అన్వేషించండి

Modi Navratri Fasting 2025: మోదీ నవరాత్రి ఉపవాసం వెనుకున్న రహస్యం - ఇది భక్తి మాత్రమే కాదు మనసుని నియంత్రించే సాధన!

Navratri Fasting Secrets: శారదీయ నవరాత్రుల సందర్భంగా ప్రధాని మోదీ ఉపవాసం ప్రత్యేకమైనది. 9 రోజులు నీరు, పండ్లు, సంయమనంతో తపస్సు చేస్తారు.

Shardiya Navratri 2025: నవరాత్రి సమయంలో ప్రతి ఒక్కరూ శక్తి స్వరూపిణిని భక్తితో పూజిస్తారు. ఉపవాసం ఆచరిస్తారు. అయితే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉపవాసం కేవలం పూజలు, ప్రార్థనలు మాత్రమే కాదు, ఇది ఒక లోతైన సాధన. ఈ నవరాత్రులను ప్రధాని మోదీ తన జీవితాన్ని క్రమశిక్షణతో కూడిన ప్రయోగశాలగా మార్చుకుంటారు. ఈ ఉపవాసం ఆయనకు శరీరం కంటే మనస్సు ,ఆత్మను నియంత్రించే ఒక సాధనం.

మోదీ ఉపవాసాన్ని సాధనగా ఎందుకు భావిస్తారు?

ప్రధాని మోదీ నవరాత్రి తొమ్మిది రోజులు తన జీవితంలో అత్యంత పవిత్రమైన రోజులు అని చెబుతారు. ఆహారాన్ని త్యజించడం వల్ల ఆయన ఆకలితో ఉండటమే కాకుండా, ఇంద్రియ నిగ్రహం సాధ్యమవుతుంది.ఇది సాధారణ ఉపవాసం కాదు.. ఇక్కడ ఆకలి బాధ ఆత్మబలంగా మారుతుంది.

ఒక పండు మాత్రమే తింటారు
 
ప్రధాని మోదీ ఉపవాసం ఇతరులకంటే భిన్నంగా ఉంటుంది. ఈ సమయంలో కేవలం ఒక పండు మాత్రమే తింటారు. నవరాత్రులు అదే అనుసరిస్తారు. బొప్పాయి,  ఆపిల్ లేదంటే కొన్నిసార్లు కేవలం కొబ్బరి నీరు మాత్రమే తీసుకుంటారు. ఈ పద్ధతి శరీరంపై నియంత్రణ సాధించడంతో పాటూ మనసుని ఏకాగ్రతగా ఉంచుంతుంది. తినే ఆహారంలో రుచులు కోరుకున్నప్పుడు శరీరంపై నియంత్రణ కోల్పోయినట్టవుతుందంటారు.
 
నీటితో గడిపే రోజులున్నాయి

కొన్నిసార్లు...నవరాత్రి మొత్తం గోరువెచ్చని నీటిని మాత్రమే తీసుకుంటారు. అత్యంత బిజీగా ఉంటే మోదీ ఇవన్నీ పాటించడం ఎలా సాధ్యం అనుకోవచ్చు కానీ ఇది మోదీకి పరమ సంయమనం. ఇక్కడ శరీరం యొక్క శక్తి లోపలి శుభ్రతకు ఉపయోగపడుతుంది. మనసుని శుద్ధి చేస్తుంది.
 
సాధారణతలో దాగి ఉన్న ఆరోగ్య రహస్యం

ఉపవాసం కాకుండా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆహారం చాలా సాధారణమైనది. మునగ పరాటా, వేప ఆకులు, మిశ్రీ, కిచిడి , తేలికపాటి ఆహారం. ఇవన్నీ అతని దినచర్యలో భాగం. యోగా, ధ్యానం,నడకతో పాటు...ఆరోగ్యం  ఆధ్యాత్మికతను జీవితానికి ఆధారంగా భావిస్తారని మోదీ దినచర్య నిరూపిస్తుంది.

