అన్వేషించండి

Ayodhya Ram Mandir : అయోధ్య సహా దేశంలో ప్రముఖ రామాలయాలు ఇవే - వీటిలో ఎన్ని దర్శించుకున్నారు!

Lord Rama: అయోధ్యలో నూతనంగా నిర్మితమైన రామాలయంలో జనవరి 22న రాముడు కొలువుతీరనున్నాడు. ఈ సందర్భంగా అయోధ్య సహా దేశ వ్యాప్తంగా ప్రముఖ రామాలయాల గురించి మీకోసం..

List of 10 Best sri Ram Temples

అయోధ్య రామ మందిరం 

ఉత్తర ప్రదేశ్ ఫైజాబాద్ జిల్లాలో  ఉన్న ఈ క్షేత్రానికి రామజన్మ భూమి అని ప్రసిద్ధి.  రామాయణ కాలం కన్నా ముందే సాకేత పురం అనే పేరుతో  ప్రసిద్ధి చెందింది. స్కంధ పురాణంలో అయోధ్యను ఏడు పవిత్ర నగరాల్లో ఒకటిగా పేర్కొన్నారు. అధర్వణ వేదంలో కూడా అయోధ్యను సాక్షాత్తు ఆ భగవంతుడు నిర్మించిన నగరంగా ప్రస్తావించారు. దేవుడు నిర్మించిన నగరం  అయినందునే ధార్మికంగా  అత్యంత ప్రాధాన్యత కలిగిఉందని  భక్తుల విశ్వాసం. సరయూ నది ఒడ్డున ఉన్న ఈ క్షేత్రంలో జనవరి 22న రాముడి విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. 

సీతా రామచంద్రస్వామి ఆలయం 

దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రిలో సీతారాములు వనవాసం సమయంలో నివాసం ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి. త్రేతాయుగంలో  భద్రాద్రి పెద్ద అటవీ ప్రాంతం. ఆ అటవీ ప్రాంతాన్ని పర్ణశాలగా పిలిచేవారప్పుడు. ఇక్కడే రాముడు ఓ కుటీరాన్ని ఏర్పాటు చేసుకుని భార్య, తమ్ముడితో నివాసం ఉన్నాడు. రామాయణంలోని ముఖ్య ఘట్టం జరగడానికి నాంది పలికింది ఈ ప్రాంతంలోనే. ఈ కుటీరంలో ఉన్నప్పుడే లక్ష్మణుడు శూర్పనఖ ముక్కుచెవులు కోశాడు, సీతమ్మ బంగారు లేడిని చూసింది, రావణుడు సీతను ఎత్తుకుపోయాడు…అదే రామరావణ యుద్ధానికి బీజం పడింది. భద్రాద్రితో పాటూ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ రామ పాద స్పర్శతో పునీత మైనవే. అందుకే ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటే సర్వపాపాలు పోతాయని భక్తుల విశ్వాసం. 

Also Read: రాముడొస్తున్నాడు - 30 ఏళ్ల మౌనవ్రతాన్ని విరమించనున్న భక్తురాలు!

కాలారామ్‌ ఆలయం

మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో ఉన్న పురాతన హిందూ పుణ్యక్షేత్రం కాలారామ్ ఆలయం. ఈ ఆలయంలో నల్లరంగు రాముడి  విగ్రహం ఉంది. అందుకే కాలారామ్ అని పిలుస్తారు. ఈ ఆలయాన్ని సర్దార్ రంగారు ఒదేకర్ నిర్మించారు.  పురాణ కథ ప్రకారం... ఓదేకర్ ఓసారి గోదావరి నదిలో మునిగిపోయిన శ్రీరాముని నల్లని విగ్రహాన్ని కల కన్నాడు. ఆ తర్వాత వెళ్లి చూడగా..నదిలోంచి విగ్రహం బయటపడింది. ఆ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆలయం ప్రధాన ద్వారం వద్ద యాత్రికులకు స్వాగతం పలుకుతూ హనుమంతుని విగ్రహం కూడా నలుపు రంగులో ఉంటుంది.  

