అన్వేషించండి

YSRCP Tickts : వైఎస్ఆర్‌సీపీలో సిట్టింగ్‌లందరికీ టిక్కెట్లు - అప్రమత్తత కోసమే జగన్ హెచ్చరిస్తున్నారా ?

వైఎస్ఆర్‌సీపీలో సిట్టింగ్‌లు అందరికీ టిక్కెట్లు ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. మార్పు సంకేతాలు దాదాపుగా లేవని చెబుతున్నారు.

 

YSRCP Tickts :  ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో కనీసం 35-40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు నిరాకరిస్తారని ఆ పార్టీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి.  2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ 151 సీట్లు గెలుచుకుంది. అంతేకాకుండా మరో ఐదుగురు ఇతర పార్టీల నుండి ఫిరాయించారు. నలుగురు తెలుగుదేశం పార్టీ నుండి, ఒకరు జనసేన పార్టీ నుండి వైసీపీలో చేరారు. అయితే నలుగురు ఆ పార్టీకి దూరమయ్యారు. అందుకే మొత్తంగా 151  మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో  35-40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఉండవని చెబుతున్నారు. కానీ అలాంటి పరిస్థితులు లేవని .. కేసీఆర్ తరహాలో తప్పదు అనుకున్న వారినే మారుస్తారని .. అలాంటి వారు.. పది, పదిహేను మంది మాత్రమే ఉంటారని భావిస్తున్నారు. 

పార్టీ నేతల అవసరాల కోసం చేసే మార్పు చేర్పులే ఎక్కువ 

 151 మంది వైఎస్‌ఆర్‌సి ఎమ్మెల్యేలలో నలుగురు ఇప్పటికే టీడీపీలోకి ఫిరాయించారు. వారిలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఉన్నారు. టీడీపీ ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి, అద్దంకి, కుప్పం, మండపేట, విజయవాడ (తూర్పు), రాజమండ్రి (అర్బన్) నియోజకవర్గాలకు జగన్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించారు. వంగా గీత, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చింతా అనురాధ, మార్గాని భరత్, ఆదాల ప్రభాకర్ రెడ్డి వంటి కొంతమంది ఎంపీలకు అసెంబ్లీ టిక్కెట్లు ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు.  కాబట్టి, ఈ ఎంపీలకు స్థానం కల్పించేందుకు ఆయన కొంతమంది ఎమ్మెల్యేలను వదులుకోవాల్సి వచ్చింది.  అదే విధంగా తన పార్టీ ఎమ్మెల్యేలలో కొందరిని లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దింపాలని అనుకుంటున్నారు. వారిలో బొత్స సత్యనారాయణ, తమ్మినేని సీతారాం, కురసాల కన్నబాబు, ధర్మాన ప్రసాద రావు, ఆళ్ల నాని, అనిల్ కుమార్ యాదవ్‌లు ఉన్నారు. అదే జరిగితే ఈ నియోజకవర్గాల్లో తాజా ముఖాలకు జగన్ పార్టీ టిక్కెట్లు ఇవ్వనున్నారు. అంటే వీరిలో ఎవరికీ టిక్కెట్లు నిరాకరిచినట్లుగా కాదు. 

