అన్వేషించండి

YSRCP Tickts : వైఎస్ఆర్‌సీపీలో సిట్టింగ్‌లందరికీ టిక్కెట్లు - అప్రమత్తత కోసమే జగన్ హెచ్చరిస్తున్నారా ?

వైఎస్ఆర్‌సీపీలో సిట్టింగ్‌లు అందరికీ టిక్కెట్లు ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. మార్పు సంకేతాలు దాదాపుగా లేవని చెబుతున్నారు.

 

YSRCP Tickts :  ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో కనీసం 35-40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు నిరాకరిస్తారని ఆ పార్టీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి.  2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ 151 సీట్లు గెలుచుకుంది. అంతేకాకుండా మరో ఐదుగురు ఇతర పార్టీల నుండి ఫిరాయించారు. నలుగురు తెలుగుదేశం పార్టీ నుండి, ఒకరు జనసేన పార్టీ నుండి వైసీపీలో చేరారు. అయితే నలుగురు ఆ పార్టీకి దూరమయ్యారు. అందుకే మొత్తంగా 151  మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో  35-40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఉండవని చెబుతున్నారు. కానీ అలాంటి పరిస్థితులు లేవని .. కేసీఆర్ తరహాలో తప్పదు అనుకున్న వారినే మారుస్తారని .. అలాంటి వారు.. పది, పదిహేను మంది మాత్రమే ఉంటారని భావిస్తున్నారు. 

పార్టీ నేతల అవసరాల కోసం చేసే మార్పు చేర్పులే ఎక్కువ 

 151 మంది వైఎస్‌ఆర్‌సి ఎమ్మెల్యేలలో నలుగురు ఇప్పటికే టీడీపీలోకి ఫిరాయించారు. వారిలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఉన్నారు. టీడీపీ ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి, అద్దంకి, కుప్పం, మండపేట, విజయవాడ (తూర్పు), రాజమండ్రి (అర్బన్) నియోజకవర్గాలకు జగన్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించారు. వంగా గీత, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చింతా అనురాధ, మార్గాని భరత్, ఆదాల ప్రభాకర్ రెడ్డి వంటి కొంతమంది ఎంపీలకు అసెంబ్లీ టిక్కెట్లు ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు.  కాబట్టి, ఈ ఎంపీలకు స్థానం కల్పించేందుకు ఆయన కొంతమంది ఎమ్మెల్యేలను వదులుకోవాల్సి వచ్చింది.  అదే విధంగా తన పార్టీ ఎమ్మెల్యేలలో కొందరిని లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దింపాలని అనుకుంటున్నారు. వారిలో బొత్స సత్యనారాయణ, తమ్మినేని సీతారాం, కురసాల కన్నబాబు, ధర్మాన ప్రసాద రావు, ఆళ్ల నాని, అనిల్ కుమార్ యాదవ్‌లు ఉన్నారు. అదే జరిగితే ఈ నియోజకవర్గాల్లో తాజా ముఖాలకు జగన్ పార్టీ టిక్కెట్లు ఇవ్వనున్నారు. అంటే వీరిలో ఎవరికీ టిక్కెట్లు నిరాకరిచినట్లుగా కాదు. 

మరికొంత మంది వారసులకు టిక్కెట్లు 

పేర్ని నాని, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వంటి మరికొంత మంది ఎమ్మెల్యేలు కూడా పోటీ నుంచి తప్పుకోవాలని, తమ కుమారులకు పార్టీ టిక్కెట్లు ఇవ్వాలని జగన్‌ కోరుతున్నారు. నలుగురు టీడీపీ శాసనసభ్యులు చీరాల నుండి కరణం బలరామ కృష్ణ మూర్తి, గన్నవరం నుండి వల్లభనేని వంశీ, గుంటూరు (పశ్చిమ) నుండి మద్దాలి గిరిధర్, విశాఖపట్నం సౌత్ నుండి వాసుపల్లి గణేష్, జనసేన పార్టీ శాసనసభ్యుడు రాపాక వరప్రసాద్. ఈ ఫిరాయింపుదారులకు పార్టీ టిక్కెట్లు ఇస్తామని ముందుగానే హామీ ఇచ్చారు.  కరణం తన కుమారుడికి పార్టీ టిక్కెట్‌ను కోరుకుంటున్నారు. మిగిలిన నలుగురు వైఎస్‌ఆర్‌సి టిక్కెట్‌పై ఎన్నికలలో పోటీ చేయనున్నారు. అంటే వారసులకు టిక్కెట్లు పొందుతున్నారు కాబట్టి వారు కూడా టిక్కెట్ల విషయంలో నిరాశకు గురయినట్లు కాదు. 