రామరాజ దేవాలయం 

మధ్యప్రదేశ్‌లోని రామరాజు ఆలయంలో రాముడికి పూజలు ప్రత్యేకంగా నిర్వహిస్తారు. దీన్ని అద్భుతమైన కోట రూపంలో నిర్మించారు. ఇక్కడి ఆలయంలో కాపలాగా పోలీసులను కూడా ఉంటారు. శ్రీరాముడికి ప్రతిరోజూ సాయుధ వందనం అందజేస్తారు. ఇక్కడ రాముడిని దేవుడిగా కాకుండా రాజుగా పూజించే ఆలయం ఇదే..

Also Read: అయోధ్య రాముడి దర్శన వేళలు - పాటించాల్సిన నిబంధనలు ఇవే!

కనక్ భవన్ ఆలయం 

అయోధ్య రాముని జన్మస్థలం. ఇక్కడే ఉన్న కనక్ భవన్ ప్రముఖ రామాలయాల్లో ఒకటిగా పరిగణిస్తారు. ఈ భవన్ అధ్భుతమైన శిల్పకళా వైభవానికి సంకేతం. దశరథుడు తన మూడో భార్య కైకేయికి బహుమతిగా ఇచ్చిన రాజభవనం అని చెబుతారు. కైకైయి ఈ భవనాన్ని సీతాదేవికి ఇచ్చిందంటారు. ఇందులో సీతారాముల విగ్రహాలుంటాయి. 

త్రిప్రయార్ శ్రీరామ దేవాలయం 

ఈ ఆలయం కేరళలోని త్రిసూర్ జిల్లాలో ఉంది. ఇక్కడ కొలువైన శ్రీరాముని విగ్రహాన్ని ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు పూజించాడని చెబుతారు. కేరళలోని చెట్టువా ప్రాంతానికి చెందిన మత్స్యకారుడు ఈ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాడని స్థానిక కథనం. ఆ తర్వాత కాలంలో ఆ ప్రాంత పాలకుడు వక్కయిల్ కైమల్ ఆ విగ్రహాన్ని త్రిపయార్ ఆలయంలో ప్రతిష్టించాడు. ఇక్కడ రామయ్యను దర్శించుకున్న భక్తులు దుష్టశక్తుల నుండి విముక్తి పొందుతాడని భక్తులు నమ్ముతారు. కేరళలోని ముఖ్యమైన పండుగలలో ఒకటైన అరట్టుపూజ పూరమ్‌కి అధిష్టానం. శ్రీరాముని ప్రతిష్ఠాపనకు ముందు ఈ ఆలయంలోని అయ్యప్ప కూడా ఈ పూరంలో పాల్గొన్నారని చెబుతారు. 

Also Read: సప్త పురాలు అంటే ఏవి - అయోధ్యదే ఫస్ట్ ప్లేస్ ఎందుకు!

శ్రీ రామ తీర్థ మందిర్ 

ఈ ఆలయం పంజాబ్‌లోని అమృత్సర్‌లో ఉంది. లంక నుంచి అయోధ్యకు వచ్చిన తర్వాత.. సీతమ్మపై నింద రావడంతో రాముడు ఆమెను మళ్లీ విడిచిపెట్టేస్తాడు. ఆ సమయంలో ఆమె వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఆశ్రయం పొందింది. అదే స్థలంలో నిర్మించిన ఆలయం శ్రీ రామ తీర్థమందిర్. సీతాదేవి ఇక్కడే లవకుశలకు జన్మనిచ్చింది. రామాయణ రచన సాగిందీ ఇక్కడే...