మరికొంత మంది వారసులకు టిక్కెట్లు 

పేర్ని నాని, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వంటి మరికొంత మంది ఎమ్మెల్యేలు కూడా పోటీ నుంచి తప్పుకోవాలని, తమ కుమారులకు పార్టీ టిక్కెట్లు ఇవ్వాలని జగన్‌ కోరుతున్నారు. నలుగురు టీడీపీ శాసనసభ్యులు చీరాల నుండి కరణం బలరామ కృష్ణ మూర్తి, గన్నవరం నుండి వల్లభనేని వంశీ, గుంటూరు (పశ్చిమ) నుండి మద్దాలి గిరిధర్, విశాఖపట్నం సౌత్ నుండి వాసుపల్లి గణేష్, జనసేన పార్టీ శాసనసభ్యుడు రాపాక వరప్రసాద్. ఈ ఫిరాయింపుదారులకు పార్టీ టిక్కెట్లు ఇస్తామని ముందుగానే హామీ ఇచ్చారు.  కరణం తన కుమారుడికి పార్టీ టిక్కెట్‌ను కోరుకుంటున్నారు. మిగిలిన నలుగురు వైఎస్‌ఆర్‌సి టిక్కెట్‌పై ఎన్నికలలో పోటీ చేయనున్నారు. అంటే వారసులకు టిక్కెట్లు పొందుతున్నారు కాబట్టి వారు కూడా టిక్కెట్ల విషయంలో నిరాశకు గురయినట్లు కాదు. 

పది నుంచి పదిహేను మందికి మాత్రమే పనితీరు ఆధారంగా  టిక్కెట్లు నిరాకరించే అవకాశం 
 
వైసీపీ పార్టీ, ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (I-PAC) యొక్క అంతర్గత సర్వేల ప్రకారం.. వారి పనితీరు అంచనాల కంటే చాలా తక్కువగా ఉన్న వారికి టిక్కెట్లు  ఇచ్చేది లేదని చెబుతున్నారు. ఇలాంటి వారు గట్టిగా పదిహేను మంది కూడా లేరని చెబుతున్నారు. వారికి మాత్రమే టిక్కెట్లు నిరాకరిస్తారని.. కేవలం అప్రమత్తంగా ఉండటం కోసమే.. జగన్ ప్రతీ సారి హెచ్చరికలు జారీ చేస్తున్నారని అంటున్నారు. కేసీఆర్ కూడా అదే వ్యూహం పాటించారని జగన్ కూడా అదే ఫాలో అవుతున్నారని అంటున్నారు. 90 శాతం సిట్టింగ్‌లకు టిక్కెట్లు ఉంటాయని వైసీపీలోని ఉన్నత వర్గాలు కూడా చెప్పకనే చెబుతున్నాయి.  

టాప్ హెడ్ లైన్స్

Dharmana Prasada Rao : మరో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తప్పదు - భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ క్రెడిట్ జగన్‌దే - ధర్మాన సంచలన వ్యాఖ్యలు |
మరో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తప్పదు - భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ క్రెడిట్ జగన్‌దే - ధర్మాన సంచలన వ్యాఖ్యలు |
Rahul Gandhi Speech In Parliament: కొందరు మూర్ఖులు ఎవరి మాట వినరు, తమకు నచ్చిందే చేస్తారు? రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై సభలో దుమారం
కొందరు మూర్ఖులు ఎవరి మాట వినరు, తమకు నచ్చిందే చేస్తారు? రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై సభలో దుమారం
Chandrababu 4.0 PR Strategy: చంద్రబాబు 4.0'లో మారిన పీఆర్ మార్క్ - మోదీ వ్యూహంతో రీ-పొజిషనింగ్ - అంతా వైరల్ కంటెంటే!
చంద్రబాబు 4.0'లో మారిన పీఆర్ మార్క్ - మోదీ వ్యూహంతో రీ-పొజిషనింగ్ - అంతా వైరల్ కంటెంటే!
Dhanush Political Entry: విజయ్ బాటలో ధనుష్ ? తమిళ రాజకీయాల్లోకి మరో హీరో.. 2031 లక్ష్యంగా కామ్‌గా స్క్రిప్ట్!
విజయ్ బాటలో ధనుష్ ? తమిళ రాజకీయాల్లోకి మరో హీరో.. 2031 లక్ష్యంగా కామ్‌గా స్క్రిప్ట్!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
West Bengal Birbhum Police Raid: బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Ram Charan : ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
Maruti Suzuki Victoris EMI calculator: హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
Korean Horror Thriller OTT : దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
Embed widget