అన్వేషించండి

concept of 4 yugas: ప్రతియుగానికి 4 లక్షల సంవత్సరాలు ఎందుకు తగ్గుతూ వచ్చింది, ఇంకా కలియుగం ఎన్నాళ్లుంది

వేదాలను అనుసరించి యుగాలు మొత్తం నాలుగు. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. నాలుగు యుగాల గురించి తెలుసుకుంటూ ఇంకా కలియుగం ఎన్నాళ్లుందో చూద్దాం...

మొదటి యుగం అయిన సత్యయుగంలో ధర్మం నాలుగుపాదాలపై నడిస్తే..రెండో యుగమైన త్రేతాయుగంలో ధర్మం మూడు పాదాలపై....మూడో యుగం ద్వాపరయుగంలో రెండు పాదాలపై నడిచింది. ప్రస్తుతం నడుస్తోన్న కలియుగంలో ధర్మం, మంచి అనే మాటలకు చోటే లేదు. 

సత్యయుగం
నాలుగు యుగాల్లో మొదటిది సత్యయుగం . దీన్నే కృతయుగం అని కూడా అంటారు.  ఈ యుగంలో భగవంతుడు నారాయణుడు, లక్ష్మీ సహితంగా భూమిని పరిపాలించాడు. దీని కాల పరిమాణం 17 లక్షల 28 వేల సంవత్సరాలు. ఈ యుగంలో ధర్మం నాలుగుపాదాల మీద నడిచిందని శివపురాణం చెబుతోంది.ప్రజలు ఎలాంటి బాధలు లేకుండా సుఖసంతోషాలతో ఉన్నారు. అకాల మరణాలు అస్సలు లేవు. కృత యుగానిరి రాజు సూర్యుడు, మంత్రి గురువు. గురువు బంగారానికి అధిపతి కానడంతో అంతా బంగారుమయం. ప్రభువు-ప్రజల మధ్య ఎలాంటి విభేదం, విరోధం లేకుండా కాలం చక్కగా నడిచింది. సూర్య ప్రభావంతో సుక్షత్రియులు, గురు ప్రభావంతో సద్బ్రాహ్మణులు జన్మించి ధర్మమైన పాలన నడిచింది. సత్యయుగం వైవశ్వత మన్వంతరంలో కార్తీక శుద్ధ నవమి రోజు ప్రారంభమైంది.

Also Read: భర్తలకు గుడ్ న్యూస్ - అక్షయ తృతీయ రోజు బంగారం కొనాల్సిన అవసరం లేదు - ఎందుకంటే!

త్రేతాయుగం
 భగవంతుడు శ్రీ రామచంద్రుడుగా అవతరించి రావణాసురుణ్ణి సంహరించి ధర్మ సంస్థాపన చేసాడు. ఈ యుగం పరిమితి 12 లక్షల96 వేల సంవత్సరాలు.  ఈ యుగంలో ధర్మం మూడు పాదాలపై నడిచింది. త్రేతాయుగంలో రాజుగా కుజుడు, మంత్రిగా శుక్రుడు ఉన్నారు. కుజుడు యువకుడు, యుద్ధప్రియుడు, సుక్షిత్రుయుడు, బాహుబల పరాక్రమవంతుడు, రాజుగా ఆచారాలకు కట్టుబడి ఉండకుండా తిరిగేవాడు. రాక్షస గురువైన శుక్రాచార్యుడు స్త్రీ కారకుడు మాయ మంత్ర తంత్రవాది, కుజుడుకి పరమ శత్రువు. రాజుమాటకి మంత్రి మాటకి పడకపోవడం వల్ల మంత్రులు క్రూర స్వభావులై రాజ్యపాలనను బ్రష్టు పట్టించారు. స్త్రీ వ్యామోహంతో కలహాలు పెంచి దైవకార్యాలు నిర్వహించే వంశాలను అంతరించేలా చేశారు. ఇలా రాక్షసులు, దుర్మార్గుల వలన త్రేతాయుగంలో ధర్మం ఒకభాగం దెబ్బతిని మూడుపాదాలపై నడిచిందంది.  ఈ యుగము వైశాఖ శుద్ధ తదియ రోజు ప్రారంభమైంది.

