అన్వేషించండి

Year Ender 2025: ఈ సంవత్సరం టీమిండియా 5 అతిపెద్ద ఓటములు.. చేదు జ్ఞాపకాలకు గుడ్ బై!

biggest defeats for Indian cricket team | 2025 భారత క్రికెట్ కు టెస్టుల్లో నిరాశాజనకంగా మారింది. WTC ఫైనల్ ఆశలు సన్నగిల్లుతున్నాయి.

భారత క్రికెట్ జట్టుకు 2025 సంవత్సరం వన్డే, టీ20ల్లో కలిసొచ్చినా.. టెస్టుల్లో అంతగా కలిసి రాలేదు. మొదట్లో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఐదో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ ఓటమితో భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్ ఆడే కల చెదిరింది. ఈ ఏడాది భారత జట్టు ఓడిపోయి, ప్రతి భారత అభిమానిని నిరాశపరిచిన 5 మ్యాచ్‌ల వివరాలను చూడండి. ఇందులో పాకిస్థాన్ భారత్‌ను ఓడించిన అండర్-19 ఆసియా కప్ ఫైనల్ కూడా ఉంది.

ఆస్ట్రేలియా గెలుపుతో WTC ఫైనల్ నుంచి భారత్ ఔట్

ఈ ఏడాది ఆస్ట్రేలియాతో సిడ్నీలో భారత్ ఆడిన తొలి టెస్టులో ఓడిపోయింది. ఈ మ్యాచ్ రిజల్ట్ భారత అభిమానులను బాధించింది. నిజానికి ఈ టెస్టులో ఓటమితో భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్ ఆడే కల చెదిరింది. భారత్ బ్యాటింగ్ పేలవంగా సాగింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 185, రెండో ఇన్నింగ్స్‌లో 157 పరుగులకే ఆలౌట్ అయింది.

లార్డ్స్‌లో అవమానకరమైన ఓటమి

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ప్రస్తుత సైకిల్ (2025-27)లో భారత్ తొలి టెస్ట్ సిరీస్ ఇంగ్లాండ్‌తో జరిగింది. 5 మ్యాచ్‌ల ఈ సిరీస్ 2-2తో సమం అయింది. ఈ టెస్ట్ సిరీస్‌లోని మూడో టెస్టులో ఇంగ్లాండ్ 22 పరుగుల తేడాతో గెలిచింది. లక్ష్యం కేవలం 193 పరుగులు. ఈ ఓటమి సగటు అభిమాని గుండెను పిండేసింది. ప్రతి భారత అభిమాని నిరాశ చెందాడు. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ తరపున 7 మంది బ్యాటర్లు డబుల్ డిజిట్ కూడా చేరుకోలేకపోయారు. ఇది ఓటమికి ప్రధాన కారణమైంది.

124 లక్ష్యాన్ని కూడా ఛేదించలేని భారత జట్టు

నవంబర్ 14న ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు ప్రారంభమైంది. పర్యాటక జట్టు 159 పరుగులకే కుప్పకూలింది. అప్పుడు భారత్ ఈ మ్యాచ్‌ను సులభంగా గెలుస్తుందనుకున్నారు. అయితే, తొలి ఇన్నింగ్స్ ఆధారంగా భారత్ కేవలం 30 పరుగుల ఆధిక్యాన్ని మాత్రమే సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 153 పరుగులకే కుప్పకూలింది. అప్పుడు భారత్ ఈ టెస్టులో ఓడిపోతుందని ఎవరూ ఊహించలేదు. గెలవడానికి కేవలం 124 పరుగులు చేయాల్సి ఉంది. కానీ ఛేదనలో భారత్ జట్టు మొత్తం 100 పరుగులు కూడా చేయలేక 30 పరుగుల తేడాతో టెస్ట్ మ్యాచ్ ఓడిపోయింది.

భారత్ అతిపెద్ద టెస్ట్ ఓటమి (పరుగుల తేడాతో)

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో కూడా భారత్ బ్యాటింగ్ ఫ్లాప్‌గా మారింది. తొలి ఇన్నింగ్స్‌లో 201, రెండో ఇన్నింగ్స్‌లో 140 పరుగులకే ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికా ఈ టెస్టును ఏకంగా 408 పరుగుల తేడాతో గెలిచింది. ఇది పరుగుల పరంగా  భారత్ అతిపెద్ద ఓటమిగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఓటమితో WTC ప్రస్తుత సైకిల్ ఫైనల్‌కు చేరుకునే మార్గం కూడా కష్టమైంది. ఇప్పుడు భారత్ 9 టెస్టుల్లో 8 గెలవాల్సి ఉంటుంది. భారత్ ఇప్పటివరకు WTC టైటిల్ సాధించలేదు. 

అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌తో ఓడిన భారత్

వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మ్హత్రే, ఆరోన్ జార్జ్ వంటి పేర్లు అండర్-19 ఆసియా కప్‌లో రాణించారు. కానీ పాకిస్థాన్ ఫైనల్‌లో భారత్‌ను ఓడిస్తుందని ఎవరూ ఊహించలేదు. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 347 పరుగులు చేసింది. సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టు 156 పరుగులకే ఆలౌట్ అయింది. ఇది అండర్-19 టోర్నమెంట్ అయినా, అభిమానులందరూ చూశారు. పాక్ చేతిలో ఓటమిని ప్రతి భారత అభిమానిని బాధించింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs NZ 3rd ODI: కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
CM Revanth Reddy: ఖమ్మంలో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
ఖమ్మంలో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Rafale Fighter Jets: భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
Advertisement

వీడియోలు

Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్
Vande Bharat Sleeper Train Started | పచ్చ జెండా ఊపి వందేభారత్ స్లీపర్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ | ABP Desam
WPL 2026 RCB vs GG Highlights | హ్యాట్రిక్ కొట్టిన బెంగళూరు!
Ashwin about India vs New Zealand | టీమ్ సెలక్షన్ పై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Manoj Tiwari about Rohit Sharma Captaincy | రోహిత్ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs NZ 3rd ODI: కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
CM Revanth Reddy: ఖమ్మంలో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
ఖమ్మంలో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Rafale Fighter Jets: భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
TTD Darshan Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
Shefali Jariwala Death Reason: చేతబడి వల్లే నా భార్య మరణించింది... అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట విలన్
చేతబడి వల్లే నా భార్య మరణించింది... అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట విలన్
Telangana News: దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
Kakinada AM Green Energy: గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
Embed widget