అన్వేషించండి

Navratri 2025: దసరా నవరాత్రులు సందర్భంగా ఆంధ్ర & తెలంగాణలో దర్శించుకోవాల్సిన ముఖ్యమైన ఆలయాలు ఇవే!

Shardiya Navratri 2025: శరన్నవరాత్రి ఉత్సవాలు తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా జరుగుతున్నాయ్. తెలుగురాష్ట్రాల్లో ఉన్న భక్తులు.. ఈ పండుగ వేళల్లో దర్శించుకోవాల్సిన ఆలయాలు ఇవే..

 Navratri 2025: ఆంధ్రప్రదేశ్ లో శరన్నవరాత్రి..తెలంగాణలో బతుకమ్మ...రెండు రాష్ట్రాల్లోనూ శక్తిస్వరూపిణిని పూజిస్తారు. రెండు రాష్ట్రాల్లోనూ విజయదశమితో ఉత్సవాలు ముగుస్తాయి. అయితే బతుకమ్మ పండుగ ఆశ్వయుజమాసం ప్రారంభానికి ముందురోజు వచ్చే భాద్రపద అమావాస్య రోజు ప్రారంభమవుతుంది... దసరా వేడుకలు ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నుంచి మొదలవుతాయి. దుర్గాష్టమి రోజు వచ్చే సద్దులబతుకమ్మతో బతుకమ్మ వేడుకలు ముగుస్తాయి. ఆ మర్నాడు వచ్చే మహర్నవమితో శరన్నవరాత్రి పూర్తై... విజయదశమిని వైభవంగా నిర్వహిస్తారు.

తెలంగాణలో పూలపండుగ చేస్తే..ఆంధ్రప్రదేశ్ లో బొమ్మలకొలువులు, ప్రత్యేక పూజలు, హోమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ఏడాది శరన్నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ 22న ప్రారంభమయ్యాయి.. అక్టోబర్ విజయదశమితో ముగుస్తాయి. ఈ సందర్భంగా ప్రముఖ దేవాలయాలు, కార్యక్రమాల గురించి తెలుసుకుందాం.

కనక దుర్గా ఆలయం, విజయవాడ (ఇంద్రకీలాద్రి)

ఇక్కడ 9 రోజులు దుర్గమ్మను 9 అలంకారాల్లో కొలువుతీర్చుతారు. ప్రతి రోజు సాయంత్రం లక్ష్మీ పుష్పకల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. విజయదశమి రోజు అమ్మవారిని రాజరాజేశ్వరిగా అలంకరిస్తారు. మూల నక్షత్రంరోజు ఇసుకేస్తే రాలనంతమంది భక్తులు ఇంద్రకీలాద్రి చేరుకుంటారు. దసరా సమయంలో ఇంద్రకీలాద్రిపై భవానీ భక్తుల సందడి ఉంటుంది. తెలుగురాష్ట్రాలకు చెందిన శక్తి స్వరూపిణి భక్తులు తప్పనిసరిగా నవరాత్రి ఉత్సవాల్లో దుర్గమ్మను దర్శించుకోవాలనుకుంటారు. 
 
భాగ్యలక్ష్మి ఆలయం, చార్మినార్ , హైదరాబాద్

చార్మినార్ దగ్గరున్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలోనూ నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. ఈ అమ్మవారి పేరుమీదుగా భాగ్యనగరం అని  పిలుస్తారు. నిత్యం భక్తులతో కళకళలాడే పర్యాటక ప్రదేశం అయిన చార్మినార్ ను సందర్శించేవారంతా భాగ్యలక్ష్మి అణ్మవారిని దర్శించుకుంటారు. 