ద్వాపర యుగం
శ్రీ మహావిష్ణువు శ్రీ కృష్ణుడుగా అవతరించాడు. దీని కాల పరిమాణం 8 లక్షల 64 వేల సంవత్సరాలు.  ద్వాపర యుగంలో రాజుగా చంద్రుడు, మంత్రిగా బుధుడు ఉన్నారు.  చంద్రుడిది గురు వర్గం..బుధుడిది శనివర్గం. అందుకే వీరిద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు.  బుధుడు చెడు విద్యలను రాక్షసులకు , దుర్మార్గులకు ఇచ్చి సాధువులు, సజ్జనులు, స్త్రీలకు అపకారం చేయమని పురికొల్పుతాడు. దేవతా కార్యాలను సగానికి సగం నశింపచేసి... రాజులకు బ్రాహ్మణులకు భావ విభేదం కల్పిస్తాడు. చంద్రుడు సకలవిద్యా పారంగతుడు. రాజులను విద్యా పారంగతులను చేసి..ధనుర్విద్యలు నేర్పించి... దుష్టులను-మాయావులను నాశనం చేయడానికి సహకరిస్తాడు. ఈ విధంగా ద్వాపర యుగంలో ధర్మం రెండు భాగాలు నశించి కలియుగం ప్రారంభమవుతుంది. 

Also Read: గుండు చేయించుకుంటున్నారా, ఇంతకీ దేవుడికి తలనీలాలు ఎందుకిస్తారో తెలుసా!

కలియుగం
కలియుగం కాలపరిమితి 4 లక్షల 32 వేల సంవత్సరాలు. అందులో సుమారు ఐదు వేల సంవత్సరాలు గడిచిపోయాయి. హిందూ , బౌద్ధ కాలమానాలకు ఆధార గ్రంధమైన సూర్య సిద్ధాంతం ప్రకారం పూర్వ శఖము 3102 ఫిబ్రవరి 18 అర్ధరాత్రి కలియుగం ప్రారంభమైంది. కృష్ణుడు సరిగ్గా అదే సమయానికి అవతారమును చాలించాడని భావిస్తారు. కలియుగానికి రాజు శని...మంత్రులు రాహు-కేతువులు. మంత్రులిద్దరికీ ఒకరకంటే ఒకరికి పడదు. రాహువు శనికి మిత్రుడు. కలియుగం ఆరంభంలో నాలుగు ధర్మ శాస్త్రాలు...వాటిని రక్షించే బ్రాహ్మణులను, అగ్రహారాలను , రాజులను నశింపచేస్తూ వచ్చారు. అప్పటి నుంచి క్రూరత్వం, అసత్యం, అప్రమాణం, అధర్మం, అన్యాయం తలెత్తాయి. ఈ యుగంలో వావి-వరుసలు తప్పి, వర్ణ సంకరములు మొదలై దొరలే దొంగలయ్యారు. దైవభక్తి తగ్గి హింసా సిద్ధాంతాలు పెరుగుతాయి. పాపం వల్ల దుంఖం అనుభవిస్తాం అనే భయంపోయి... స్త్రీని, ధనాన్ని పొందినవాడే గొప్పవాడని అనుకునే రోజులొస్తాయి. అధర్మం పెరుగుతుంది, వర్ణద్వేషాలు, మత విద్వేషాలు పెరుగుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే కలియుగంలో మంచి అనే మాటకి చోటు లేకుండా అధర్మానికే మొగ్గు చూపుతారు. కలియుగాంతంలో కల్కి రూపంలో భగవంతుడు అవతరించి తిరిగి సత్య యుగ స్థాపనకు మార్గం సుగమం చేస్తాడని శివపురాణం చెబుతోంది.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Saturn Retrograde 2026: శని 138 రోజుల పాటు వక్రసంచారం! ఈ 3 రాశులవారికి పట్టిందల్లా బంగారం!
శని 138 రోజుల పాటు వక్రసంచారం! ఈ 3 రాశులవారికి పట్టిందల్లా బంగారం!
2026లో వట సావిత్రి వ్రతం ఎప్పుడు? తేదీ, శుభ సమయం , పూజా విధానం తెలుసుకోండి!
2026లో వట సావిత్రి వ్రతం ఎప్పుడు? తేదీ, శుభ సమయం , పూజా విధానం తెలుసుకోండి!
Sita Navami 2026: కవిత పార్టీ ఆవిర్భావం రోజైన సీతానవమి సందర్భంగా చదవాల్సిన పాప విముక్తి గాథ!
కవిత పార్టీ ఆవిర్భావం రోజైన సీతానవమి సందర్భంగా చదవాల్సిన పాప విముక్తి గాథ!
2026 ఏప్రిల్ 25 రాశిఫలాలు: మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ఫలితాలు!rasi phalalu today in telugu 24 April 2026 horoscope predictions for all zodiac signs
2026 ఏప్రిల్ 25 రాశిఫలాలు: మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ఫలితాలు!

