అన్వేషించండి

Students Protest WalK: చెప్పులు లేకుండా 18 కిలోమీటర్లు నడిచి, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన గురుకుల విద్యార్థులు

Gurukul Students 18 KM Walk | బీచుపల్లి ప్రభుత్వ గురుకుల పాఠశాల విద్యార్థులు 18 కిలోమీటర్లు పాదయాత్ర చేసి కలెక్టర్‌ను కలిసి తమ ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

Beechupally Gurukul Students | గద్వాల: తెలంగాణలో గత కొన్ని నెలలుగా ఏదోచోట ప్రభుత్వ హాస్టల్స్‌లో ఫుడ్ పాయిజన్ అని వింటూనే ఉన్నాం. కొన్ని స్కూళ్లలో విద్యార్థినులకు వేధింపులు అని, వారికి సరైన సౌకర్యాలు కల్పించడం లేదనో, సీలింగ్ సరిగ్గా లేక వానకు ఇబ్బంది పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జోగులాంబ గద్వాల జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. వారి సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లేందుకు విద్యార్థులు ఒకటి, రెండు కాదు ఏకంగా 18 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చెప్పులు కూడా లేకుండా నడుచుకుంటూ వెళ్లారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కలెక్టర్ సంతోష్‌ను కలిసిన విద్యార్థులు బీచుపల్లిలోని ప్రభుత్వ బాలుర గురుకుల ప్రిన్సిపల్‌ శ్రీనివాస్‌, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రిన్సిపాల్ పై కలెక్టర్‌కు విద్యార్థుల ఫిర్యాదు

బీచుపల్లి గురుకుల పాఠశాలలో విద్యాబోధన సక్రమంగా లేదని, స్టడీ మెటీరియల్‌ కూడా పంపిణీ చేయలేదని ఆరోపించారు. హాస్టల్‌లో మరుగుదొడ్లు సరిపడా లేకపోవడంతో చెట్లు, గుట్టల్లోకి చెంబు తీసుకుని వెళ్లాల్సి వస్తుందన్నారు. ఆ సమయంలో ఏమైనా జరిగితే, పాములు కాటేస్తే ఎవరు బాధ్యత తీసుకుంటారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. తమకు మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని, క్రమశిక్షణ అంటూ ప్రిన్సిపాల్ తమను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తమ సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకురావాలని 18 కిలోమీటర్ల మేర పాదయాత్రగా కలెక్టరేట్‌కు వచ్చామని తెలిపారు. 6వ తరగతిలో మిగిలిన సీట్లను సైతం ప్రిన్సిపాల్ అమ్ముకున్నారని, అందుకు సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని వివరించారు. 

కాళ్లకు చెప్పులు లేకుండా విద్యార్థుల నిరసన ర్యాలీ

మధ్యలో ఇటిక్యాల పోలీసులు, రెవెన్యూ సిబ్బంది గురుకుల పాఠశాల విద్యార్థులను వారించే ప్రయత్నం చేసినా వారు వెనక్కి తగ్గలేదు. వారి సమస్యలు తెలుసుకునేందుకు ప్రయత్నించినా విద్యార్థులు ర్యాలీ ఆపలేదు. సుమారు 200 మంది వరకు విద్యార్థులు, అందులోనూ చాలా మంది కాళ్లకు చెప్పులు లేకుండా ర్యాలీగా వెళ్తుండటంతో పోలీసులు సైతం వెంట బందోబస్తుగా వెళ్లాల్సి వచ్చింది. వీరాపురం స్టేజీ వద్ద గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి విద్యార్థులను కలిశారు. వారి సమస్యలు తెలుసుకున్న వెంటనే గద్వాల్ కలెక్టర్‌కు ఫోన్‌ చేసి మాట్లాడారు. విద్యార్థుల నిరసన ర్యాలీ గురించి సమాచారం అందించారు. అయితే 18 కి.మీ మేర విద్యార్థులు పాదయాత్ర చేస్తున్నాకలెక్టర్ వారిని నిలువరించే ప్రయత్నం చేయకపోవడం ఆశ్చర్యకరంగా ఉందంటున్నారు తల్లిదండ్రులు. గురుకుల పాఠశాలకు వస్తానని కలెక్టర్ హామీ ఇవ్వకపోవడం దారుణమని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

ప్రిన్సిపాల్ మాత్రం తాను ఎవర్నీ ఇబ్బంది పెట్టలేదని చెబుతున్నారు. కలెక్టర్‌కు విద్యార్థుల ఫిర్యాదుపై స్పందించిన శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. టీచర్ల అనుమతి లేకుండా విద్యార్థులు బయటకు వెళ్తున్నారు. చెడు అలవాట్ల బారిన పడకుండా ఉండకుండా విద్యార్థులను హెచ్చరించాను. ఈ క్రమంలో ఓ విద్యార్థికి టీసీ ఇచ్చి పంపించినట్లు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్ కోసం కఠినంగా వ్యవహరిస్తున్నాం కానీ, వారిని ఇబ్బంది పెట్టలేదన్నారు.