పది నుంచి పదిహేను మందికి మాత్రమే పనితీరు ఆధారంగా  టిక్కెట్లు నిరాకరించే అవకాశం 
 
వైసీపీ పార్టీ, ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (I-PAC) యొక్క అంతర్గత సర్వేల ప్రకారం.. వారి పనితీరు అంచనాల కంటే చాలా తక్కువగా ఉన్న వారికి టిక్కెట్లు  ఇచ్చేది లేదని చెబుతున్నారు. ఇలాంటి వారు గట్టిగా పదిహేను మంది కూడా లేరని చెబుతున్నారు. వారికి మాత్రమే టిక్కెట్లు నిరాకరిస్తారని.. కేవలం అప్రమత్తంగా ఉండటం కోసమే.. జగన్ ప్రతీ సారి హెచ్చరికలు జారీ చేస్తున్నారని అంటున్నారు. కేసీఆర్ కూడా అదే వ్యూహం పాటించారని జగన్ కూడా అదే ఫాలో అవుతున్నారని అంటున్నారు. 90 శాతం సిట్టింగ్‌లకు టిక్కెట్లు ఉంటాయని వైసీపీలోని ఉన్నత వర్గాలు కూడా చెప్పకనే చెబుతున్నాయి.  

టాప్ హెడ్ లైన్స్

Uttar Pradesh Elections Polarisation: అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
YSRCP Mavigun Vs Amaravati 2026: వైసీపీ నేతల అమరావతి పర్యటనలో ఘర్షణలు - టీడీపీ ట్రాప్‌లో పడ్డారా? టీడీపీ ట్రాప్‌లో పడిందా?
వైసీపీ నేతల అమరావతి పర్యటనలో ఘర్షణలు - టీడీపీ ట్రాప్‌లో పడ్డారా? టీడీపీ ట్రాప్‌లో పడిందా?
Musi River Cleaning Execution Deadline: మూసి ప్రాజెక్టుపై మాటల కంటే చేతలకే మైలేజ్ - రెండున్నరేళ్లలో రేవంత్ ఎంత చేయగలరు?
మూసి ప్రాజెక్టుపై మాటల కంటే చేతలకే మైలేజ్ - రెండున్నరేళ్లలో రేవంత్ ఎంత చేయగలరు?
AP Local Body Elections 2026 Delay: ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy : ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
President Droupadi Murmu: దేశ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర - గిరిజన వర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భావోద్వేగ ప్రసంగం!
దేశ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర - గిరిజన వర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భావోద్వేగ ప్రసంగం!
Adopted Boy Sad Story: దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
Akhil Raj: అఖిల్ రాజ్ కారుపై దుండగుల దాడి... శ్రీరాముణ్ణి తలచుకున్న కుటుంబ సభ్యులు
అఖిల్ రాజ్ కారుపై దుండగుల దాడి... శ్రీరాముణ్ణి తలచుకున్న కుటుంబ సభ్యులు
AP EAPCET 2026 Results: అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
Kris Srikkanth Comments: తిలక్ వర్మ సెల్ఫిష్ ఆట వల్లే ఇండియా ఘోర ఓటమి.. శ్రీకాంత్ సంచలన కామెంట్స్, జెర్సీ ఎగరేసి హీరో అవ్వాలని చూశాడంటూ ఫైర్!
తిలక్ వర్మ సెల్ఫిష్ ఆట వల్లే ఇండియా ఘోర ఓటమి.. శ్రీకాంత్ సంచలన కామెంట్స్, జెర్సీ ఎగరేసి హీరో అవ్వాలని చూశాడంటూ ఫైర్!
Breaking News: తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
Sudha Kongara: డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
Embed widget