అన్వేషించండి

మరణించిన వ్యక్తి భౌతిక కాయాన్ని ఒంటరిగా ఉంచకూడదా? శాస్త్రం ఏం చెబుతోంది?

మరణం తర్వాత వెంటనే అంత్యక్రియలు జరిపే అవకాశం లేనపుడు ఆ శవాన్ని ఒంటిరిగా వదిలి పెట్టరు. ఎందుకు?

భగవద్గీతలో చెప్పినదాన్ని బట్టి మరణాలు నిశ్చితాలు, హిందూ సనాతన ధర్మాన్ని అనుసరించి మరణంతో అంతం కాదు. ఆత్మకు మరణం లేదు. మరణంతో కేవలం దేహం నశిస్తుంది. ఆత్మ మరో శరీర ధారణ చేస్తుంది. అందుకే హిందూ ధర్మంలో మరణం తర్వాత కర్మకాండలు నిర్వహిస్తారు. మరణించిన వారి కుటుంబ సభ్యులు చాలా నియమాలను పాటించాల్సి ఉంటుంది. మరణం తర్వాత వెంటనే అంత్యక్రియలు జరిపే అవకాశం లేనపుడు ఆ శవాన్ని ఒంటిరిగా వదిలి పెట్టరు. ఎందుకంటే...

సాధారంణంగా మరణం తర్వాత ఒకరోజు లోపు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మినహా శవాన్ని అంతకు మించిన సమయం పాటు ఉండనివ్వరు. శవానికి నిర్వహించాల్సిన అంతిమ సపర్యలను చేస్తారు. స్నానం చేయించడం, మంచి దుస్తులు, పువ్వులతో అలంకరిండం, కడసారిగా తిలకం దిద్దడం వంటివన్నీ చేసి సగౌరవంగా ఊరేగింపుగా అయిన వారంతా కలిసి అంతిమ యాత్రలో పాల్గొంటారు. అంతిమ సంస్కారం తర్వాత చనిపోయిన వ్యక్తి జ్ఞాపకార్థం అందరూ తలరా స్నానం కూడా చేస్తారు.

తర్వాత 10 నుంచి 12 రోజుల పాటు సంతాప దినాలుగా రకరకాల దిన, వార, కర్మలు నిర్వహిస్తారు. వారి జ్ఞాపకార్థం, వారికి సద్గతులు కలగాలనే ఆశయంతో అనేక రకాల దానధర్మాలు కూడా చేస్తారు. ఇదంతా కూడా దేహాన్ని విడిచిన ఆత్మ సద్గతులు పొందేందుకు చేసే తంతుగా సనాతన ధర్మం చెబుతుంది. దీనిని నమ్మని వారు హిందూవుల్లో దాదాపుగా ఎవరూ ఉండరు. దేవుడి నమ్మని వారు సైతం కొండకచో అంతిమ సంస్కారాలు మాత్రం కచ్చితంగా చేస్తారు. మరణానికి శాస్త్రంలో అంత ప్రాధాన్యత ఉంది. అంతిమ సంస్కారాలలో చాలా నియమాలు ఉంటాయి. నియమాలు పాటించకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని గరుఢ పురాణం చెబుతోంది. అందులో ఒకటి శవాన్ని ఒంటరిగా వదల కూడదు. కచ్చితంగా శవం దగ్గర ఎవరో ఒకరు శవజాగారం చెయ్యాల్సి ఉంటుంది.

శాస్త్రాన్ని అనుసరించి సూర్యాస్తమయం తర్వాత అంతిమ సంస్కాలు చెయ్యకూడదు. గరుఢ పురాణాన్ని అనుసరించి శవాన్ని ఒంటరిగా వదిలేస్తే దాని నుంచి దుర్వాసన వస్తుంది. అదే పురాణంలో ఒంటరిగా ఉండే శవంలో ప్రేతాత్మలు వచ్చి చేరే ప్రమాదం ఉంటుందని రాసి ఉంది. అందుకే అంతిమ సంస్కారాల వరకు శవాన్ని ఒంటరిగా వదిలి పెట్టరు.

మరణానంతరం వెంటనే ఎందుకు అంతిమసంస్కారాలు జరపరు?

వ్యక్తి మరణించినట్టు ప్రకటించిన తర్వాత అతడి శరీరం పూర్తిగా శాంతించే వరకు దహన సంస్కారాలు జరపరాదు. అదీ కాకుండా అతడిని కడసారిగా అతడి ప్రియమైన వారు ఒకసారి చూసేందుకు అవకాశం కూడా కల్పించాలి. కనుక వెంటనే అంతిమ సంస్కారాలు చెయ్యరు.

బంధుమిత్రుల సందర్శనార్థం కొంత సమయం పాటు శవాన్ని ఉంచినపుడు శవం దగ్గర తప్పకుండా మనుషులు ఎవరో ఒకరు ఉండాలి. అలా ఉండకపోతే గరుఢ పురాణాన్ని అనుసరించి ఆ శరీరంలోకి చెడు ఆత్మలు ప్రవేశించే ప్రమాదం ఉంటుంది. అది ఆ శరీరానికి, కుటుంబ సభ్యులకు కూడా ప్రమాదకరం కావచ్చు. కనుక శవం దగ్గర కచ్చితంగా ఎవరైనా ఉండాలి. అదీ కాక బ్యాక్టీరియా చేరి శరీరం కుళ్లిపోవచ్చు. అలా జరగకుండా ఉండేందుకు శవం దగ్గర ధూపం వేసేందుకు కచ్చితంగా ఎవరైనా ఉండడం అవసరం.

Also Read: మీ నక్షత్రం ప్రకారం మీ ఇల్లు ఏ ఫేసింగ్ ఉండాలి, అలా లేకపోతే ఏమవుతుంది!

టాప్ హెడ్ లైన్స్

Varahi Navaratri Dates2026: వారాహి నవరాత్రుల పూజా విధానం, విశిష్టత, ప్రయోజనాలు తెలుసుకోండి
వారాహి నవరాత్రులు 2026 తేదీలు, పూజా విధానం, విశిష్టత, ప్రయోజనాలు తెలుసుకోండి
Unique Traditions: ఈ గ్రామంలో మహిళలు దుస్తులు ధరించరు, శతాబ్దాలుగా అనుసరిస్తున్న 'నిర్వస్త్ర వ్రతం' వెనుక వింత ఆచారం
ఈ గ్రామంలో మహిళలు దుస్తులు ధరించరు, శతాబ్దాలుగా అనుసరిస్తున్న 'నిర్వస్త్ర వ్రతం' వెనుక వింత ఆచారం
Dakshinayanam 2026: ఏడాదికి 2 రోజులు మాత్రమే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు! ఇది అర్థం కావాలంటే దక్షిణాయనం, ఉత్తరాయణం గురించి తెలుసుకోవాలి!
ఏడాదికి 2 రోజులు మాత్రమే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు! ఇది అర్థం కావాలంటే దక్షిణాయనం, ఉత్తరాయణం గురించి తెలుసుకోవాలి!
నవగ్రహాలు: శివాలయాల్లో ఎందుకు, విష్ణు ఆలయాల్లో ఎందుకుండవు? జ్యోతిష్య రహస్యం!
నవగ్రహాలు: శివాలయాల్లో ఎందుకు, విష్ణు ఆలయాల్లో ఎందుకుండవు? జ్యోతిష్య రహస్యం!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Embed widget