వీడియోలు

MI Batting Line Up vs CSK IPL 2026 | ముంబై బ్యాటర్ల ఘోర వైఫల్యం
IPL 2026 MI vs CSK Akeal Hosein | వాంఖడేలో అకీల్ హోసెన్ స్పిన్ సునామీ
MI vs CSK Highlights IPL 2026 | ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ విక్టరీ
Sanju Samson Century vs MI IPL 2026 | ఒక సెంచరీతో రికార్డ్ బద్దలు కొట్టిన సంజూ
RR vs LSG IPL 2026 Highlights | లక్నోకు వరుసగా 4వ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 SRH 4th Consecutive Win: స‌న్ రైజర్స్ సూప‌ర్బ్ ఛేజింగ్.. స‌మ‌ష్టి బ్యాటింగ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో వ‌రుస‌గా 4వ విజ‌యం.. రాణించిన అభిషేక్, ఇషాన్, రాయ‌ల్స్ కు షాక్
స‌న్ రైజర్స్ సూప‌ర్బ్ ఛేజింగ్.. స‌మ‌ష్టి బ్యాటింగ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో వ‌రుస‌గా 4వ విజ‌యం.. రాణించిన అభిషేక్, ఇషాన్, రాయ‌ల్స్ కు షాక్
కడప రామకీర్తన హత్య కేసు.. నిందితుడు వెంకటేష్‌ను రిమాండ్‌కు తరలించిన పోలీసులు
కడప రామకీర్తన హత్య కేసు.. నిందితుడు వెంకటేష్‌ను రిమాండ్‌కు తరలించిన పోలీసులు
AB Venkateswara Rao: అక్రమ కేసులు పెట్టిన వారిపై రూ.కోటి ఒక్క రూపాయికి పరువునష్టం దావా - రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు సంచలన నిర్ణయం
అక్రమ కేసులు పెట్టిన వారిపై రూ.కోటి ఒక్క రూపాయికి పరువునష్టం దావా - రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు సంచలన నిర్ణయం
Viral Video: అన్నా అని పిలిచినందుకు సెలూన్ సిబ్బందిపై దాడి.. కరీంనగర్ త్రీ టౌన్ ఎస్ఐ సస్పెన్షన్!
అన్నా అని పిలిచినందుకు సెలూన్ సిబ్బందిపై దాడి.. కరీంనగర్ త్రీ టౌన్ ఎస్ఐ సస్పెన్షన్!
Gods and Soldiers Movie: బిగ్ బాస్ నుంచి సినిమాల్లోకి... పోలీస్‌గా ఆరి అర్జునన్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ
బిగ్ బాస్ నుంచి సినిమాల్లోకి... పోలీస్‌గా ఆరి అర్జునన్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ
YSRCP MLCs resign: అనర్హతా వేటు వేయాల్సింది..కానీ రాజీనామా చేసినా తిరస్కరణ- ఏపీ ఎమ్మెల్సీలకు విచిత్ర పరిస్థితి!
అనర్హతా వేటు వేయాల్సింది..కానీ రాజీనామా చేసినా తిరస్కరణ- ఏపీ ఎమ్మెల్సీలకు విచిత్ర పరిస్థితి!
Oosaravelli Special Shows: ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్... ఊసరవెల్లి స్పెషల్ షోస్
ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్... ఊసరవెల్లి స్పెషల్ షోస్
Bengaluru: పరీక్ష రాయాలంటే జంధ్యం తీసేయాల్సిందే - ఇన్విజిలేటర్ల నిర్వాకం - వివాదం కాకుండా ఉంటుందా?
పరీక్ష రాయాలంటే జంధ్యం తీసేయాల్సిందే - ఇన్విజిలేటర్ల నిర్వాకం - వివాదం కాకుండా ఉంటుందా?
Embed widget