సంయమనమే అసలైన శక్తి

ఢిల్లీలో ఈమధ్యకాలంలో కలుషిత ఆహారం తిని వందలమంది అనారోగ్యం పాలయ్యారు.  ఇది ఉపవాసం చేసేటప్పుడు జాగ్రత్త  పరిశుభ్రత కూడా అంతే ముఖ్యమని గుర్తు చేసింది. మోదీ క్రమశిక్షణతో కూడిన  నియంత్రిత ఉపవాసం నవరాత్రి సందేశం కేవలం దేవి భక్తి మాత్రమే కాదు, స్వీయ నియంత్రణే మనపై మనం సాదించే విజయం అని మనకు నేర్పుతుంది.

నవరాత్రి ఉపవాసం రాజకీయాలకు అతీతమైన సందేశం

ప్రధాని మోదీ నవరాత్రి ఉపవాసం రాజకీయాలకు అతీతంగా ఒక సందేశాన్ని ఇస్తుంది, సంయమమే గొప్ప ఆయుధం. ప్రజలు ఉపవాసాన్ని నమ్మకంతో  చేస్తే.. ప్రధాని మోదీ దానిని స్వీయ-క్రమశిక్షణ తపస్సుగా మార్చుకుంటారు. అందుకే ఆయన ఉపవాసం ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉంది, ఎందుకంటే ఇది ఆకలిని త్యజించడం మాత్రమే కాదు, మనస్సు .. ఆత్మ యొక్క లోతైన సాధన కూడా.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించింది మాత్రమే. ABP దేశం ఎటువంటి నమ్మకం లేదా సమాచారాన్ని ధృవీకరించదని ఇక్కడ చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Marriage Muhurat 2026: ఏప్రిల్-మే నెలల్లో పెళ్లి ముహూర్తాలు ఇవే! సరైన తేదీలు , సమయం తెలుసుకోండి!
2026 ఏప్రిల్-మే నెలల్లో పెళ్లి ముహూర్తాలు ఇవే! సరైన తేదీలు సమయం తెలుసుకోండి!
Vastu Tips Telugus: ఇల్లు కొనేటప్పుడు ఈ దిశలపై ప్రత్యేక శ్రద్ధవహించకపోతే ఇబ్బందులు తప్పవు!
ఇల్లు కొనేటప్పుడు ఈ దిశలపై ప్రత్యేక శ్రద్ధవహించకపోతే ఇబ్బందులు తప్పవు!
Shukra Gochar 2026: మేష రాశిలోకి శుక్రుడు! ఏప్రిల్ 19 వరకూ ఈ 5 రాశులవారికి పండుగే, మిగిలిన రాశులపై ఎలాంటి ప్రభావం?
మేష రాశిలోకి శుక్రుడు! ఏప్రిల్ 19 వరకూ ఈ 5 రాశులవారికి పండుగే, మిగిలిన రాశులపై ఎలాంటి ప్రభావం?
2026 మార్చి 28 రాశిఫలాలు: మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ఫలితాలు!
2026 మార్చి 28 రాశిఫలాలు: మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ఫలితాలు!

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RCB VS SRH Highlights: ఇషాన్ కిషన్ కెప్టెన్ ఇన్నింగ్స్, చివర్లో అనికేత్ వర్మ మెరుపులు.. RCBకి SRH బిగ్ టార్గెట్
ఇషాన్ కిషన్ కెప్టెన్ ఇన్నింగ్స్, చివర్లో అనికేత్ వర్మ మెరుపులు.. RCBకి SRH బిగ్ టార్గెట్
CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
Amaravati What Next: అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
Railway Advertisements: మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
Family Entertainers : వీకెండ్ ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి - తెలుగు టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవే
వీకెండ్ ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి - తెలుగు టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవే
Iran War Updates: గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
Revanth Reddy: అక్కా!మూసీ ప్రాజెక్టుపై వేసిన కేసులు వెనక్కి తీసుకోమని మీ కొడుక్కి చెప్పు! రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్‌!
అక్కా!మూసీ ప్రాజెక్టుపై వేసిన కేసులు వెనక్కి తీసుకోమని మీ కొడుక్కి చెప్పు! రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్‌!
Telangana: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!
Embed widget