అన్వేషించండి

Modi Navratri Fasting 2025: మోదీ నవరాత్రి ఉపవాసం వెనుకున్న రహస్యం - ఇది భక్తి మాత్రమే కాదు మనసుని నియంత్రించే సాధన!

Navratri Fasting Secrets: శారదీయ నవరాత్రుల సందర్భంగా ప్రధాని మోదీ ఉపవాసం ప్రత్యేకమైనది. 9 రోజులు నీరు, పండ్లు, సంయమనంతో తపస్సు చేస్తారు.

Shardiya Navratri 2025: నవరాత్రి సమయంలో ప్రతి ఒక్కరూ శక్తి స్వరూపిణిని భక్తితో పూజిస్తారు. ఉపవాసం ఆచరిస్తారు. అయితే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉపవాసం కేవలం పూజలు, ప్రార్థనలు మాత్రమే కాదు, ఇది ఒక లోతైన సాధన. ఈ నవరాత్రులను ప్రధాని మోదీ తన జీవితాన్ని క్రమశిక్షణతో కూడిన ప్రయోగశాలగా మార్చుకుంటారు. ఈ ఉపవాసం ఆయనకు శరీరం కంటే మనస్సు ,ఆత్మను నియంత్రించే ఒక సాధనం.

మోదీ ఉపవాసాన్ని సాధనగా ఎందుకు భావిస్తారు?

ప్రధాని మోదీ నవరాత్రి తొమ్మిది రోజులు తన జీవితంలో అత్యంత పవిత్రమైన రోజులు అని చెబుతారు. ఆహారాన్ని త్యజించడం వల్ల ఆయన ఆకలితో ఉండటమే కాకుండా, ఇంద్రియ నిగ్రహం సాధ్యమవుతుంది.ఇది సాధారణ ఉపవాసం కాదు.. ఇక్కడ ఆకలి బాధ ఆత్మబలంగా మారుతుంది.

ఒక పండు మాత్రమే తింటారు
 
ప్రధాని మోదీ ఉపవాసం ఇతరులకంటే భిన్నంగా ఉంటుంది. ఈ సమయంలో కేవలం ఒక పండు మాత్రమే తింటారు. నవరాత్రులు అదే అనుసరిస్తారు. బొప్పాయి,  ఆపిల్ లేదంటే కొన్నిసార్లు కేవలం కొబ్బరి నీరు మాత్రమే తీసుకుంటారు. ఈ పద్ధతి శరీరంపై నియంత్రణ సాధించడంతో పాటూ మనసుని ఏకాగ్రతగా ఉంచుంతుంది. తినే ఆహారంలో రుచులు కోరుకున్నప్పుడు శరీరంపై నియంత్రణ కోల్పోయినట్టవుతుందంటారు.
 
నీటితో గడిపే రోజులున్నాయి

కొన్నిసార్లు...నవరాత్రి మొత్తం గోరువెచ్చని నీటిని మాత్రమే తీసుకుంటారు. అత్యంత బిజీగా ఉంటే మోదీ ఇవన్నీ పాటించడం ఎలా సాధ్యం అనుకోవచ్చు కానీ ఇది మోదీకి పరమ సంయమనం. ఇక్కడ శరీరం యొక్క శక్తి లోపలి శుభ్రతకు ఉపయోగపడుతుంది. మనసుని శుద్ధి చేస్తుంది.
 
సాధారణతలో దాగి ఉన్న ఆరోగ్య రహస్యం

ఉపవాసం కాకుండా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆహారం చాలా సాధారణమైనది. మునగ పరాటా, వేప ఆకులు, మిశ్రీ, కిచిడి , తేలికపాటి ఆహారం. ఇవన్నీ అతని దినచర్యలో భాగం. యోగా, ధ్యానం,నడకతో పాటు...ఆరోగ్యం  ఆధ్యాత్మికతను జీవితానికి ఆధారంగా భావిస్తారని మోదీ దినచర్య నిరూపిస్తుంది.

సంయమనమే అసలైన శక్తి

ఢిల్లీలో ఈమధ్యకాలంలో కలుషిత ఆహారం తిని వందలమంది అనారోగ్యం పాలయ్యారు.  ఇది ఉపవాసం చేసేటప్పుడు జాగ్రత్త  పరిశుభ్రత కూడా అంతే ముఖ్యమని గుర్తు చేసింది. మోదీ క్రమశిక్షణతో కూడిన  నియంత్రిత ఉపవాసం నవరాత్రి సందేశం కేవలం దేవి భక్తి మాత్రమే కాదు, స్వీయ నియంత్రణే మనపై మనం సాదించే విజయం అని మనకు నేర్పుతుంది.

నవరాత్రి ఉపవాసం రాజకీయాలకు అతీతమైన సందేశం

ప్రధాని మోదీ నవరాత్రి ఉపవాసం రాజకీయాలకు అతీతంగా ఒక సందేశాన్ని ఇస్తుంది, సంయమమే గొప్ప ఆయుధం. ప్రజలు ఉపవాసాన్ని నమ్మకంతో  చేస్తే.. ప్రధాని మోదీ దానిని స్వీయ-క్రమశిక్షణ తపస్సుగా మార్చుకుంటారు. అందుకే ఆయన ఉపవాసం ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉంది, ఎందుకంటే ఇది ఆకలిని త్యజించడం మాత్రమే కాదు, మనస్సు .. ఆత్మ యొక్క లోతైన సాధన కూడా.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించింది మాత్రమే. ABP దేశం ఎటువంటి నమ్మకం లేదా సమాచారాన్ని ధృవీకరించదని ఇక్కడ చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Virat Kohli Century: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Embed widget