అన్వేషించండి

Ayodhya Ram Mandir: రాముడొస్తున్నాడు - 30 ఏళ్ల మౌనవ్రతాన్ని విరమించనున్న భక్తురాలు!

Ayodhya Ram Mandir: రామయ్య భక్తిలో మునిగి తేలిన మరో శబరి ఈమె. ఆ శబరి రాముడికోసం ఎదురుచూస్తే ...ఈ శబరి అయోధ్యలో రాముడి ప్రతిష్టాపన కోసం ఎదురుచూసింది. అందుకే 30 ఏళ్ల మౌనవ్రతాన్ని ఇక విరమించనుంది..

Ayodhya Ram Mandir:  అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగాలనేది కోట్లాది హిందువుల దశాబ్దాల నాటి కల. త్వరలోనే అయోధ్య రాముడు గర్భగుడిలో కొలువుతీరనున్నాడు. ఈ సందర్భంగా ఓ భక్తురాలి గురించి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన సందర్భం ఇది..

అయోధ్య రాముడికోసం ఓ భక్తురాలి ప్రతిజ్ఞ

అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగాలని దశాబ్దాలుగా పోరాటం జరిగింది. యాగాలు, వ్రతాలు, నోములు ఎవరికి తోచింది వారు ఫాలో అయ్యారు. కానీ ఓ భక్తురాలు మాత్రం ఏకంగా దీక్ష చేపట్టింది..  జార్ఘండ్ కు చెందిన ఆ భక్తురాలి పేరు సరస్వతీ అగర్వాల్. వయసు 85 సంవత్సరాలు. ఆమెకు శ్రీరాముడంటే ఎంత భక్తి అంటే..అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరిగి రామయ్య కొలువుతీరే వరకూ మౌనవ్రతం చేయాలని నిర్ణయించుకుంది. అలా 1992లో ప్రతిజ్ఞ చేసిన ఆమె, అప్పట్నుంచి రోజుకు 23 గంటల పాటు మౌనవ్రతం పాటిస్తూ వచ్చారు. ఎప్పుడైతే ప్రధాని మోదీ, ఆలయానికి శంకుస్థాపన చేశారో ఆ రోజు నుంచి పూర్తిస్థాయిలో 24 గంటల పాటు మౌనవ్రతం పాటించారు.

Also Read: అయోధ్య రాముడి దర్శన వేళలు - పాటించాల్సిన నిబంధనలు ఇవే!

విగ్రహ ప్రతిష్టాపనకు సరస్వతికి ఆహ్వానం

అయోధ్యలో జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నుంచి సరస్వతి అగర్వాల్‌కు కూడా ఆహ్వానం అందింది. 1992 మేలో అయోధ్యకు వెళ్లిన సరస్వతి అగర్వాల్.. రామజన్మభూమి ట్రస్ట్ అధినేత మహంత్ నృత్య గోపాల్ దాస్‌ను కలిశారు. తర్వాత కమ్తానాథ్ పర్వత ప్రదక్షిణ చేసిన తర్వాత చిత్రకూట్‌లో ఏడున్నర నెలల పాటు కల్పవాసంలో ఉండిపోయారు. ఇక 1992 డిసెంబర్ 6 వ తేదీన ఆమె తిరిగి నృత్య గోపాల్ దాస్‌ను కలిసి ఆ తర్వాత మౌన వ్రతం ప్రారంభించారు. 

Also Read: సప్త పురాలు అంటే ఏవి - అయోధ్యదే ఫస్ట్ ప్లేస్ ఎందుకు!

ఇకపై జీవితం రాముడికే అంకితం

మూడు దశాబ్ధాలుగా రాముడి భక్తిలో మునిగితేలిన సరస్వతి..ఇకపై కూడా తన జీవితం పూర్తిగా రాముడి సేవకే అంకితం అన్నారు.  అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తికావడంతో ఇకపై అయోధ్యలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. ప్రాణ ప్రతిష్టలో పాల్గొనేందుకు బాల రాముడు తనను ఆహ్వానించాడని.. 30 ఏళ్లుగా తాను చేస్తున్న తపస్సు విజయవంతమైందని సంతోషపడుతోంది. ఇకపై అయోధ్యలోని మహంత్ నృత్య గోపాల్ దాస్ ఆశ్రమంలో ఉండనున్నట్టు...తన మొత్తం భావాలను రాతపూర్వకంగా తెలియజేశారు సరస్వతి. 

Also Read: ఆ రోజే బిడ్డను కంటాం - రామచంద్రా దీనిని భక్తి అంటారా!

