారు. దీంతో ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 354 పరుగుల భారీ ఆధిక్యాన్ని మూటకట్టుకుంది. అంతకుముందు భారత్ టాస్ గెలిచి తొలి ఇన్నింగ్స్లో 78 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే.
Revanth Reddy Political Career: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిది- వివాదాలు, కేసులతోనూ సంచలనమే!
Telangana Results KCR : కాంగ్రెస్పై అభిమానం కన్నా కేసీఆర్పై కోపమే ఎక్కువ - తెలంగాణ ప్రజలు ఇచ్చిన సందేశం ఇదేనా ?
Winning Minister 2023: మేడ్చల్లో మంత్రి మల్లారెడ్డి విజయం- ఆయనతోపాటు గెలిచిన మంత్రులు వీళ్లే
Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!
/body>