అన్వేషించండి

Jogi Ramesh : మైలవరంపైనే జోగి రమేష్ మనసు ! ఎందుకంత పట్టుదల ?

పెడన నుంచి గెలిచిన జోగి రమేష్ మైలవరంపైనే ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. దీనికి కారణం ఏమిటి ?

 

Jogi Ramesh :  ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీకి కొత్త చిక్కులు తెచ్చి పెడుతోంది. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్, మంత్రి  జోగి రమేష్ లు ఈ నియోజకవర్గం కేంద్రంగానే పోరాడుతున్నారు. జోగి రమేష్ మైలవరం నుంచే పోటీ చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తన సిట్టింగ్ సీటులో మళ్లీ పోటీ చేయాలని వసంత కృష్ణప్రసాద్ ఆశపడుతున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. 

గత ఎన్నికల్లో అనూహ్యంగా పెడనకు వెళ్లిన జోగి రమేష్ !

మంత్రి జోగి  రమేష్ పెడన నుంచి  ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ.. ఆయన నియోజకవర్గం మైలవరం. గతంలో ఆయన మైలవరంలోనే చివరి క్షణం వరకూ పని చేశారు. అయితే  వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ను పార్టీలో చేర్చుకున్న సీఎం జగన్ ఆయనకు మైలవరం ఆఫర్ చేశారు. జోగి రమేష్‌ను పెడనకు పంపారు. అయితే ఇప్పుడు మళ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జోగి రమేష్.. తన పాత నియోజకవర్గ మైలవరం నుంచే పోటీ చేయాలని ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఇరు వర్గాలు పదే పదే ఘర్షణలకు దిగుతున్నాయి. 

జోగి రమేష్, వసంత కృష్ణప్రసాద్‌లతో హైకమాండ్ చర్చలు 

ఇరువురు నేతలను పిలిచి విడి విడిగా  సమావేశం అయ్యారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.  ఇద్దరి మద్య రాజీ కుదిర్చేందుకు యత్నించారు. అయినా ఇరువురు నేతలు   సెటిల్ మెంట్ కు అంగీకరించలేదు.తాను జగన్ తో మొదటి నుండి నడిచానని  ఇప్పుడు మంత్రిగా ఉన్న తనను వసంతతో రాజీపడమంటే తన మనస్సుకు అంగీకారం గా లేదని జోగి నేరుగానే చెప్పేశారని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నారు.  ఇక వసంత కూడ తన వైఖరిని స్పష్టంగా చెప్పేశారంటున్నారు.  తాను పార్టీలో కష్టపడి పని చేసుకుంటూ భారీగా ఖర్చు పెట్టి పార్టీని కూడా గెలిపించానని..  దేవినేని ఉమాను ఎదుర్కొని పార్టీని ముందుకు నడిపిస్తున్నానని ఆయన చెబుతున్నారు.  నియోజకవర్గంలో  జోగి రమేష్,ఆయన అనుచరులు చేస్తున్న అరాచకాలు, పార్టీకి చేస్తున్న నష్టం వంటి వివరాలను పూర్తి ఆధారాలతో  వసంత పార్టి పెద్దల ముందు పెట్టారని అంటున్నారు. తనకు చెడ్డపేరు తెచ్చేందుకు జోగి వర్గీయులు ప్రయత్నాలు చేస్తున్నారని.. దాని వల్ల పార్టీనే ఎక్కువ నష్టపోతోందని వసంత కృష్ణప్రసాద్ అంటున్నారు. 