మౌనవ్రతం విరమణ ఎప్పుడంటే

ఎట్టకేలకు భక్తురాలు సరస్వతీ దేవి వ్రతం ఫలించింది. జనవరి 22వ తేదీన ఆలయ ప్రతిష్ట జరగనుంది. రామమందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట జరిగిన తర్వాత....'రామ్, సీతారాం' అంటూ 30 ఏళ్ల మౌన దీక్షను విరమించనున్నారు.  స్థానికులంతా ఆమెను మౌని మాతగా పిలుస్తారు.  35 ఏళ్లక్రితం సరస్వతి అగర్వాల్  భర్త మరణించారు. ఆమెకు ముగ్గురు సంతానం. రాముడికోసం ఆమె చేపట్టిన మౌనదీక్షకు వారంతా సహకరిస్తూ వచ్చారు. అయోధ్యలో రాముడు కొలువుతీరే సమయం ఆసన్నమవుతుండడంతో సరస్వతి అగర్వాల్ ఆనందానికి అవధుల్లేవు...

Also Read: అయోధ్యలో రామమందిరంతో పాటూ ఇవన్నీ సందర్శించాల్సిన ప్రదేశాలే! 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 RR VS CSK Result Update: రాయ‌ల్స్ బోణీ.. చెన్నైకి స్వీట్ షాకిచ్చిన రాజస్థాన్, రాణించిన నితీశ్, హ‌స‌రంగా, రుతురాజ్ పోరాటం వృథా
రాయ‌ల్స్ బోణీ.. చెన్నైకి స్వీట్ షాకిచ్చిన రాజస్థాన్, రాణించిన నితీశ్, హ‌స‌రంగా, రుతురాజ్ పోరాటం వృథా
Andhra Pradesh News: ఏపీలో మిషన్ పీ4 ప్రారంభం, గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా
ఏపీలో మిషన్ పీ4 ప్రారంభం, గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా
Pastor Praveen Pagadala Video: ప్రవీణ్‌ పగడాల మృతి కేసులో ట్విస్ట్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాస్టర్‌ వీడియో..!
ప్రవీణ్‌ పగడాల మృతి కేసులో ట్విస్ట్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాస్టర్‌ వీడియో..!
Sanna Biyyam Scheme: సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, వచ్చే నెల నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ
సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, వచ్చే నెల నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

DC vs SRH Match Highlights IPL 2025 | సన్ రైజర్స్ హైదరాబాద్ పై ఢిల్లీ క్యాపిటల్స్ గ్రాండ్ విక్టరీ | ABP DesamRR vs CSK Match Preview IPL 2025 | నేడు గువహాటిలో చెన్నసూపర్ కింగ్స్ తో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ | ABP DesamDC vs SRH Match Preview IPL 2025 | ఏ టీమ్ తెలుగు వాళ్లది..ఆటతో తేల్చేస్తారా | ABP DesamHardik Pandya captaincy IPL 2025 | టీమ్ సెలక్షన్ లోనూ పాండ్యా తప్పిదాలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 RR VS CSK Result Update: రాయ‌ల్స్ బోణీ.. చెన్నైకి స్వీట్ షాకిచ్చిన రాజస్థాన్, రాణించిన నితీశ్, హ‌స‌రంగా, రుతురాజ్ పోరాటం వృథా
రాయ‌ల్స్ బోణీ.. చెన్నైకి స్వీట్ షాకిచ్చిన రాజస్థాన్, రాణించిన నితీశ్, హ‌స‌రంగా, రుతురాజ్ పోరాటం వృథా
Andhra Pradesh News: ఏపీలో మిషన్ పీ4 ప్రారంభం, గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా
ఏపీలో మిషన్ పీ4 ప్రారంభం, గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా
Pastor Praveen Pagadala Video: ప్రవీణ్‌ పగడాల మృతి కేసులో ట్విస్ట్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాస్టర్‌ వీడియో..!
ప్రవీణ్‌ పగడాల మృతి కేసులో ట్విస్ట్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాస్టర్‌ వీడియో..!
Sanna Biyyam Scheme: సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, వచ్చే నెల నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ
సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, వచ్చే నెల నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ
IPL 2025 SRH VS DC Result Update: స‌న్ రైజ‌ర్స్ కు రెండో ఓట‌మి.. అన్ని విభాగాల్లో ఆకట్టుకున్న ఢిల్లీ, టాప్-2కి చేరిక‌ రాణించిన డుప్లెసిస్, స్టార్క్
స‌న్ రైజ‌ర్స్ కు రెండో ఓట‌మి.. అన్ని విభాగాల్లో ఆకట్టుకున్న ఢిల్లీ, టాప్-2కి చేరిక‌ రాణించిన డుప్లెసిస్, స్టార్క్
Sikandar Review - సల్మాన్ భాయ్ సినిమా హిట్టా? ఫట్టా? రంజాన్‌ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?
సల్మాన్ భాయ్ సినిమా హిట్టా? ఫట్టా? రంజాన్‌ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?
Andhra Pradesh: గుడ్‌న్యూస్, రూ.2 వేల కోట్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం
గుడ్‌న్యూస్, రూ.2 వేల కోట్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం
Puri Jagannadh Vijay Sethupathi: పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి మూవీ ఫిక్స్ - అధికారిక ప్రకటన వచ్చేసింది.. షూటింగ్ ఎప్పుడంటే?
పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి మూవీ ఫిక్స్ - అధికారిక ప్రకటన వచ్చేసింది.. షూటింగ్ ఎప్పుడంటే?
Embed widget