అన్వేషించండి

Roy, Root, Stokes duck out: బాబోయ్‌ బుమ్రా! ఇంగ్లాండ్‌ టాప్‌ 4లో ముగ్గురు డకౌట్‌!

IND vs ENG 1st odi: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమ్‌ఇండియా అదరగొడుతోంది. ఓవల్‌ మైదానంలో ఆంగ్లేయులకు చుక్కలు చూపిస్తోంది.

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమ్‌ఇండియా అదరగొడుతోంది. ఓవల్‌ మైదానంలో ఆంగ్లేయులకు చుక్కలు చూపిస్తోంది. నిలబడి సిక్సర్లు దంచికొట్టే ప్రత్యర్థి టాప్‌ ఆర్డర్‌ను భారత బౌలర్లు కకావికలం చేసేశారు. 3 ఓవర్లు ముగిసే లోపే 7 పరుగులకే 3 వికెట్లు తీశారు. ఆ ముగ్గురూ డకౌటే కావడం ప్రత్యేకం.

ఓవల్‌ మ్యాచులో టీమ్‌ఇండియా (IND vs ENG 1st odi) టాస్ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. బంతి అందుకున్న క్షణం నుంచి పేసుగుర్రం జస్ప్రీత్‌ బుమ్రా రెచ్చిపోయాడు. ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ ఆఖరి మూడు బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టాడు. నాలుగో బంతిని ఆడబోయిన జేసన్‌ రాయ్‌ (Jason Roy) వికెట్టైతే ఎగిరిపోయింది. వైడ్‌ లైన్‌లో వచ్చిన బంతి రాయ్‌ స్వింగ్‌ అవుతుందని భావించాడు. కానీ బ్యాటు లోపలి అంచుకు తగిలిన బంతి వికెట్లను ఎగరగొట్టింది. ఆఖరి బంతికి జోరూట్‌ (Joe Root) సైతం ఇలాగే బోల్తా పడ్డాడు. వైడ్‌ లైన్‌లో వెళ్తున్న బంతిని ఆడబోయాడు. బ్యాటుకు తగిలిన బంతి వికెట్‌ కీపర్‌ పంత్‌ చేతుల్లో పడింది.

ఆ తర్వాతి ఓవర్‌ నాలుగో బంతికి మహ్మద్‌ షమి అద్భుతం చేశాడు. రౌండ్‌ ది వికెట్‌ వెళ్లి బౌలింగ్‌ చేశాడు. స్వింగైన బంతి బెన్‌ స్టోక్స్‌ బ్యాటు అంచుకు తగిలి కీపర్‌ రిషభ్ పంత్‌ చేతుల్లో పడింది. దాంతో 7 పరుగులకే ఇంగ్లాండ్‌ 3 వికెట్లు నష్టపోయింది. ఆఖరి టెస్టులో రెండు సెంచరీలు కొట్టిన జానీ బెయిర్‌స్టో (7)నూ బుమ్రానే (Jasprit Bumrah) పెవిలియన్‌కు పంపించాడు. ఏ మాత్రం డీవియేట్‌ అవ్వని 5.3 వ బంతి జానీ బ్యాటుకు తగిలి గాల్లోకి లేచింది. ఫస్ట్‌ స్లిప్‌లోకి ఎగిరిన పంత్‌ దానిని అద్భుతంగా ఒడిసిపట్టాడు. దాంతో 17 పరుగులకు ఇంగ్లాండ్‌ 4 వికెట్లు పడిపోయింది. 

ఇంగ్లాండ్‌ టాప్‌ ఆర్డర్‌లో ముగ్గురు ఆటగాళ్లు డకౌట్‌ అవ్వడం ఇది రెండోసారి. 2018లో అడిలైడ్‌లో ఆస్ట్రేలియా జేసన్‌ రాయ్‌, బెయిర్‌ స్టో, రూట్‌ను ఔట్‌ చేసింది. ఇప్పుడు ఓవల్‌లో వారి సొంతగడ్డపై రాయ్‌, రూట్‌, స్టోక్స్‌ను టీమ్‌ఇండియా డకౌట్‌గా పెవిలియన్‌కు పంపించింది. మొత్తంగా 7 ఓవర్లకు ఇంగ్లాండ్‌ 4 వికెట్లు నష్టపోయి 26 పరుగులతో ఉంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IPL orange cap winners: ఐపీఎల్‌లో అత్యధిక సార్లు ఆరెంజ్ క్యాప్ సాధించిన బ్యాటర్ ఎవరు? విరాట్ కోహ్లీ కాదండోయ్
IPLలో అత్యధిక సార్లు ఆరెంజ్ క్యాప్ సాధించిన బ్యాటర్ ఎవరు? విరాట్ కోహ్లీ కాదండోయ్
హార్దిక్ పాండ్యా గ్యారేజీలోకి 'ఫెరారీ 12 సిలిండ్రి': రూ. 8.5 కోట్ల లగ్జరీ కారుకు దేశీ స్టైల్‌లో గ్రాండ్ వెల్కమ్!
హార్దిక్ పాండ్యా గ్యారేజీలోకి 'ఫెరారీ 12 సిలిండ్రి': రూ. 8.5 కోట్ల లగ్జరీ కారుకు దేశీ స్టైల్‌లో గ్రాండ్ వెల్కమ్!
IPL 2026 తరువాత బిజీబిజీగా టీమిండియా.. కొత్త సిరీస్‌ల షెడ్యూల్ విడుదల.. రోహిత్, కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్
IPL 2026 తరువాత బిజీబిజీగా టీమిండియా.. కొత్త సిరీస్‌ల షెడ్యూల్ విడుదల
Laxman Sivaramakrishnan: క్రికెట్ కామెంటరీకి లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ వీడ్కోలు; ముంబై మాఫీయా, వర్ణ వివక్ష అంటూ సంచలన ఆరోపణలు!
క్రికెట్ కామెంటరీకి లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ వీడ్కోలు; ముంబై మాఫీయా, వర్ణ వివక్ష అంటూ సంచలన ఆరోపణలు!

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Dhurandhar 2 : ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Embed widget