అన్వేషించండి

Asian Games 2023: వర్షంతో మ్యాచ్ రద్దు - సెమీస్‌కు చేరిన భారత్ - పతకం పక్కా

INDW vs MLYW: ఏసియన్ గేమ్స్ క్రికెట్ విభాగంలో తొలిసారి పోటీ పడుతున్న భారత్ ఆ దిశగా తొలి అడుగు ముందుకేసింది. వర్షం వల్ల అర్థాంతరంగా రద్దు అయిన మ్యాచ్‌‌లో భారత్ మహిళల జట్టు సెమీస్ చేరింది.

Asian Games 2023: ఆసియా  క్రీడల్లో తొలిసారి బరిలో నిలిచిన భారత క్రికెట్ జట్టు  శుభారంభం చేసింది. గురువారం చైనాలోని హాంగ్జౌ వేదికగా భారత్ - మలేషియా మహిళా జట్ల మధ్య  అర్థాంతరంగా ముగిసిన మ్యాచ్‌లో ర్యాంకు ఆధారంగా టీమిండియా సెమీఫైనల్స్‌‌కు చేరుకుని పతకాన్ని ఖాయం చేసుకుంది.  తొలుత బ్యాటింగ్ చేసిన భారత్  15 ఓవర్లలోనే  రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 173 పరుగుల భారీ స్కోరు చేసింది.  అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన మలేషియా ఇన్నింగ్స్‌లో రెండు బంతులు పడగానే వర్షం  అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను అర్థాంతరంగా రద్దు చేశారు. 

హాంగ్జౌలోని  పింగ్‌ఫెంగ్ క్రికెట్ స్టేడియం వేదికగా  ముగిసిన ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన మలేషియా భారత్‌కు బ్యాటింగ్ అప్పగించింది. ఓపెనర్లు స్మృతి మంధాన  (16 బంతుల్లో 27, 5 ఫోర్లు), షఫాలీ వర్మ (39 బంతుల్లో 67, 4 ఫోర్లు, 5 సిక్సర్లు) తొలి వికెట్‌‌కు 5.2 ఓవర్లలోనే 57 పరుగులు జోడించారు.  అంతగా అనుభవం లేని మలేషియా బౌలర్లను  షఫాలీ ఆటాడుకుంది.  బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపండింది.  మంధాన నిష్క్రమించిన (5.2వ ఓవర్) తర్వాత  కొద్దిసేపు వర్షం ఆటకు అంతరాయం కలిగించింది.  దీంతో  మ్యాచ్‌ను 15 ఓవర్లకు కుదించారు. 

మంధాన నిష్క్రమించినా వన్ డౌన్ ‌లో వచ్చిన  జెమిమా రోడ్రిగ్స్ (29  బంతుల్లోనే వీరవిహారం చేసింది. షఫాలీ కూడా 32 బంతుల్లోనే  అర్థ సెంచరీ పూర్తి చేసుకోవడంతో భారత స్కోరుబోర్డు రాకెట్ వేగంతో పరుగెత్తింది. ఆసియా క్రీడల్లో షఫాలీ తొలి అర్థ సెంచరీ నమోదుచేసిన ఫస్ట్  ఉమెన్ క్రికెటర్‌గా రికార్డులకెక్కింది. 10 ఓవర్లకే భారత్ స్కోరు ఒక వికెట్ నష్టానికి 111గా ఉంది. 13వ ఓవర్లో  ఆఖరి బంతికి  షఫాల నిష్క్రమించింది.   అయితే ఆ  తర్వాత వచ్చిన  వికెట్ కీపర్ రిచా ఘోష్ కూడా ఆకాశమే హద్దుగా చెలరేగింది.  ఏడు బంతుల్లోనే  3 బౌండరీలు, ఒక సిక్సర్ సాయంతో  21 పరుగులు చేసింది.  దీంతో భారత్ 15 ఓవర్లలోనే 173 పరుగుల భారీ స్కోరు చేసింది. మలేషియా బౌలర్లలో 8 మంది బౌలింగ్ చేసినా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. 