సమీక్షలో టిక్కెట్‌ పై ఎవరికీ హామీ ఇవ్వని సీఎం జగన్ 

నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్న జగన్ తాజాగా మైలవరం నియోజకవర్గ నేతలతో సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. మైలవరం ఇష్యూలో  ప్రభుత్వ సలహాదారు సజ్జల ఇచ్చిన నివేదిక అంశాలను పరిశీలించిన జగన్,, వసంత ను కూడ ఇదే వ్యవహరం పై ఆరా తీశారని చెబుతున్నారు.  గతంలో నే జోగి కలిగిస్తున్న ఇబ్బందులను గురించి జగన్ ను ప్రత్యేకంగా కలసి వివరాలను వసంత కృష్ణ ప్రసాద్  ప్రసాద్ అందించారు. జగన్ మరో సారి వసంత ను అభిప్రాయం అడిగి తెలసుకున్నారని చెబుతున్నారు. వసంత కూడ తాను పార్టి పరంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలు,అందులో జోగి అనుచరులు చేస్తున్న తప్పుడు ప్రచారాలు,సోషల్ మీడియా పోస్టులకు సంబంధించిన వవరాలను అందించారని అంటున్నారు.  మీరు తీసుకునే నిర్ణయం ఫైనల్,దానికే కట్టుబడి ఉంటానని వసంత చెప్పినట్లుగా తెలు్సతోంది.  

మైలవరంలో పోటీకే జోగి రమేష్ ప్రయత్నాలు 

జోగి రమేష్ తాను ముందుగా ప్రాతినిధ్యం వహించిన మైలవరం నుండి జోగి సింగల్ గానే పెడన వెళ్లారు.జోగి కుటుంబ సభ్యులు, అనుచరులు, ప్రధాన శిష్యులంతా మైలవరంలోనే ఉండి ఎన్నికల సమయంలో వైసీపీ విజయానికి పని చేశారు.అయితే అధికారంలోకి వచ్చిన తరువాత అక్కడ శాసన సభ్యుడిగా విజయం సాదించిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్, పార్టీ కోసం వసంత విజయం కోసం పని చేసిన జోగి కుటుంబాన్ని, ఆయన వర్గాన్ని కనీసం పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి.  స్దానికంగా ప్రతి మండలానికి వసంత తన వర్గంలోని వ్యక్తులను ఇంచార్జ్ గా నియమించారు. దీంతో జోగి ఫ్యామిలికి ప్రాధాన్యత లేకుండా పోయింది.  ప్రతిపక్షం లో ఉండగా తమ పై దాడి చేసిన వారు ఇప్పుడు పోలీస్ స్టేషన్ తో పాటుగా స్దానిక అధికార యంత్రాంగాన్ని చేతుల్లో పెట్టుకొవటం, జోగి వర్గం కు మింగుడు పడటం లేదని చెబుతున్నారు.  ఈ విషయంలో తీవ్ర ఆగ్రహంతో ఉన్న జోగి పొగోట్టుకున్న చోటనే వెతుక్కోవాలని మైలవరం పైనే శ్రద్ద పెట్టారని సన్నిహిత వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్

వీడియోలు

Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Ind vs NZ 3rd ODI Highlights | భారత్‌లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు
Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Dasoju Shravan: సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌ నుంచి బంగ్లాదేశ్‌ అవుట్‌! ఐసీసీ అల్టిమేటంతో దిగిరాని బీసీబీ! స్కాట్లాండ్‌కు ఛాన్స్!
టీ20 వరల్డ్‌కప్‌ నుంచి బంగ్లాదేశ్‌ అవుట్‌! ఐసీసీ అల్టిమేటంతో దిగిరాని బీసీబీ! స్కాట్లాండ్‌కు ఛాన్స్!
Renu Desai : మగాళ్లు రేప్, మర్డర్ చేస్తే అందరినీ చంపేయాలా? - కొంచెమైనా బుద్ధుందా!... కుక్కలను చంపేయడంపై రేణు దేశాయ్ ఫైర్
మగాళ్లు రేప్, మర్డర్ చేస్తే అందరినీ చంపేయాలా? - కొంచెమైనా బుద్ధుందా!... కుక్కలను చంపేయడంపై రేణు దేశాయ్ ఫైర్
Embed widget