మహాశక్తి ఆలయం, కరీంనగర్

కరీంనగర్ లో ఉన్న మహాశక్తి ఆలయంల శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా జరుగుతాయి. రుద్రచండీ హోమాలు, దేవీపూజలు నిర్వహిస్తారు. పంచవ్యాప్తంగా ఎంతో ఫేమస్‌ అయిన ఈ ఆలయం దసరా టైమ్‌లో మరింత సందడిగా ఉంటుంది. నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజూ రాత్రి 9గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు దాండియా నిర్వహిస్తారు. భక్తుల ఆటపాటలు చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. కేవలం స్థానికులు మాత్రమే కాదు కరీంనగర్ జిల్లా చుట్టుపక్కలవారు కూడా ఇక్కడికి వస్తుంటారు. విజయవనాడ కనకదుర్గ లానే ఇక్కడ అమ్మవారి దీక్షతీసుకునే భక్తుల సంఖ్య పెరుగుతోంది

భద్రకాళీ ఆలయం, వరంగల్

దేవీ నవరాత్రులు, బతుకమ్మ సందర్భంగా వరంగల్ భద్రకాళీ దర్శనార్థం భక్తులు బారులు తీరుతారు. రోజుకో అలంకారంలో భద్రకాళి భక్తులను అనుగ్రహిస్తుంది. నిత్యం భక్తులతో కళకళలాడే భద్రకాళి ఆలయం..దసరా సందర్భంగా మరింత రద్దీగా ఉంటుంది

సీతారామచంద్ర స్వామి ఆలయం, భద్రాచలం
 
తెలుగు రాష్ట్రాల భక్తులు దర్శించుకోవాల్సిన ప్రముఖ ఆలయాల్లో భద్రాచలం ఒకటి. శ్రీరాముడు రావణుడిని జయించిన సందర్భంగా ఈ సమయంలో పలుచోట్ల రావణదహనం నిర్వహిస్తారు.శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కల్యాణోత్సవం, గోదావరి ఒడ్డున ఘటాల ప్రదర్శన, సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
 
బతుకమ్మ పండుగ

మహాలయ అమావాస్యతో ప్రారంభమయ్యే బతుకమ్మ పండుగ దుర్గాష్టమితో ముగుస్తుంది. ఈసందర్భంగా స్థానికంగా ఉండే అమ్మవారి ఆలయాలన్నింటిలోనూ భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఇక హుస్సేన్ సాగర్ సహా పలు ప్రాంతాల్లో బతుకమ్మల నిమజ్జనాల సందడిసాగుతుంది

బొమ్మల కొలువులు

సంక్రాంతి సందర్భంగా బొమ్మల కొలువు పెట్టే ఆచారం కొందరికి ఉంటే..దసరా సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తారు.  

ఇక రెండు రాష్ట్రాల్లోనూ పలు ప్రాంతాల్లో గర్బా-దాండియా నృత్యాల సందడే సందడి..

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ranganath meets Pawan Kalyan: ఏపీలోనూ హైడ్రా తరహా కార్యాచరణ - పవన్‌తో రంగనాథ్ భేటీ - రెండు గంటల పాటు చర్చ!
ఏపీలోనూ హైడ్రా తరహా కార్యాచరణ - పవన్‌తో రంగనాథ్ భేటీ - రెండు గంటల పాటు చర్చ !
58 candidates in Jubilee Hills: జూబ్లిహిల్స్ బరిలో 58 మంది అభ్యర్థులు -  నాలుగు లక్షల మంది ఓటర్లు - ఇక ప్రచార భేరీ !
జూబ్లిహిల్స్ బరిలో 58 మంది అభ్యర్థులు - నాలుగు లక్షల మంది ఓటర్లు - ఇక ప్రచార భేరీ !
Satara Doctor Crime News: ఆ SI నాపై అత్యాచారం చేశాడు.. చేతిపై సూసైడ్ నోట్ రాసుకుని చనిపోయిన డాక్టర్
ఆ SI నాపై అత్యాచారం చేశాడు.. చేతిపై సూసైడ్ నోట్ రాసుకుని చనిపోయిన డాక్టర్
Bihar Elections: బీహార్‌లో ఎన్డీఏ గెలిస్తే మళ్లీ నితీషే సీఎం -  ఎన్నికల ప్రచారంలో మోదీ హింటిచ్చేశారా?
బీహార్‌లో ఎన్డీఏ గెలిస్తే మళ్లీ నితీషే సీఎం - ఎన్నికల ప్రచారంలో మోదీ హింటిచ్చేశారా?
Advertisement