కొందండ రామస్వామి దేవాలయం 

ఈ ఆలయం కర్ణాటకలోని చిక్ మంగళూరు జిల్లాలో ఉంది. శ్రీరాముడు పరశురాముడి విల్లును పగలగొట్టి అహంకారాన్ని అణిచివేసిన ప్రదేశం ఇది. పరశురాముడు శ్రీరామునికి దూషించి తన తప్పును తెలుసుకుని.. శ్రీరాముని వివాహ దృశ్యాలను చూపించమని అభ్యర్థించాడట.  దీనికి ప్రతిగా కోదండరామస్వామి ఆలయంలోని విగ్రహాలు హిందూ వివాహ అలంకారంలో కనిపిస్తాడు. రాముడికి సీతాదేవి కుడివైపు నిల్చుని ఉన్న ఆలయం ఇదొక్కటే 

Also Read: ఆ రోజే బిడ్డను కంటాం - రామచంద్రా దీనిని భక్తి అంటారా!

రామస్వామి దేవాలయం 

రామస్వామి దేవాలయం  తమిళనాడులో ఉంది. ఇది భారతదేశంలోని అత్యంత అందమైన ప్యాలెస్‌లలో ఒకటి. ఆలయం లోపల ఉన్న అద్భుతమైన శిల్పాలు రామాయణ ఇతిహాసం సమయంలో జరిగిన ప్రసిద్ధ సంఘటనలను అద్భుతంగా ఉంటాయి.  శ్రీరామ, సీత, లక్ష్మణ విగ్రహాలతో పాటూ భరత, శత్రుఘ్నుల విగ్రహాలను కూడా చూడగలిగే ఏకైక ఆలయం ఇదే. 

రఘునాథ్ ఆలయం 

జమ్మూలోని రఘునాథ్ దేవాలయం ఉత్తర భారతదేశంలోని ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి. రఘునాథ్ ఆలయ సముదాయంలోని ప్రధాన మందిరం కాకుండా, వివిధ దేవతల ఆలయాలు ఇక్కడ వెలిశాయి. రఘునాథ్ ఆలయాన్ని మొఘల్ నిర్మాణ శైలిలో ఉంటుంది.

Also Read: అయోధ్యలో రామమందిరంతో పాటూ ఇవన్నీ సందర్శించాల్సిన ప్రదేశాలే! 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Team India Meets PM Modi: ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్  ఛాట్
ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్ ఛాట్
Jagan On Pinnelli Ramakrishna Reddy :   పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ -  మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ - మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
Warangal NIT Student: వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
Team India with PM Modi: ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP DesamRahul Drvaid Recalls Rohit Sharma Phone Call in November | ద్రావిడ్ కు ఫోన్ చేసి రోహిత్ ఏం చెప్పారు?T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Team India Meets PM Modi: ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్  ఛాట్
ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్ ఛాట్
Jagan On Pinnelli Ramakrishna Reddy :   పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ -  మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ - మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
Warangal NIT Student: వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
Team India with PM Modi: ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
Indian 2: హైదరాబాద్‌కు వస్తున్న Bharateeyudu 2 - తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
హైదరాబాద్‌కు వస్తున్న Bharateeyudu 2 - తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
Mysterious Deaths: 'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టింది' - గ్రామంలో మిస్టరీ మరణాలతో భయం భయం, ఎవరినీ కదిలించినా అదే కథ!
'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టింది' - గ్రామంలో మిస్టరీ మరణాలతో భయం భయం, ఎవరినీ కదిలించినా అదే కథ!
Air Pollution: పొల్యూషన్‌ వల్ల 33 లక్షల మంది మృతి, గాలి పీల్చడం హానికరం అని ప్రకటనలు ఇవ్వాలేమో
పొల్యూషన్‌ వల్ల 33 లక్షల మంది మృతి, గాలి పీల్చడం హానికరం అని ప్రకటనలు ఇవ్వాలేమో
Viral News: దయచేసి క్షమించండి, ఇల్లు గడవక చోరీ చేస్తున్నాను - అంతా కాజేసి లెటర్‌ వదిలి వెళ్లిన దొంగ
దయచేసి క్షమించండి, ఇల్లు గడవక చోరీ చేస్తున్నాను - అంతా కాజేసి లెటర్‌ వదిలి వెళ్లిన దొంగ
Embed widget