అన్వేషించండి

Dussehra 2025: ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు 5 రోజుల్లో భారీ ఆదాయం, ఇకపై భక్తులందరకీ ఉచిత దర్శనం - వీఐపీలు గమనించాలి!

Vijayawada: విజయవాజడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. భారీగాతరలివచ్చే భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకునేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు

Vijayawada Dussehra: ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ..నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా రోజుకో అలంకారంలో దర్శనమిస్తోంది. అమ్మవారి దర్శనానికి భారీగాభక్తులు తరలివస్తున్నారు. ఈ మేరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారిని దర్శించుకునేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. ఈ మేరకు అన్ని రకాల దర్శన టికెట్ల విక్రయాలను నిలిపివేశామని, భక్తులందరికీ ఉచితంగానే అమ్మవారి దర్శనం కల్పిస్తున్నామని దుర్గగుడి ఈవో శీనా నాయక్ తెలిపారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే... నిర్దేశించిన సమయాల్లో VIP దర్శనాలు కొనసాగుతాయని చెప్పారు. నిర్దేశిత సమయాలు పాటించని వీఐపీల వల్ల సామాన్య భక్తులకు అసౌకర్యం కలుగుతోంద్న విషయం ప్రముఖులు గమనించాలన్నారు.
 
మొదటి ఐదు రోజుల్లో కనకదుర్గమ్మ ఆదాయం రూ.28 లక్షలు
 
దసరా ఉత్సవాల్లో ఐదవ రోజు అయిన  సెప్టెంబర్ 26 శుక్రవారం  సాయంత్రం 6 గంటల సమయానికి పలు రకాల సేవల రూపేణా అమ్మవారికి  28లక్షల 21 వేల 637 రూపాయల  ఆదాయం వచ్చింది. 15 రూపాయల లడ్డూలు 19,121 విక్రయించగా 2 లక్షల  86వేల 815 రూపాయలు , వందరూపాయల లడ్డు బాక్స్ లు 23,581 విక్రయించగా  23 లక్షల 58 వేల 100 రూపాయల ఆదాయం వచ్చిందన్నారు. ఇవి కాకుండా పరోక్షంగా జరిగిన ప్రత్యేక  కుంకుమార్చనల ద్వారా  20 వేల రూపాయలు, ప్రత్యేక పరోక్ష చండిహోమం ద్వారా 4 వేలు, శ్రీచక్రార్చన ద్వారా 6వేలు...ప్రత్యేక ఖడ్గమాలార్చన ద్వారా 35 వేల 812 రూపాయలు ఫోటో& క్యాలెండర్ల విక్రయం ద్వారా 4 వేల 890 రూపాయలు, కేశఖండన ద్వారా  1,01,520 ఇతరత్రా 4,500 రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయానికి  90 వేల 6 మంది భక్తులు అమ్మ వారిని  దర్శించుకున్నట్లు చెప్పారు. రాత్రి 12 గంటలవరకూ అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉన్నందున ఈ సంఖ్య మరింత పెరగుతుంది.  చిన్నారులు తప్పిపోకుండా 6,185 ట్యాగ్ లు పిల్లలకు వేశామని తెలిపారు. 23 వేల 656 మందికి అన్న ప్రసాద విచారణ చేసినట్లు తెలిపారు. 

"అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల బె
ద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి బుచ్చినయమ్మ, దన్నులో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ, మా
యమ్మ, కృపాబ్ధి ఇచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్"

పోతన రాసిన ఈ పద్యం చదివినా, విన్నా మంచి ఫలితం పొందుతారు. సాధారణంగా కొన్ని శ్లోకాలు, పద్యాలను గురువులు పక్కన లేకుండా, పూర్తిగా చదవడం రాకుండా తప్పులు చదవకూడదు. శక్తి స్వరూపిణికి సంబంధించిన పూజల విషయంలో అస్సలు ఈ ప్రయోగం చేయకూడదు. బీజాక్షరాలున్న శ్లోకం అయితే పొరపాటున కూడా తప్పుగా చదవకూడదు. అందుకే ఈ పద్యం ద్వారా సులువుగా అమ్మవారిని స్మరించుకునే అవకాశం కల్పించారు పోతన.  

 దసరా నవరాత్రులు సందర్భంగా ఆంధ్ర & తెలంగాణలో దర్శించుకోవాల్సిన ముఖ్యమైన ఆలయాలు ఇవే!

 శ్రీ చక్రంలో వివిధ దేవతలను స్తుతిస్తూ సాగే శక్తివంతమైన స్తోత్రం - నవరాత్రుల్లో ఒక్కసారైనా పఠించండి!

శ్రీశైలం శక్తిపీఠంలో శరన్నవరాత్రి ఉత్సవాలు! 2025లో భ్రమరాంబిక అమ్మవారి అలంకారాలు ఇవే!

2025 శరన్నవరాత్రుల్లో ఏ రోజు ఏ అలంకారం? ఏ రోజు ఏ నైవేద్యం సమర్పించాలి? పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

12-08-2026 బుధవారం మీ రాశిఫలాలు!
12-08-2026 బుధవారం మీ రాశిఫలాలు!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
అంతర్గత అంధకారాన్ని తొలగించే అమావాస్య ! ఆగష్టు 12 సూర్యగ్రహణం..ఈ రోజు ఏం చేయాలి? ఏం చేయకూడదు?
అంతర్గత అంధకారాన్ని తొలగించే అమావాస్య ! ఆగష్టు 12 సూర్యగ్రహణం..ఈ రోజు ఏం చేయాలి? ఏం చేయకూడదు?
సూర్య గ్రహణం రోజు ఆరుద్ర నక్షత్రంలోకి కుజుడు! 3 రాశులవారికి ప్రయోజనం!
సూర్య గ్రహణం రోజు ఆరుద్ర నక్షత్రంలోకి కుజుడు! 3 రాశులవారికి ప్రయోజనం!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget