అన్వేషించండి

IND vs AUS: టాప్‌ను మించిపోతున్న లోయర్ ఆర్డర్ - నంబర్లు మామూలుగా లేవు!

ఆస్ట్రేలియాతో జరిగిన నాగ్‌పూర్ టెస్టులో టీమిండియా లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ రాణించారు.

India vs Australia Nagpur Test: భారత క్రికెట్ జట్టు గత కొన్నేళ్లుగా టెస్ట్ ఫార్మాట్‌లో యావత్ ప్రపంచాన్ని శాసిస్తోంది. దీని శాంపిల్‌ను ఈరోజు ఆస్ట్రేలియాకు చూపించారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023 సిరీస్ సందర్భంగా జరిగిన నాగ్‌పూర్ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ప్రపంచ నంబర్ వన్ టెస్ట్ జట్టు ఆస్ట్రేలియాను ఓడించింది. ఈ మ్యాచ్‌లో భారత్‌కు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ కంటే లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఎక్కువ పరుగులు అందించారు.

అద్భుతాలు చేసిన లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్
భారత ఇన్నింగ్స్‌లో లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ భారీ స్థాయిలో పరుగులు చేయడం ఇదే తొలిసారి కాదు. గత కొన్నేళ్లుగా ఆడిన టెస్టు మ్యాచ్‌ల్లో చాలాసార్లు భారత్ లోయర్ ఆర్డర్ చాలా పరుగులు చేసింది. ఇంగ్లండ్‌పై లార్డ్స్‌లో జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ భాగస్వామ్యాన్ని గుర్తుంచుకోవాలి. ఆస్ట్రేలియాతో నాగ్‌పూర్ టెస్టు మ్యాచ్‌లోనూ అదే కనిపించింది.

ఈ మ్యాచ్‌లో భారత్ ఒక్క ఇన్నింగ్స్‌లో మాత్రమే బ్యాటింగ్ చేసి 400 పరుగులు చేసింది. ఈ 400 పరుగులలో టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ 190 పరుగులు చేయగా, లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ 191 పరుగులు చేశారు. ఎవరెవరు ఎంతెంత స్కోరు చేశారో చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది.

ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ భారత్ తరఫున 120 పరుగుల సెంచరీ సాధించాడు, ఇది ఈ మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు కూడా. తనతో పాటు కేఎల్ రాహుల్ 20, ఛతేశ్వర్ పుజారా 7, విరాట్ కోహ్లీ 12, సూర్యకుమార్ యాదవ్ 8 పరుగులు చేశారు. ఈ బ్యాట్స్‌మెన్ అంతా కలిసి 167 పరుగులు చేశారు. అదే సమయంలో మూడో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన అశ్విన్ 23 పరుగులు కలిపినా కూడా భారత టాప్, మిడిల్ బ్యాటింగ్ ఆర్డర్ 190 పరుగులు మాత్రమే జోడించగలిగింది.

అదే సమయంలో లోయర్ ఆర్డర్‌లో రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, మహమ్మద్ షమీల పరుగులు మాత్రమే కలిస్తే 191 పరుగులు ఉన్నాయి. అంటే ఈ ముగ్గురు లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ టాప్ 6 బ్యాట్స్‌మెన్ కంటే ఎక్కువ పరుగులు చేశారు. ఇందులో రవీంద్ర జడేజా 70, అక్షర్ పటేల్ 84, మహ్మద్ షమీ 37 పరుగులు చేశారు.

ఆస్ట్రేలియాతో నాగ్‌పూర్ టెస్టులో విజయం సాధించడంలో భారత లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ బ్యాట్, బాల్ రెండింటిలోనూ అద్భుతంగా రాణించారని ఈ గణాంకాలను బట్టి ఒక విషయం స్పష్టమైంది. అదే సమయంలో టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఢిల్లీ టెస్టులో ఎక్కువ పరుగులు చేస్తారని భావిస్తున్నారు.

బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. నాగ్‌పూర్‌లో టీమిండియా సాధించిన ఈ విజయం చాలా ప్రత్యేకమైనది. ఇన్నింగ్స్ పరంగా ఆస్ట్రేలియాపై భారత్‌కు ఇది మూడో అతిపెద్ద విజయం.

ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్‌కు కూడా ఈ మ్యాచ్ ప్రత్యేకం. రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి ఎన్నో రికార్డులను అశ్విన్ బద్దలు కొట్టాడు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత కంగారూ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 91 పరుగులకు ఆలౌటైంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget