News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

ENG vs PAK Series: మొన్న న్యూజిలాండ్, ఇప్పుడు ఇంగ్లండ్.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు మరో షాక్!

వచ్చే నెలలో పాకిస్తాన్‌తో జరగాల్సిన సిరీస్‌ను రద్దు చేసుకుంటున్నట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది.

FOLLOW US: 
Share:

పాకిస్తాన్‌లో వచ్చే నెల జరగాల్సిన క్రికెట్ సిరీస్‌ను ఇంగ్లండ్ రద్దు చేసుకుంది. ఇది పాకిస్తాన్ బోర్డుకు గట్టి ఎదురు దెబ్బే. ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ మానసిక, శారీరకంగా ఆరోగ్యం, ప్రస్తుతం నెలకొన్న కోవిడ్ పరిస్థితిలో ప్రయాణం చేయడం అంత మంచిది కాదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. వచ్చే నెలలో ఇరు జట్ల మధ్య రెండు టీ20 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. పురుషుల జట్టుతో మహిళల జట్టు కూడా పాకిస్తాన్‌లో సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ రెండు సిరీస్‌లను రద్దు చేస్తున్నట్లు ఇంగ్లండ్ ప్రకటించింది.

చాలా కాలం నుంచి కోవిడ్ పరిస్థితుల్లో నివసిస్తున్న ఆటగాళ్లకు ఇప్పుడు ప్రయాణం చేయడం, మరో ప్రాంతానికి వెళ్లడం వంటివి ఒత్తిడిని కలిగిస్తాయని ఈసీబీ తన ప్రకటనలో పేర్కొంది. పురుషుల టీ20 ప్రపంచ కప్‌కే తాము మొదటి ప్రాధాన్యం ఇస్తామని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రయాణం చేసి ఆ టోర్నీ సన్నాహాలను రిస్క్‌లో పెట్టలేమంది.

ఈ నిర్ణయం పీసీబీకి నిరాశ కలిగిస్తుందని తెలుసని, తమ దేశంలో అంతర్జాతీయ క్రికెట్ నిర్వహణకు పీసీబీ ఎంతగానో ప్రయత్నిస్తుందని ప్రకటనలో తెలిపింది. ఇంగ్లిష్ క్రికెట్‌కు గత రెండు వేసవులుగా వారు చేసిన సేవలను మరవలేమంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు మనస్పూర్తిగా క్షమాపణలు తెలుపుతున్నట్లు పేర్కొంది.

కొద్దిరోజుల క్రితమే న్యూజిలాండ్ కూడా పాకిస్తాన్‌లో సిరీస్‌ను రద్దు చేసుకుంది. అయితే న్యూజిలాండ్ భద్రతా కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది . అయితే మ్యాచ్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు న్యూజిలాండ్ ఈ ప్రకటన చేయడం అప్పుడు క్రికెట్ వర్గాల్లో సంచలనం సృష్టించింది. పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్, ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ పాకిస్తాన్‌లో జరగాల్సి ఉండగా, మొత్తం సిరీస్‌ను న్యూజిలాండ్ రద్దు చేసుకుంది.

న్యూజిలాండ్ ప్రభుత్వం అందించిన సెక్యూరిటీ అలెర్ట్ కారణంగా ఈ టూర్‌ను రద్దు చేస్తున్నట్లు నిర్ణయించామని న్యూజిలాండ్ క్రికెట్ తమ ప్రకటనలో పేర్కొంది. ఆటగాళ్ల భద్రతే తమకు ముఖ్యమని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని న్యూజిలాండ్ క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ వైట్ అప్పుడు తెలిపారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డును ఈ నిర్ణయం ఎంత బాధ పెట్టి ఉంటుందో తమకు తెలుసని, వారి ఆతిథ్యం కూడా అద్భుతంగా ఉందని డేవిడ్ పేర్కొన్నారు. తమకు ఇది తప్ప మరో ఆప్షన్ కనిపించలేదన్నారు.

దీనిపై పాకిస్తాన్ స్పందిస్తూ ఇది ఏకపక్ష నిర్ణయమని తెలిపింది. భద్రతా కారణాలను చూపిస్తూ సిరీస్‌ను వాయిదా వేస్తున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ తమకు మ్యాచ్ జరిగే ముందే సమాచారం అందించిందని పీసీబీ తన ప్రకటనలో పేర్కొంది. తమ దేశానికి వచ్చే అన్ని జట్లకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, పాకిస్తాన్ ప్రభుత్వం అత్యుత్తమ భద్రతను అందిస్తుందని తెలిపింది.

పాకిస్తాన్ ప్రధానమంత్రి, న్యూజిలాండ్ ప్రధానమంత్రితో స్వయంగా మాట్లాడారని, ప్రపంచంలోనే అత్యుత్తమ ఇంటెలిజెన్స్ వ్యవస్థల్లో తమది కూడా ఒకటని, న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు ఎటువంటి ముప్పూ లేదని చెప్పారని, షెడ్యూల్ చేసిన మ్యాచ్‌లను ఆడటానికి ఇప్పటికీ తాము సుముఖులమేనని పీసీబీ తెలిపింది. సమీప భవిష్యత్తులో ఆస్ట్రేలియా కూడా పాకిస్తాన్‌లో పర్యటించాల్సి ఉంది. ఇప్పుడు ఆస్ట్రేలియా ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Published at : 20 Sep 2021 11:25 PM (IST) Tags: PCB Pakistan cricket board Pakistan Vs England Pak Vs Eng England cancelled Pakistan Tour England Tour of Pakistan

ఇవి కూడా చూడండి

IND Vs AUS, Match Highlights: భారత్‌ ఖాతాలో మరో విజయం , పర్యటనను ఓటమితో ముగించిన ఆసిస్‌

IND Vs AUS, Match Highlights: భారత్‌ ఖాతాలో మరో విజయం , పర్యటనను ఓటమితో ముగించిన ఆసిస్‌

IND Vs AUS, Innings Highlights: ఆసీస్ లక్ష్యం 160, ఆడతారా? ఓడతారా ?

IND Vs AUS, Innings Highlights: ఆసీస్ లక్ష్యం 160, ఆడతారా? ఓడతారా ?

IND Vs AUS 5th T20: నేడే నామమాత్రపు మ్యాచ్‌, మార్పులతో బరిలోకి భారత్‌

IND Vs AUS 5th T20: నేడే నామమాత్రపు మ్యాచ్‌, మార్పులతో బరిలోకి భారత్‌

IPL 2024 Auction: ఎన్నికల ఫలితాల హీట్‌లో కూల్ న్యూస్ చెప్పిన బీసీసీఐ - ఐపీఎల్ 2024 వేలం తేదీ ప్రకటించిన బోర్డు!

IPL 2024 Auction: ఎన్నికల ఫలితాల హీట్‌లో కూల్ న్యూస్ చెప్పిన బీసీసీఐ - ఐపీఎల్ 2024 వేలం తేదీ ప్రకటించిన బోర్డు!

WPL 2024 auction: వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ వేలం ఎప్పుడంటే , అందుబాటులో 165 మంది క్రికెటర్లు

WPL 2024 auction: వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ వేలం ఎప్పుడంటే , అందుబాటులో 165 మంది క్రికెటర్లు

టాప్ స్టోరీస్

Supritha Congratulates Revanth Reddy: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!

Supritha Congratulates Revanth Reddy: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!

Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు

Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు

Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!

Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!

Yash 19: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్‌కు పూనకాలే

Yash 19: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్‌కు పూనకాలే
×