అన్వేషించండి

YS Jagan Mohan Reddy New Strategy: జగన్ తాడేపల్లి వైరాగ్యానికి తెర! రెండేళ్ల ఓటమి తర్వాత రూట్ మార్చిన వైఎస్సార్‌సీపీ అధినేత.. వైజాగ్ పర్యటన వెనుక అసలు వ్యూహం ఇదే!

YSRCP: ఓడిపోయి రెండేళ్లయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ వ్యూహాన్ని మార్చబోతున్నారు. కేసులు, అంతర్గత విబేధాల మధ్య విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితుల పరామర్శతో జనంలోకి జగన్ వెళ్తున్నారు.

Chandrababu Naidu 2 Years Rule Protests:   ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  అత్యంత ఘోర పరాజయాన్ని చవిచూసి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని కోల్పోయి అప్పుడే రెండేళ్లు  పూర్తయింది. కేవలం 11 సీట్లకే పరిమితం కావడంతో సాంకేతికంగా ఆయనకు  ప్రధాన ప్రతిపక్ష హోదా  దక్కలేదు. అయినప్పటికీ రాష్ట్రంలో ఉన్న ఏకైక బలమైన విపక్ష నేత ఆయనే. అయితే, ఈ రెండేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి అనుసరించిన పంథా రాజకీయ వర్గాలను సైతం తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడం, ప్రజల్లోకి వెళ్లకుండా తాడేపల్లి ప్యాలెస్‌కే పరిమితం కావడం వల్ల.. ఆయన ఒక ప్రతిపక్ష నేతగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించలేకపోతున్నారనే బలమైన అభిప్రాయం సొంత క్యాడర్‌తో పాటు సామాన్య ప్రజల్లోనూ వ్యక్తమైంది.

వైసీపీ చుట్టూ కేసుల వల 

అదే సమయంలో క్షేత్రస్థాయిలో వైఎస్సార్‌సీపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇసుక, లిక్కర్ వంటి  స్కామ్‌ల దర్యాప్తు ముమ్మరం కావడం, వైఎస్సార్‌సీపీ మాజీ మంత్రులు, కీలక నేతలను వరుస కేసులు వెంటాడుతుండటం పార్టీని తీవ్ర రక్షణ చట్రంలోకి నెట్టేసింది. అధినేత జగన్మోహన్ రెడ్డి కోటరీలోనే అంతర్గత విబేధాలు భగ్గుమనడం, మరోవైపు కుటుంబ పరంగా తల్లి, చెల్లితో నడుస్తున్న ఆస్తి తగాదాలు పొలిటికల్‌గా ఆయన నైతిక బలాన్ని దెబ్బతీశాయి. ఈ పరిణామాలన్నింటి వల్లే జగన్మోహన్ రెడ్డి గత రెండేళ్లుగా ఒకరకమైన రాజకీయ వైరాగ్యంలో ఉండిపోయారని, అందుకే ప్రజాపోరాటాలను ‘లైట్’ తీసుకున్నారనే అభిప్రాయం వినిపిస్తోంది.

ఇప్పుడు జగన్ తన పంథాను మార్చుకోక తప్పని పరిస్థితి

రాజకీయాల్లో ఎల్లకాలం ఒకే వ్యూహం వర్కవుట్ కాదు. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం మాత్రమే ఉండటంతో.. జగన్ ఇప్పుడు తన పంథాను మార్చక తప్పని పరిస్థితి ఏర్పడింది. కేవలం ఎన్నికల ముందు  పాదయాత్ర చేస్తే సరిపోతుందనే పాత ఫార్ములాను నమ్ముకుని, ఈ ఏడాది కూడా ఇలాగే మౌనంగా ఉంటే పార్టీకి ఇబ్బందికర పరిస్థితి ఎదురయ్యే  ప్రమాదం ఉందని ఆయన లీగల్, పొలిటికల్ టీమ్స్ హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే, ఈ రెండేళ్ల స్తబ్దతకు తెరదించుతూ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడిప్పుడే రోడ్డుపైకి వచ్చేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.

బాధితుల పరామర్శ కోసం విశాఖకు రాక 

 విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాద బాధితులను పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి బుధవారం   వైజాగ్ పర్యటనకు వెళ్తుండటం ఈ వ్యూహాత్మక మార్పునకు సంకేతంగా కనిపిస్తోంది. అలాగే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా..  టూ ఇయర్స్ ఆఫ్ బెట్రాయల్  పేరుతో వైఎస్సార్‌సీపీ రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. బుక్‌లెట్లు, క్యూఆర్ కోడ్‌ల ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం చేస్తోంది.  జగన్మోహన్ రెడ్డి కేవలం ఇలాంటి అప్పుడప్పుడు చేసే పర్యటనలకే పరిమితం కాకుండా, నిరంతరం ప్రజల్లో ఉండేలా పక్కా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. కేసుల భయంతో వెనకడుగు వేస్తున్న నేతల్లో ధైర్యం నింపాలన్నా, క్షేత్రస్థాయిలో చెల్లాచెదురైన క్యాడర్‌ను ఏకం చేయాలన్నా అధినేత నిరంతరం రోడ్లపైనే ఉండాలి. మరి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తన తాడేపల్లి గడప దాటి పూర్తిస్థాయి ప్రజాపోరాటాల్లోకి దిగుతారా? లేక పార్ట్ టైమ్ రాజకీయాలనే నమ్ముకుంటారా? అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Harish Rao On CM Revanth Reddy: రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
HYDRAA Inaction On Owaisi Encroachments: ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
Allu Arjun Political Party Rumors: ఐకాన్ స్టార్ టు పొలిటికల్ స్టార్? అల్లు అర్జున్ నయా పార్టీ ప్రచారం వెనుక అసలు నిజమెంత?
ఐకాన్ స్టార్ టు పొలిటికల్ స్టార్? అల్లు అర్జున్ నయా పార్టీ ప్రచారం వెనుక అసలు నిజమెంత?
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viral News: 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
మెయిన్ రోడ్డుపై 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
Team India Coaching Staff Shakeup: గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
Mancherial Police Operation: మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
FIFA World Cup Semi Final Thriller: ఫిఫా వరల్డ్ కప్ సెమీఫైనల్స్ కు చేరిన టాప్ ఫోర్ జట్లు.. ఇంగ్లాండ్ తో ఆర్జెంటీనా హై-వోల్టేజ్ ఫైట్, ఫ్రాన్స్ తో స్పెయిన్ ఢీ!
ఫిఫా వరల్డ్ కప్ సెమీఫైనల్స్ కు చేరిన టాప్ ఫోర్ జట్లు.. ఇంగ్లాండ్ తో ఆర్జెంటీనా హై-వోల్టేజ్ ఫైట్, ఫ్రాన్స్ తో స్పెయిన్ ఢీ!
POCSO Case: కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, పోక్సో కేసు
కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, POCSO కేసు
రాయల్ ఎన్‌ఫీల్డ్ లైట్‌వింగ్ హెల్మెట్ రివ్యూ - స్టైల్, సేఫ్టీ, కంఫర్ట్ ఎలా ఉన్నాయి?
రూ.4,500కే రాయల్ ఎన్‌ఫీల్డ్ మాడ్యులర్ హెల్మెట్ - మీ డబ్బుకు తగ్గ వాల్యూ ఇస్తుందా?
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Embed widget