అన్వేషించండి

Dussehra 2025: ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు 5 రోజుల్లో భారీ ఆదాయం, ఇకపై భక్తులందరకీ ఉచిత దర్శనం - వీఐపీలు గమనించాలి!

Vijayawada: విజయవాజడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. భారీగాతరలివచ్చే భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకునేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు

Vijayawada Dussehra: ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ..నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా రోజుకో అలంకారంలో దర్శనమిస్తోంది. అమ్మవారి దర్శనానికి భారీగాభక్తులు తరలివస్తున్నారు. ఈ మేరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారిని దర్శించుకునేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. ఈ మేరకు అన్ని రకాల దర్శన టికెట్ల విక్రయాలను నిలిపివేశామని, భక్తులందరికీ ఉచితంగానే అమ్మవారి దర్శనం కల్పిస్తున్నామని దుర్గగుడి ఈవో శీనా నాయక్ తెలిపారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే... నిర్దేశించిన సమయాల్లో VIP దర్శనాలు కొనసాగుతాయని చెప్పారు. నిర్దేశిత సమయాలు పాటించని వీఐపీల వల్ల సామాన్య భక్తులకు అసౌకర్యం కలుగుతోంద్న విషయం ప్రముఖులు గమనించాలన్నారు.
 
మొదటి ఐదు రోజుల్లో కనకదుర్గమ్మ ఆదాయం రూ.28 లక్షలు
 
దసరా ఉత్సవాల్లో ఐదవ రోజు అయిన  సెప్టెంబర్ 26 శుక్రవారం  సాయంత్రం 6 గంటల సమయానికి పలు రకాల సేవల రూపేణా అమ్మవారికి  28లక్షల 21 వేల 637 రూపాయల  ఆదాయం వచ్చింది. 15 రూపాయల లడ్డూలు 19,121 విక్రయించగా 2 లక్షల  86వేల 815 రూపాయలు , వందరూపాయల లడ్డు బాక్స్ లు 23,581 విక్రయించగా  23 లక్షల 58 వేల 100 రూపాయల ఆదాయం వచ్చిందన్నారు. ఇవి కాకుండా పరోక్షంగా జరిగిన ప్రత్యేక  కుంకుమార్చనల ద్వారా  20 వేల రూపాయలు, ప్రత్యేక పరోక్ష చండిహోమం ద్వారా 4 వేలు, శ్రీచక్రార్చన ద్వారా 6వేలు...ప్రత్యేక ఖడ్గమాలార్చన ద్వారా 35 వేల 812 రూపాయలు ఫోటో& క్యాలెండర్ల విక్రయం ద్వారా 4 వేల 890 రూపాయలు, కేశఖండన ద్వారా  1,01,520 ఇతరత్రా 4,500 రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయానికి  90 వేల 6 మంది భక్తులు అమ్మ వారిని  దర్శించుకున్నట్లు చెప్పారు. రాత్రి 12 గంటలవరకూ అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉన్నందున ఈ సంఖ్య మరింత పెరగుతుంది.  చిన్నారులు తప్పిపోకుండా 6,185 ట్యాగ్ లు పిల్లలకు వేశామని తెలిపారు. 23 వేల 656 మందికి అన్న ప్రసాద విచారణ చేసినట్లు తెలిపారు. 

"అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల బె
ద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి బుచ్చినయమ్మ, దన్నులో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ, మా
యమ్మ, కృపాబ్ధి ఇచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్"

పోతన రాసిన ఈ పద్యం చదివినా, విన్నా మంచి ఫలితం పొందుతారు. సాధారణంగా కొన్ని శ్లోకాలు, పద్యాలను గురువులు పక్కన లేకుండా, పూర్తిగా చదవడం రాకుండా తప్పులు చదవకూడదు. శక్తి స్వరూపిణికి సంబంధించిన పూజల విషయంలో అస్సలు ఈ ప్రయోగం చేయకూడదు. బీజాక్షరాలున్న శ్లోకం అయితే పొరపాటున కూడా తప్పుగా చదవకూడదు. అందుకే ఈ పద్యం ద్వారా సులువుగా అమ్మవారిని స్మరించుకునే అవకాశం కల్పించారు పోతన.  

 దసరా నవరాత్రులు సందర్భంగా ఆంధ్ర & తెలంగాణలో దర్శించుకోవాల్సిన ముఖ్యమైన ఆలయాలు ఇవే!

 శ్రీ చక్రంలో వివిధ దేవతలను స్తుతిస్తూ సాగే శక్తివంతమైన స్తోత్రం - నవరాత్రుల్లో ఒక్కసారైనా పఠించండి!

శ్రీశైలం శక్తిపీఠంలో శరన్నవరాత్రి ఉత్సవాలు! 2025లో భ్రమరాంబిక అమ్మవారి అలంకారాలు ఇవే!

2025 శరన్నవరాత్రుల్లో ఏ రోజు ఏ అలంకారం? ఏ రోజు ఏ నైవేద్యం సమర్పించాలి? పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget