అన్వేషించండి

Students Protest WalK: చెప్పులు లేకుండా 18 కిలోమీటర్లు నడిచి, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన గురుకుల విద్యార్థులు

Gurukul Students 18 KM Walk | బీచుపల్లి ప్రభుత్వ గురుకుల పాఠశాల విద్యార్థులు 18 కిలోమీటర్లు పాదయాత్ర చేసి కలెక్టర్‌ను కలిసి తమ ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

Beechupally Gurukul Students | గద్వాల: తెలంగాణలో గత కొన్ని నెలలుగా ఏదోచోట ప్రభుత్వ హాస్టల్స్‌లో ఫుడ్ పాయిజన్ అని వింటూనే ఉన్నాం. కొన్ని స్కూళ్లలో విద్యార్థినులకు వేధింపులు అని, వారికి సరైన సౌకర్యాలు కల్పించడం లేదనో, సీలింగ్ సరిగ్గా లేక వానకు ఇబ్బంది పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జోగులాంబ గద్వాల జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. వారి సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లేందుకు విద్యార్థులు ఒకటి, రెండు కాదు ఏకంగా 18 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చెప్పులు కూడా లేకుండా నడుచుకుంటూ వెళ్లారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కలెక్టర్ సంతోష్‌ను కలిసిన విద్యార్థులు బీచుపల్లిలోని ప్రభుత్వ బాలుర గురుకుల ప్రిన్సిపల్‌ శ్రీనివాస్‌, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రిన్సిపాల్ పై కలెక్టర్‌కు విద్యార్థుల ఫిర్యాదు

బీచుపల్లి గురుకుల పాఠశాలలో విద్యాబోధన సక్రమంగా లేదని, స్టడీ మెటీరియల్‌ కూడా పంపిణీ చేయలేదని ఆరోపించారు. హాస్టల్‌లో మరుగుదొడ్లు సరిపడా లేకపోవడంతో చెట్లు, గుట్టల్లోకి చెంబు తీసుకుని వెళ్లాల్సి వస్తుందన్నారు. ఆ సమయంలో ఏమైనా జరిగితే, పాములు కాటేస్తే ఎవరు బాధ్యత తీసుకుంటారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. తమకు మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని, క్రమశిక్షణ అంటూ ప్రిన్సిపాల్ తమను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తమ సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకురావాలని 18 కిలోమీటర్ల మేర పాదయాత్రగా కలెక్టరేట్‌కు వచ్చామని తెలిపారు. 6వ తరగతిలో మిగిలిన సీట్లను సైతం ప్రిన్సిపాల్ అమ్ముకున్నారని, అందుకు సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని వివరించారు. 

కాళ్లకు చెప్పులు లేకుండా విద్యార్థుల నిరసన ర్యాలీ

మధ్యలో ఇటిక్యాల పోలీసులు, రెవెన్యూ సిబ్బంది గురుకుల పాఠశాల విద్యార్థులను వారించే ప్రయత్నం చేసినా వారు వెనక్కి తగ్గలేదు. వారి సమస్యలు తెలుసుకునేందుకు ప్రయత్నించినా విద్యార్థులు ర్యాలీ ఆపలేదు. సుమారు 200 మంది వరకు విద్యార్థులు, అందులోనూ చాలా మంది కాళ్లకు చెప్పులు లేకుండా ర్యాలీగా వెళ్తుండటంతో పోలీసులు సైతం వెంట బందోబస్తుగా వెళ్లాల్సి వచ్చింది. వీరాపురం స్టేజీ వద్ద గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి విద్యార్థులను కలిశారు. వారి సమస్యలు తెలుసుకున్న వెంటనే గద్వాల్ కలెక్టర్‌కు ఫోన్‌ చేసి మాట్లాడారు. విద్యార్థుల నిరసన ర్యాలీ గురించి సమాచారం అందించారు. అయితే 18 కి.మీ మేర విద్యార్థులు పాదయాత్ర చేస్తున్నాకలెక్టర్ వారిని నిలువరించే ప్రయత్నం చేయకపోవడం ఆశ్చర్యకరంగా ఉందంటున్నారు తల్లిదండ్రులు. గురుకుల పాఠశాలకు వస్తానని కలెక్టర్ హామీ ఇవ్వకపోవడం దారుణమని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

ప్రిన్సిపాల్ మాత్రం తాను ఎవర్నీ ఇబ్బంది పెట్టలేదని చెబుతున్నారు. కలెక్టర్‌కు విద్యార్థుల ఫిర్యాదుపై స్పందించిన శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. టీచర్ల అనుమతి లేకుండా విద్యార్థులు బయటకు వెళ్తున్నారు. చెడు అలవాట్ల బారిన పడకుండా ఉండకుండా విద్యార్థులను హెచ్చరించాను. ఈ క్రమంలో ఓ విద్యార్థికి టీసీ ఇచ్చి పంపించినట్లు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్ కోసం కఠినంగా వ్యవహరిస్తున్నాం కానీ, వారిని ఇబ్బంది పెట్టలేదన్నారు.

Also Read: Telangana CM Revanth Comments On Manipur: మణిపూర్‌ ఖనిజ సంపదపై కార్పొరేట్‌ కన్ను- ఆధునిక ఆయుధాలతో మారణకాండ- సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
Allu Cinemas: 'అల్లు సినిమాస్'లో అపశృతి... ప్రేక్షకులకు సినిమా మధ్యలో షాక్
'అల్లు సినిమాస్'లో అపశృతి... ప్రేక్షకులకు సినిమా మధ్యలో షాక్
TDP MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
Farmhouse Drug Party: రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్, పార్టీకి హాజరైన టీడీపీ ఎంపీ.. పోలీసులపై కాల్పులతో కలకలం!
రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్, పార్టీకి హాజరైన టీడీపీ ఎంపీ.. పోలీసులపై కాల్పులతో కలకలం!

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Embed widget