Kris Srikkanth Comments: తిలక్ వర్మ సెల్ఫిష్ ఆట వల్లే ఇండియా ఘోర ఓటమి.. శ్రీకాంత్ సంచలన కామెంట్స్, జెర్సీ ఎగరేసి హీరో అవ్వాలని చూశాడంటూ ఫైర్!
ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్ లో ఇండియా వైస్ కెప్టెన్ తిలక్ వర్మ తన స్వంత రికార్డుల కోసమే ఆడాడంటూ మాజీ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తీవ్రంగా మండిపడ్డాడు.

Tilak Varma Selfish Batting Slammed By Srikkanth: ఐర్లాండ్ చేతిలో టీమిండియా 0-2 తో టీ20 సిరీస్ ఓడిపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బెల్ఫాస్ట్లో జరిగిన సెండ్ టీ20 మ్యాచ్ లో కేవలం ఒక్క రన్ తేడాతో ఇండియా ఓడిపోగా 155 రన్స్ టార్గెట్ ను ఛేజ్ చేయడంలో టీమ్ ఫెయిల్ అయింది. ఈ మ్యాచ్ లో ఇండియా తరఫున హైయెస్ట్ స్కోరర్గా నిలిచి హాఫ్ సెంచరీ చేసిన వైస్ కెప్టెన్ తిలక్ వర్మ ప్రెజెంట్ తీవ్ర విమర్శలు ఫేస్ చేస్తున్నాడు. మాజీ ఓపెనర్, మాజీ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానెల్లో తిలక్ వర్మపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. తిలక్ టీమ్ విజయం కంటే తన పర్సనల్ గ్లోరీ కే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడని శ్రీకాంత్ ఓపెన్ గా విమర్శించాడు.
మిడిల్ ఓవర్ల స్లో బ్యాటింగ్.. దూబే, అక్షర్ లపై శ్రీకాంత్ ఆగ్రహం
ఈ మ్యాచ్ లో తిలక్ వర్మ 46 బంతుల్లో 55 రన్స్ చేశాడు. టీమ్ లో ఎక్కువ సేపు క్రీజులో ఉన్నప్పటికీ రిక్వైర్డ్ రన్ రేట్ కు తగ్గట్లుగా అతను ఇన్నింగ్స్ ను యాక్సిలరేట్ చేయలేకపోయాడు. తిలక్తో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు శివం దూబే (16 బంతుల్లో 20 రన్స్), అక్షర్ పటేల్ (18 బంతుల్లో 14 రన్స్) ల స్లో బ్యాటింగ్ ను కూడా శ్రీకాంత్ తీవ్రంగా తప్పుపట్టాడు. మిడిల్ ఫేజ్ లో ఇండియా ఆడిన తీరు అస్సలు బాలేదని, అందరి స్ట్రైక్ రేట్లు చాలా పూర్ గా ఉన్నాయని చెప్పాడు. మిడిల్ ఓవర్లలో కాస్త సెటిల్ అయ్యాక అటాకింగ్ స్టార్ట్ చేయాలని, లేదంటే ఇలాగే మ్యాచ్ లు చేజారిపోతాయని శ్రీకాంత్ పేర్కొన్నాడు.
జెర్సీ ఎగరేసి హీరో అవ్వాలని ప్లాన్..
తిలక్ వర్మ చేసిన తప్పులను శ్రీకాంత్ పర్టిక్యులర్ గా పాయింట్ అవుట్ చేశాడు. "తిలక్ వర్మ కేవలం తన కోసమే ఆడుకున్నట్లు కనిపించింది. సింగిల్స్, డబుల్స్ తీస్తూ మ్యాచ్ ను లాస్ట్ ఓవర్ వరకు లాగాలని చూశాడు. మ్యాచ్ ను చివర్లో గెలిపించి జెర్సీని పైకి లేపి సెలెబ్రేట్ చేసుకుంటూ హీరో అయిపోదామని అనుకున్నాడు. ఇలాంటి చిన్న టార్గెట్లను ఒక ఓవర్ ముందే ఛేజ్ చేసి ముగించాలి కానీ లాస్ట్ బాల్ వరకు తెచ్చి ప్రెజర్ పెంచకూడదు" అని శ్రీకాంత్ ఫైర్ అయ్యాడు. తిలక్ ఆటిట్యూడ్ టీమ్ను దెబ్బతీసిందని అతను చాలా గట్టిగా చెప్పాడు.
హర్షిత్ రాణా మెరుపు క్యామియో.. లాస్ట్ బాల్ లో మిస్సయిన ఛాన్స్
తిలక్ వర్మ, అక్షర్, దూబే అవుట్ అయిన తర్వాత బౌలింగ్ ఆల్రౌండర్ హర్షిత్ రాణా కేవలం 10 బంతుల్లోనే 21 రన్స్ తో మెరుపు క్యామియో ఆడి ఇండియాను విక్టరీకి చాలా క్లోజ్ గా తెచ్చాడు. లాస్ట్ రెండు బాల్స్ లో ఇండియా గెలవడానికి 7 రన్స్ కావాల్సిన టైమ్లో హర్షిత్ సిక్స్ కొట్టే ట్రై లో అవుట్ అయ్యాడు. దీంతో ఇండియా ఒక్క రన్ దూరంలో నిలిచిపోయి సిరీస్ను కోల్పోయింది. మిడిల్ ఆర్డర్ లో ప్లేయర్లు ప్లాన్ మార్చుకోకపోతే ఫ్యూచర్ లో ఇంగ్లాండ్ టూర్ లోనూ ఇండియాకు కష్టాలు తప్పవని ఈ మాజీ క్రికెటర్ స్పష్టం చేశాడు.
ట్రెండింగ్ వార్తలు



















