అన్వేషించండి

Ind vs Eng 5th Test: ఓవల్ స్టేడియంలో హయ్యస్ట్ ఛేజ్ ఎంత? రికార్డులు తెలిస్తే భారత ఫ్యాన్స్ ఫుల్ జోష్

చివరిదైన ఓవల్ టెస్ట్ లో భారత్ 374 రన్స్ టార్గెట్ ఇచ్చింది. ఇంగ్లాండ్ అంత పెద్ద టార్గెట్ ఛేజ్ చేస్తుందా? అని క్రిెకెట్ ప్రేమికులు వివరాలు చెక్ చేస్తున్నారు.

ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో టీమిండియాకు నేడు చాలా కీలకం. అ టెస్టులో కనుక భారత్ నెగ్గితే 2-2తో ఐదు టెస్టుల సిరీస్ సమం అవుతుంది. భారత్ కనుక ఓటమిపాలైతే 3-1తో సిరీస్ చేజారుతుంది. ఓవల్ టెస్ట్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 224 పరుగులు చేసి ఆలౌట్ అయినప్పుడు, చివరి టెస్ట్ చేజారిందని అంతా అనుకున్నారు. భారత బౌలర్లు ఇంగ్లండ్‌ను కేవలం 23 పరుగులు మాత్రమే ఆధిక్యంలో ఆలౌట్ చేయడంతో భారత్ రేసులోకి వచ్చింది.

రెండో ఇన్నింగ్స్ లో భారత్ సమష్టిగా రాణించింది. ఈ టెస్టులో ఇంగ్లీష్ జట్టుకు 374 పరుగుల లక్ష్యం నిర్ధేశించగా, బెన్ డకెట్, జాక్ క్రాలీ 50 పరుగుల భాగస్వామ్యంతో  ఆతిథ్య జట్టుకు మంచి ప్రారంభం అందించారు. అయితే, ఇంగ్లండ్ ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించగలదా? వాస్తవానికి, ఓవల్ మైదానంలో 300 పరుగుల లక్ష్యాన్ని ఏ జట్టైనా ఛేదించిందా అని గణాంకాలు చెక్ చేసిన భారత అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ స్టేడియంలో ఒక్కసారి కూడా 300 టార్గెట్ ఏ జట్టు కూడా ఛేదించలేదని గణాంకాలు చెబుతున్నాయి. ఒకవేళ ఇంగ్లండ్ ఛేజ్ చేస్తే కనుక, అది చారిత్రాత్మక విజయం అవుతుంది.

ఓవల్ మైదానంలో అత్యధిక పరుగుల రికార్డు

టెస్ట్ క్రికెట్‌లో ఓవల్ మైదానంలో ఛేజింగ్‌లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు 263 పరుగులు.  1902లో ఆస్ట్రేలియాపై ఆతిథ్య ఇంగ్లాండ్ ఈ స్కోరు సాధించింది. ఆ మ్యాచ్ 123 సంవత్సరాల కిందట జరిగింది. ఆ తరువాత 1963లో వెస్టిండీస్ ఇంగ్లండ్‌పై 252 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. ఓవల్ మైదానంలో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 జాబితాలో నాలుగు స్కోర్‌లు 20వ శతాబ్దంలో నమోదయ్యాయి. 21వ శతాబ్దంలో, ఓవల్ మైదానంలో అత్యధిక పరుగులు 2024లో నమోదయ్యాయి. శ్రీలంక 219 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఆతిథ్య జట్టు ఇంగ్లండ్‌ను ఓడించింది.

  • 263 పరుగులు - ఇంగ్లండ్ vs ఆస్ట్రేలియా - 1902
  • 252 పరుగులు - వెస్టిండీస్ vs ఇంగ్లండ్ - 1963
  • 242 పరుగులు - ఆస్ట్రేలియా vs ఇంగ్లండ్ - 1972
  • 225 పరుగులు - వెస్టిండీస్ vs ఇంగ్లండ్ - 1988
  • 219 పరుగులు - శ్రీలంక vs ఇంగ్లండ్ - 2024

 టెస్ట్ క్రికెట్‌లో ఓవల్ మైదానంలో 263 కంటే ఎక్కువ పరుగులు ఎప్పుడూ ఛేదించలేదని గణాంకాలు చెబుతున్నాయి. అదే సమయంలో, భారత జట్టు ఇంగ్లాండ్ ముందు అంతకంటే 111 పరుగులు ఎక్కువ (374 రన్స్) లక్ష్యాన్ని ఉంచింది. గత రికార్డులను పరిశీలిస్తే ఈ టెస్టులో ఇంగ్లాండ్ నెగ్గాలంటే ఏదైనా అద్భుతం జరగాలి. నేడు 4వ రోజు కావడంతో పర్యాటక జట్టు భారత్ టెన్షన్ పడుతోంది. అందులోనూ ఇంగ్లాండ్  బ్యాజ్‌బాల్ శైలి సమస్యగా మారే అవకాశం లేకపోలేదు.

24 ఏళ్ల కిందట చివరి విజయం..

ఓవల్ మైదానంలో ఇది భారత్ ఆడుతున్న 16వ టెస్ట్ మ్యాచ్ ఇది. ఒకవేళ వారు ఇంగ్లండ్‌ను ఓడిస్తే, ఇది టీమ్ ఇండియాకు ఈ వేదికలో 3వ టెస్ట్ మ్యాచ్ విజయం అవుతుంది. ఇంతకుముందు భారత్ 1971, 2021లో విజయాలు సాధించింది. భారత్ ఇక్కడ నెగ్గి 24 ఏళ్లు కావొస్తుంది. అయితే ఓవల్ స్టేడియంలో హయ్యస్ట్ ఛేజింగ్ కంటే వంద పరుగుల కంటే ఎక్కువ టార్గెట్ ఇవ్వడంతో భారత్ శిబిరంలో ఆశలు చిగురించాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Gambhir - Dravid System Comparison: గంభీర్ కోచింగ్ స్టైల్ పై  అశ్విన్ విమర్శలు.. ద్రవిడ్ వ్యూహాలతో పోలుస్తూ కీలక వ్యాఖ్యలు!
గంభీర్ కోచింగ్ స్టైల్ పై  అశ్విన్ విమర్శలు.. ద్రవిడ్ వ్యూహాలతో పోలుస్తూ కీలక వ్యాఖ్యలు!
Shreyas Iyer World Record: కెప్టెన్ గా శ్రేయస్ వరల్డ్ రికార్డ్ .. జింబాబ్వేపై విక్టరీతో 7 మ్యాచుల నిరీక్షణకు ఎండ్ కార్డ్, ధోని రికార్డు బ్రేక్ 
కెప్టెన్ గా శ్రేయస్ వరల్డ్ రికార్డ్ .. జింబాబ్వేపై విక్టరీతో 7 మ్యాచుల నిరీక్షణకు ఎండ్ కార్డ్, ధోని రికార్డు బ్రేక్ 
Asian Games Draw: 2026 ఏషియన్ గేమ్స్ విమెన్స్ క్వార్టర్స్ ప్రత్యర్థి ఖరారు.. మెన్స్ టీమ్ కు జాక్ పాట్..!
2026 ఏషియన్ గేమ్స్ విమెన్స్ క్వార్టర్స్ ప్రత్యర్థి ఖరారు.. మెన్స్ టీమ్ కు జాక్ పాట్..!
IND vs ZIM 1st T20 Result Update: శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Embed widget