అన్వేషించండి

Telangana BJP Crisis : టిక్కెట్లిస్తామన్నా తెలంగాణ బీజేపీలోకి వలసలెందుకు లేవు ? ఆ పార్టీలో ఏం జరుగుతోంది ?

తెలంగాణ బీజేపీలోకి వలసలు ఎందుకు లేవు..? పాత నేతలు కొత్త నేతల్ని ఎదగనీయడం లేదా ?

 


Telangana BJP Crisis :  కొత్తగా వచ్చే వారికి టిక్కెట్ హామీ అని ఇటీవల తరుణ్ చుగ్ ప్రకటించారు. ఇలాంటి హామీ సాధారణంగా బీజేపీ ఇవ్వదు .కానీ ఇచ్చిందంటే వలసల కోసం ఆ పార్టీ ఎంతగా ఎదురు చూస్తుందో అనేదానికి సాక్ష్యం అనుకోవచ్చు. అయినా వలసలు భారీగా లేవు. దీనికి కారణం రాజకీయ భవిష్యత్ ఉంటుందని ