Suryakumar Yadav: అభిషేక్ శర్మ గురించి కాదు, వారి గురించి టెన్షన్ పడుతున్నాను: సూర్యకుమార్ యాదవ్
Ind vs SA Suryakumar yadav on abhishek sharma Form | భారత ఓపెనర్ అభిషేక్ శర్మ ఫాం గురించి తాను ఆందోళన చెందడం లేదని, అతడి తరువాత మ్యాచులలో ప్రత్యర్థి జట్ల గురించే తన టెన్షన్ అన్నాడు సూర్యకుమార్ యాదవ్.

T20 world cup 2026 | అహ్మదాబాద్: టీమిండియా మ్యాచ్ అంటే చాలు స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ డకౌట్ల గురించే చర్చ జరుగుతోంది. అయితే మేనేజ్మెంట్ నుంచి అభిషేక్ శర్మకు కావాల్సినంత సపోర్ట్ లభిస్తోంది. అభిషేక్ శర్మ డకౌట్లపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ సరదాగా స్పందించాడు. తాను ఆందోళన చెందుతున్నది అభిషేక్ శర్మ ఫామ్ గురించి కాదని, ప్రత్యర్థి జట్ల గురించి ఆందోళన చెందుతున్నానని తనదైనశైలిలో బదులిచ్చాడు.
టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8లో టీమిండియా మొదటి మ్యాచ్ దక్షిణాఫ్రికాతో ఆదివారం (ఫిబ్రవరి 22న) తలపడనుంది. మ్యాచ్కు ముందు రోజు శనివారం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో టీ20ల్లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ను అభిషేక్ శర్మ పేలవ ఫామ్ గురించి ప్రశ్నలు అడిగారు. అభిషేక్ గ్రూప్ స్టేజ్లో ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ డకౌట్ అయ్యాడు. అయితే ఓపెనర్ బ్యాటర్ గురించి ఎలాంటి ఆందోళన లేదని, కానీ ప్రత్యర్థి జట్ల గురించి తనకు ఆందోళనగా ఉందని కెప్టెన్ సూర్య పేర్కొన్నాడు.
#ICCT20WorldCup2026 | Ahmedabad, Gujarat: Indian cricket team's T20 captain Surya Kumar Yadav says, "I am worried about the people who are worrying about Abhishek Sharma. I am more concerned for the teams that will face him later. He did everything last year, now it's time for us… pic.twitter.com/w4XhjxOLMA
— ANI (@ANI) February 21, 2026
సూర్యకుమార్ యాదవ్ ఏం చెప్పాడు
‘అభిషేక్ శర్మ ఫామ్ గురించి ఆందోళన చెందుతున్న వారిని చూసి నేను ఆందోళన చెందుతున్నాను. అభిషేక్ శర్మ భవిష్యత్తులో ఎవరితో ఆడబోతున్నాడో ఆ జట్ల గురించి ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్తులో అతనిని ఎదుర్కోబోయే జట్ల గురించి ఎక్కువ ఆందోళనగా ఉన్నారు. గత సంవత్సరం అభిషేక్ చాలా చేశాడు. ఇప్పుడు అతనికి మేం సహకరించాల్సిన సమయం వచ్చింది’ అని సూర్య మద్దతుగా నిలిచాడు.
ప్రతి మ్యాచులో 250 పరుగులు చేయాల్సిన అవసరం లేదని సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. వికెట్లు కొంచెం భిన్నంగా ఉన్నాయని ఆయన చెప్పారు. తదుపరి మ్యాచ్లలో వచ్చే పిచ్ సవాళ్లను తాము ఎదుర్కొంటామని తెలిపారు. భారత్ నెదర్లాండ్స్పై ఇక్కడి నరేంద్ర మోదీ స్టేడియంలోనే విజయం సాధించింది, ఇప్పుడు దక్షిణాఫ్రికాతో సూపర్-8 మ్యాచ్ కూడా అక్కడే జరగనుంది. ప్రస్తుత ఎడిషన్లో దక్షిణాఫ్రికా కూడా ఈ గ్రౌండ్లో 2 మ్యాచ్లు ఆడి రెండింటిలోనూ విజయం సాధించింది.
టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8లో భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం జరగనుంది. నెదర్లాండ్స్ మ్యాచులో అభిషేక్ వరుసగా మూడవసారి డకౌట్ అయ్యాడు. అంతకుముందు పాకిస్తాన్, అమెరికాలపై కూడా ఖాతా తెరవలేదు. ఇప్పటివరకు టోర్నీలో ఓడిపోనప్పటికీ, ఇకనుంచి అభిషేక్ పరుగులు చేయడం జట్టుకు అవసరం. కానీ తన ఆటగాడికి కెప్టెన్ నుంచి సపోర్ట్ లభించింది.
ఎటువంటి వికెట్లకైనా అలవాటు పడటానికి మేం సిద్ధంగా ఉన్నామని నేను భావిస్తున్నాను. వాంఖడేలో మా జర్నీ ప్రారంభించినప్పటి నుండి ఆడిన చివరి మ్యాచ్ వరకు పలు రకాల వికెట్లపై ఆడుతూనే ఉన్నాం. ఆ వికెట్లు మరీ ఛాలెంజ్ తో కూడుకున్నవి కాకపోయినా, కొంచెం గమ్మత్తుగా ఉన్నాయి. అయితే పవర్ ప్లే తర్వాత మేం ఎలా బ్యాటింగ్ చేయాలి, ఆపై మ్యాచ్ను ఎలా ముగించాలి అనే దానిపై అవగాహన ఉండటానికి సరిపడా క్రికెట్ ఆడాం - సూర్యకుమార్ యాదవ్
దక్షిణాఫ్రికాపై భారత్ ప్లేయింగ్ 11 అంచనా
అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
Before You Go
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
ట్రెండింగ్ వార్తలు




















