By: ABP Desam | Updated at : 09 Apr 2023 03:48 PM (IST)
చెన్నై సూపర్ కింగ్స్ ( Image Source : CSK Twitter )
IPL 2023: మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్కు గుడ్ న్యూస్. పేసర్లతో పాటు పవర్ ప్లేలో వికెట్లు తీయగలిగే స్పిన్నర్ లేక ఇబ్బందులు పడుతున్న సీఎస్కేకు త్వరలోనే ఆ బెంగ తీరననుంది. శ్రీలంక ఆటగాళ్లు సీఎస్కేతో కలవనున్నారు. చెన్నై జట్టులో ఉన్న లంక ఆటగాళ్లు మహీశ్ తీక్షణ, మతీష పతిరనలు రాజస్తాన్ రాయల్స్ తో జరిగే మ్యాచ్కు అందుబాటులో ఉండనున్నారు.
న్యూజిలాండ్తో వన్డే, టీ20 సిరీస్ ఆడిన జట్టులో ఉన్న లంక స్పిన్నర్ తీక్షణ, పేసర్ పతిరనలు రావడం చెన్నైకి అదనపు బలాన్నిచ్చేదే. పవర్ ప్లేలో వికెట్లు తీయడంలో తీక్షణ దిట్ట.గత సీజన్ లో ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన తీక్షణ.. 12 వికెట్లు తీశాడు. ఇందులో ఓసారి నాలుగు వికెట్ల ప్రదర్శన కూడా ఉంది. ఇటీవల కివీస్ తో ముగిసిన తొలి టీ20లో మ్యాచ్ టై కాగా సూపర్ ఓవర్ వేసిన తీక్షణ 8 పరుగులే ఇచ్చి తన జట్టును గెలిపించిన విషయం తెలిసిందే.
ఇక లంక దిగ్గజం లసిత్ మలింగ జూనియర్ గా గుర్తింపు పొందిన పతిరన కూడా నమ్మదగ్గ బౌలరే. సీఎస్కేకు ఈ ఐపీఎల్ లో నిఖార్సైన పేసర్ లేక తంటాలు పడుతోంది. తుషార్ దేశ్పాండే ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. రాజ్యవర్ధన్ కూడా విఫలమవుతుండగా ముంబై తో మ్యాచ్ లో దీపక్ చాహర్ కు గాయమైన నేపథ్యంలో ఆ జట్టుకు పతిరన రాక మేలుచేసేదే. వీళ్లిద్దరూ ఈనెల 12న చెన్నైలో రాజస్తాన్ తో జరుగబోయే మ్యాచ్కు అందుబాటులో ఉంటారని సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ తెలిపాడు.
ఆ ఫ్రాంచైజీలకూ గుడ్ న్యూసే..
తీక్షణ, పతిరనలతో పాటు మరో ఇద్దరు లంక ప్లేయర్లు కూడా తమ ఫ్రాంచైజీలతో కలువనున్నారు. ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగ.. ఆర్సీబీతో కలవనున్నాడు. హసరంగ లేని లోటు ఆర్సీబీ స్పిన్ విభాగంలో కొట్టొచ్చినట్టు కనిపించింది. వెటరన్ స్పిన్నర్ కర్ణ్ శర్మను ఆడిస్తున్నా అతడు నమ్మదగ్గ బౌలర్ అయితే కాదు. దీంతో ఆర్సీబీ ఎక్కువగా మ్యాక్స్వెల్, బ్రాస్వెల్ ల మీదే ఆధారపడుతున్నది. హసరంగ రాకతో కర్ణ్ శర్మ బెంచ్ కే పరిమితం కానున్నాడు.
@RCBTweets updates:
— Thambiraj Gounder (@ShreeThambiraj) April 6, 2023
- Wanindu Hasaranga will join by 10th April.
- Josh Hazlewood will join on 14th April.#RCB #RoyalChallengersBangalore pic.twitter.com/r2IGIkOt3X
ఇక లంకకు పరిమిత ఓవర్లలో సారథిగా వ్యవహరిస్తున్న దసున్ శనక కూడా ఈ ఏడాది ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయి. ఈ ఆల్ రౌండర్ ను గుజరాత్ టైటాన్స్ ఇటీవలే రూ. 50 లక్షలకు సొంతం చేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ తో తొలి మ్యాచ్ లో గాయపడ్డ కేన్ విలియమ్సన్ స్థానంలో శనకను రిప్లేస్ చేసుకున్నది. శనక కూడా జీటీతో కలిస్తే అతడు ఈనెల 13న గుజరాత్-ముంబైల మధ్య జరుగబోయే మ్యాచ్లో ప్లేస్ దక్కించుకోవచ్చు. లంక ఆటగాళ్లలో ఇదివరకే భానుక రాజపక్స పంజాబ్ కింగ్స్ కు ఆడుతున్న విషయం తెలిసిందే. మొహాలీ వేదికగా కేకేఆర్ తో ముగిసిన మ్యాచ్ లో రాజపక్స ధనాధన్ ఇన్నింగ్స్ తో అలరించాడు. నేడు హైదరాబాద్ తో జరిగే మ్యాచ్ లో కూడా సత్తా చాటాలని భావిస్తున్నాడు.
Viral Video: ఆ ట్రోఫీని వదిలేసి ముందు నన్ను హగ్ చేసుకో - వైరల్ అవుతున్న సాక్షి-ధోని వీడియో
WTC 2023 Final: డబ్ల్యూటీసీ ఫైనల్స్లో వర్షం పడితే! - పోనీ డ్రా అయితే గద ఎవరికి?
SL vs AFG 1st ODI: జద్రాన్ జోరు - లంకకు షాకిచ్చిన అఫ్గాన్ - తొలి వన్డేలో ఘన విజయం
WTC Final Commentators: దాదా ఈజ్ బ్యాక్ - డబ్ల్యూటీసీ ఫైనల్స్కు కామెంటేటర్గా గంగూలీ - పూర్తి జాబితా ఇదే
WTC Final 2023: భరత్ vs కిషన్ - టీమ్ఇండియాకు పెద్ద చిక్కే వచ్చిందే!
PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ
Coromandel Express Accident: రాంగ్ ట్రాక్లోకి కోరమాండల్ ఎక్స్ప్రెస్, అందుకే ఘోర ప్రమాదం - ప్రాథమిక రిపోర్ట్
Avinash Reddy To CBI : అవినాష్ రెడ్డిని 6 గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ - వాట్సాప్ కాల్స్ పైనే సమాచారం సేకరించారా ?
Coromandel Train Accident: రైళ్లు పట్టాలు తప్పడానికి కారణాలేంటి? ఆ నిర్లక్ష్యమే ప్రాణాలు తీస్తోందా?