Also Read: Telangana CM Revanth Comments On Manipur: మణిపూర్‌ ఖనిజ సంపదపై కార్పొరేట్‌ కన్ను- ఆధునిక ఆయుధాలతో మారణకాండ- సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: చంద్రబాబు వరుసగా మూడు సార్లు సీఎం కావాలి - ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలి - పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
చంద్రబాబు వరుసగా మూడు సార్లు సీఎం కావాలి - ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలి - పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
CM Revanth Reddy: ప్రజలకు మాపై ఎందుకు కోపం ? - కొలువుల పండగలో సీఎం రేవంత్ ప్రశ్న
ప్రజలకు మాపై ఎందుకు కోపం ? - కొలువుల పండగలో సీఎం రేవంత్ ప్రశ్న
YSRCP MLAs:  అనర్హతా వేటు తప్పించుకోవడానికా? జీతం కోసమా ? - సీక్రెట్‌గా హాజరు పట్టీలో సంతకాలు పెట్టిన వైసీపీ ఎమ్మెల్యేలు
అనర్హతా వేటు తప్పించుకోవడానికా? జీతం కోసమా ? - సీక్రెట్‌గా హాజరు పట్టీలో సంతకాలు పెట్టిన వైసీపీ ఎమ్మెల్యేలు
KTR Padayatra: వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా - బీఆర్ఎస్‌ను అధికారంలోకి తెస్తా - కేటీఆర్ సంకల్పం
వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా - బీఆర్ఎస్‌ను అధికారంలోకి తెస్తా - కేటీఆర్ సంకల్పం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sunita Williams Return to Earth | సునీత సాహసంపై Cousin Dinesh Rawal మాటల్లో | ABP DesamSSMB29 Location | ఒడిశా అడవుల్లో జక్కన్న | ABP DesamBRS MLAs Supreme Court Affidavit | వేటు పడకుండా..10మంది BRS ఎమ్మెల్యేల రహస్య వ్యూహం..! | ABPNara Lokesh Holds Jr NTR Flexi | లోకేశ్ చర్యల వెనుక రీజన్ ఇదేనా.! | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: చంద్రబాబు వరుసగా మూడు సార్లు సీఎం కావాలి - ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలి - పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
చంద్రబాబు వరుసగా మూడు సార్లు సీఎం కావాలి - ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలి - పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
CM Revanth Reddy: ప్రజలకు మాపై ఎందుకు కోపం ? - కొలువుల పండగలో సీఎం రేవంత్ ప్రశ్న
ప్రజలకు మాపై ఎందుకు కోపం ? - కొలువుల పండగలో సీఎం రేవంత్ ప్రశ్న
YSRCP MLAs:  అనర్హతా వేటు తప్పించుకోవడానికా? జీతం కోసమా ? - సీక్రెట్‌గా హాజరు పట్టీలో సంతకాలు పెట్టిన వైసీపీ ఎమ్మెల్యేలు
అనర్హతా వేటు తప్పించుకోవడానికా? జీతం కోసమా ? - సీక్రెట్‌గా హాజరు పట్టీలో సంతకాలు పెట్టిన వైసీపీ ఎమ్మెల్యేలు
KTR Padayatra: వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా - బీఆర్ఎస్‌ను అధికారంలోకి తెస్తా - కేటీఆర్ సంకల్పం
వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా - బీఆర్ఎస్‌ను అధికారంలోకి తెస్తా - కేటీఆర్ సంకల్పం
Andhra Pradesh Latest News: ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగులకు గుడ్ న్యూస్- శుక్రవారం ఖాతాల్లో బకాయిల డబ్బులు 
ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగులకు గుడ్ న్యూస్- శుక్రవారం ఖాతాల్లో బకాయిల డబ్బులు 
Betting Apps Promotion Case: విష్ణుప్రియను బుక్ చేసిన రీతూ చౌదరి- 25న మళ్లీ విచారణకు పిలిచిన పోలీసులు  
విష్ణుప్రియను బుక్ చేసిన రీతూ చౌదరి- 25న మళ్లీ విచారణకు పిలిచిన పోలీసులు  
AP MLAs Cultural programs: ఏపీ ప్రజాప్రతినిధుల కళాపోషణ అదుర్స్ - సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ చూపిన ఎమ్మెల్యేలు - వీడియోలు
ఏపీ ప్రజాప్రతినిధుల కళాపోషణ అదుర్స్ - సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ చూపిన ఎమ్మెల్యేలు - వీడియోలు
Prakash Raj: బెట్టింగ్ యాప్స్ కేసుపై ప్రకాష్ రాజ్ వినూత్న స్పందన - పోలీసులకే కాదు ప్రజలకూ చెప్పాలంటూ ...
బెట్టింగ్ యాప్స్ కేసుపై ప్రకాష్ రాజ్ వినూత్న స్పందన - పోలీసులకే కాదు ప్రజలకూ చెప్పాలంటూ ...
Embed widget