అన్వేషించండి

YSRCP MLAs Plan : వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లరా ? వైఎస్ జగన్ వ్యూహం ఏమిటి ?

Andhra Politics : వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్తారా లేదా అన్నదానిపై సస్పెన్స్ నెలకొంది. లెజిస్లేచర్ పార్టీ నాయకుడి ఎంపికపైనా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

YSRCP MLAs will go to the assembly or not : ఆంధ్రప్రదేశ్ లో కొత్త అసెంబ్లీ ఏర్పడింది. పార్టీల బలాబలాలు మారిపోయాయి. వైఎస్ఆర్‌సీపీ 151  స్థానాల నుంచి పదకొండు స్థానాలకు పడిపోయింది. ప్రతిపక్ష స్థానం కూడా లేదు. ప్రతిపక్ష నేత ఎట్టి  పరిస్థితుల్లోనూ ప్రతిపక్ష హోదా ఇవ్వరు. అసెంబ్లీలో సీట్లు కూడా చివరి  వరుసలో కేటాయించే అవకాశం ఉంది. సీట్లు ఎక్కడ ఉండాలనేది స్పీకర్ ఇష్టం. అయితే గత అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు, చంద్రబాబుకు చూపించిన అవమానాలు అన్నీ  గుర్తు పెట్టుకుంటామని టీడీపీ చెబుతోంది. అంటే..  వైఎస్ఆర్‌సీపీ సభ్యులకు గడ్డు పరిస్థితి ఏర్పడుతుందని చెప్పాల్సిన పని  లేదు. 

టీడీపీ కేబినెట్‌లో కమ్మ సామాజికవర్గానికి ప్రాధాన్యత తగ్గిందా ? సీనియర్ నేతలకు పదవుల యోగం లేదా ?

అసెంబ్లీలో తన కుటుంబాన్ని అవమానించినందుకే చంద్రబాబు సవాల్ చేసి బయటకు వచ్చారు. తర్వాత ప్రెస్ మీట్‌లో కన్నీరు పెట్టుకున్నారు. తమ అధినేతను, వారి కుటుంబాన్ని అంత తీవ్రంగా వేధించిన వారిని టీడీపీ సభ్యులు ఊరుకోరు. చాన్స్ వస్తే అంత కంటే ఎక్కువగా  చేస్తారు. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికరంగా ఉంటుందన్న అభిప్రాయం ఉంది. కుప్పం మున్సిపాలిటీలో వైసీపీ గెలిచినప్పుడు జగన్మోహన్ రెడ్డి.. చంద్రబాబు మొహం చూపిస్తారా అంటూ సెటైర్లు వేశారు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా జగన్ సభకు వస్తే.. మిగతా టీడీపీ నేతలంతా అలాంటి మాటలే మాట్లాడే అవకాశం ఉంది. 

ఇక జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఆగర్భ శత్రువుగా భావించే రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కూడా సభకు వస్తారు. ఆయనకు స్పీకర్ పదవి ఇస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. స్పీకర్ పదవి ఇస్తే జగన్ ఆయనను ఫేస్ చేయడం మరింత ఇబ్బందికరం. స్పీకర్ సార్ అంటూ ప్రసంగిచాల్సి ఉంటుంది. సీఎం జగన్ మనస్థత్వానికి అది సాధ్యం కాదు. ఒక వేళ ఎమ్మెల్యేగా ఉన్నా పదకొండు మంది ఎమ్మెల్యేలతో కలిసి సభలో  కూర్చుంటే ఆయన చేసే వెటకారాల్ని భరించడం కష్టం. అందుకే ఇప్పటి వరకూ  జగన్ అసెంబ్లీకి ఖచ్చితంగా వెళ్తారన్నప్రకటన రాలేదు. అలాగని  వెళ్లరని కూడా చెప్పడం లేదు. కానీ తమ శాసనసభాపక్ష నేతను కూడా ఎంపిక చేసుకోకపోవడంతో..  ఎమ్మెల్యేలు అందరూ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తారన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. 

పవన్ కల్యాణ్‌ చదివింది పదో తరగతి- పుట్టింది చీరాలలో - ఇదిగో క్లారిటీ!

గతంలో జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీని బహిష్కరించిన చరిత్ర ఉంది. 2019లో ఎన్నికకు ప్రిపరేషన్ అయ్యేందుకు పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్ర ప్రారంభించే ముందు ఆయన అసెంబ్లీని బాయ్ కాట్ చేశారు. తాను మాత్రమే కాదు.. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ అసెంబ్లీకి వెళ్లాల్సిన అవసరం లేదని తేల్చారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను లాక్కున్నందుకు నిరసన అని చెప్పారు. ఈ సారి కూడా అలాంటి నిర్ణయం తీసుకోవచ్చని.. అంటున్నారు. అయితే ప్రమాణ స్వీకారానికి అయినా వెళ్తారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jeevan Reddy: ఈ 25న కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా.. జగిత్యాలలో మారనున్న రాజకీయ ముఖచిత్రం
ఈ 25న కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా.. జగిత్యాలలో మారనున్న రాజకీయ ముఖచిత్రం
Narendra Modi Tenure: ప్రధాని మోదీ అరుదైన ఘనత.. అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా రికార్డ్- టాప్ 5 లిస్ట్ ఇదే
ప్రధాని మోదీ అరుదైన ఘనత.. అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా రికార్డ్- టాప్ 5 లిస్ట్ ఇదే
Congress Jeevan Reddy: జీవన్ రెడ్డిని బుజ్జగించిన మంత్రులు -తగ్గని సీనియర్ నేత - 25న గుడ్ బై?
జీవన్ రెడ్డిని బుజ్జగించిన మంత్రులు -తగ్గని సీనియర్ నేత - 25న గుడ్ బై?
Bengal Assembly elections 2026: రాజకీయ వారసుడికి పార్టీపై పట్టు పెంచుతున్న దీదీ - బెంగాల్‌లో ఇక అభిషేక్ హయాం ప్రారంభం కానుందా?
రాజకీయ వారసుడికి పార్టీపై పట్టు పెంచుతున్న దీదీ - బెంగాల్‌లో ఇక అభిషేక్ హయాం ప్రారంభం కానుందా?

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Dhurandhar 2 : ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Embed widget