అనంతరం భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌‌కు వచ్చిన మలేషియా ఇన్నింగ్స్‌లో రెండు బంతులు పడగానే  వర్షం మళ్లీ దంచికొట్టింది. పూజా వస్త్రకార్ వేసిన రెండు బంతుల్లో మలేషియా  ఓపెనర్ హమాజీ హషిమ్ ఒక పరుగు చేయగలిగింది.   వర్షం  ఎంతకూ తగ్గకపోవడంతో ఆటను అర్థాంతరంగా  రద్దుచేశారు.  ఇరు జట్లకూ తలా ఓ పాయింట్ లభించినా ర్యాంకుల ఆధారంగా భారత్ సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లి పతకాన్ని ఖాయం చేసుకుంది. సెమీస్‌లో భారత్..  ఈనెల 24 (ఆదివారం) పాకిస్తాన్‌తో తలపడే అవకాశముంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Visits Chilukuru Temple: చిలుకూరు అర్చకులు రంగరాజన్‌ను పరామర్శించిన కేటీఆర్, రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవంటూ ఆగ్రహం
చిలుకూరు అర్చకులు రంగరాజన్‌ను పరామర్శించిన కేటీఆర్, రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవంటూ ఆగ్రహం
Peddireddy Ramachandra Reddy: పెద్దిరెడ్డి భూ కబ్జాలపై విజిలెన్స్ నివేదిక, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు
పెద్దిరెడ్డి భూ కబ్జాలపై విజిలెన్స్ నివేదిక, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు
Indian Migrants: డంకీ రూట్‌లో అమెరికాకు వెళ్తూ మార్గం మధ్యలో గుండెపోటుతో పంజాబీ యువకుడు మృతి
డంకీ రూట్‌లో అమెరికాకు వెళ్తూ మార్గం మధ్యలో గుండెపోటుతో పంజాబీ యువకుడు మృతి
RC 16 Update : మెగా ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్... రామ్ చరణ్ బర్త్ డేకి అదిరిపోయే ట్రీట్ రెడీ చేస్తున్న మేకర్స్
మెగా ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్... రామ్ చరణ్ బర్త్ డేకి అదిరిపోయే ట్రీట్ రెడీ చేస్తున్న మేకర్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Madhya Pradesh Dhar Gang Arrest | 55కేసులున్న దొంగల ముఠాను అరెస్ట్ చేసిన అనంత పోలీసులు | ABP DesamBaduguvani Lanka Nurseries | గోదావరి తీరంలో ఈ ఊరి పూలతోటల అందాలు చూశారా | ABP DesamElon Musk MARS Square Structure | మార్స్ మీదకు ఆస్ట్రోనాట్స్ ను పంపాలనంటున్న మస్క్ | ABP DesamKiran Royal Janasena Issue | వివాదంలో చిక్కుకున్న తిరుపతి జనసేన ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Visits Chilukuru Temple: చిలుకూరు అర్చకులు రంగరాజన్‌ను పరామర్శించిన కేటీఆర్, రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవంటూ ఆగ్రహం
చిలుకూరు అర్చకులు రంగరాజన్‌ను పరామర్శించిన కేటీఆర్, రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవంటూ ఆగ్రహం
Peddireddy Ramachandra Reddy: పెద్దిరెడ్డి భూ కబ్జాలపై విజిలెన్స్ నివేదిక, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు
పెద్దిరెడ్డి భూ కబ్జాలపై విజిలెన్స్ నివేదిక, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు
Indian Migrants: డంకీ రూట్‌లో అమెరికాకు వెళ్తూ మార్గం మధ్యలో గుండెపోటుతో పంజాబీ యువకుడు మృతి
డంకీ రూట్‌లో అమెరికాకు వెళ్తూ మార్గం మధ్యలో గుండెపోటుతో పంజాబీ యువకుడు మృతి
RC 16 Update : మెగా ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్... రామ్ చరణ్ బర్త్ డేకి అదిరిపోయే ట్రీట్ రెడీ చేస్తున్న మేకర్స్
మెగా ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్... రామ్ చరణ్ బర్త్ డేకి అదిరిపోయే ట్రీట్ రెడీ చేస్తున్న మేకర్స్
Maha Kumbh Mela: కుంభమేళాలో పాల్గొన్న రాష్ట్రపతి, త్రివేణి సంగమంలో పుణ్య స్నానం చేసిన ద్రౌపది ముర్ము
కుంభమేళాలో పాల్గొన్న రాష్ట్రపతి, త్రివేణి సంగమంలో పుణ్య స్నానం చేసిన ద్రౌపది ముర్ము
Boycott Laila: 'లైలా' సినిమా బాయ్ కాట్ చేయండి - 30 ఇయర్స్ పృథ్వీ కామెంట్స్‌పై వైసీపీ ఫ్యాన్స్ ఫైర్, సినిమాను పొలిటికల్ వివాదం చుట్టుముట్టిందా?
'లైలా' సినిమా బాయ్ కాట్ చేయండి - 30 ఇయర్స్ పృథ్వీ కామెంట్స్‌పై వైసీపీ ఫ్యాన్స్ ఫైర్, సినిమాను పొలిటికల్ వివాదం చుట్టుముట్టిందా?
Viral Video: స్టేజీపై డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన యువతి - గుండెపోటుతో మృతి
స్టేజీపై డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన యువతి - గుండెపోటుతో మృతి
Viral News: ఇండియన్ రైళ్లలో టాయిలెట్లు ఏర్పాటు వెనుక ఉన్న వింత సంఘటన మీకు తెలుసా!
ఇండియన్ రైళ్లలో టాయిలెట్లు ఏర్పాటు వెనుక ఉన్న వింత సంఘటన మీకు తెలుసా!
Embed widget