వీడియోలు

Driver Saved 6 Persons in Kurnool Bus Accident | కర్నూలు బస్సు ప్రమాదంలో ప్రాణాలు కాపాడిన రియల్ హీరో | ABP Desam
MLA Kolikapudi Srinivas Controversy | ఉద్యమ నేతలు రాజకీయాల్లో రాణించలేరా...కొలికపూడి కాంట్రవర్సీ ఏంటీ?
Akhanda 2 Thaandavam  Blasting Roar | అఖండ 2 సినిమా NBK నుంచి బ్లాస్టింగ్ రోర్ వదిలిన బోయపాటి | ABP Desam
Erragadda Public Talk Jubilee hills By poll : నవీన్ యాదవ్ vs మాగంటి సునీత జూబ్లీహిల్స్ ఎవరివైపు |ABP
Bison Movie review Telugu | మారిసెల్వరాజ్ - ధృవ్ విక్రమ్ బైసన్ తో అదరగొట్టారా.? | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ranganath meets Pawan Kalyan: ఏపీలోనూ హైడ్రా తరహా కార్యాచరణ - పవన్‌తో రంగనాథ్ భేటీ - రెండు గంటల పాటు చర్చ!
ఏపీలోనూ హైడ్రా తరహా కార్యాచరణ - పవన్‌తో రంగనాథ్ భేటీ - రెండు గంటల పాటు చర్చ !
58 candidates in Jubilee Hills: జూబ్లిహిల్స్ బరిలో 58 మంది అభ్యర్థులు -  నాలుగు లక్షల మంది ఓటర్లు - ఇక ప్రచార భేరీ !
జూబ్లిహిల్స్ బరిలో 58 మంది అభ్యర్థులు - నాలుగు లక్షల మంది ఓటర్లు - ఇక ప్రచార భేరీ !
Satara Doctor Crime News: ఆ SI నాపై అత్యాచారం చేశాడు.. చేతిపై సూసైడ్ నోట్ రాసుకుని చనిపోయిన డాక్టర్
ఆ SI నాపై అత్యాచారం చేశాడు.. చేతిపై సూసైడ్ నోట్ రాసుకుని చనిపోయిన డాక్టర్
Bihar Elections: బీహార్‌లో ఎన్డీఏ గెలిస్తే మళ్లీ నితీషే సీఎం -  ఎన్నికల ప్రచారంలో మోదీ హింటిచ్చేశారా?
బీహార్‌లో ఎన్డీఏ గెలిస్తే మళ్లీ నితీషే సీఎం - ఎన్నికల ప్రచారంలో మోదీ హింటిచ్చేశారా?
Bihar Sigma Gang: పాతికేళ్లు కూడా నిండని కుర్రాళ్ల మాఫియా గ్యాంగ్ సిగ్మా - బీహార్‌ను వణికించింది..కానీ ఎన్‌కౌంటర్‌తో ముగిసింది !
పాతికేళ్లు కూడా నిండని కుర్రాళ్ల మాఫియా గ్యాంగ్ సిగ్మా - బీహార్‌ను వణికించింది..కానీ ఎన్‌కౌంటర్‌తో ముగిసింది !
Akhanda 2 Teaser: ఊహకు అందదు... బాలయ్య డైలాగుకు రీ సౌండ్ గ్యారెంటీ - 'అఖండ 2' లేటెస్ట్ టీజర్ చూశారా?
ఊహకు అందదు... బాలయ్య డైలాగుకు రీ సౌండ్ గ్యారెంటీ - 'అఖండ 2' లేటెస్ట్ టీజర్ చూశారా?
Bharat taxi: ఓలా, ఉబెర్ తరహాలో ప్రభుత్వ భారత్ టాక్సి యాప్ - డైవర్లకే 100శాతం ఆదాయం - ఇవిగో పూర్తి డీటైల్స్
ఓలా, ఉబెర్ తరహాలో ప్రభుత్వ భారత్ టాక్సి యాప్ - డైవర్లకే 100శాతం ఆదాయం - ఇవిగో పూర్తి డీటైల్స్
New Bank Rule:బ్యాంకు అకౌంట్‌కు నలుగురు నామినీలని ఎలా సెట్ చేయాలి? సులభమైన స్టెప్స్‌లో ప్రక్రియ పూర్తి చేయండి!
బ్యాంకు అకౌంట్‌కు నలుగురు నామినీలని ఎలా సెట్ చేయాలి? సులభమైన స్టెప్స్‌లో ప్రక్రియ పూర్తి చేయండి!
Embed widget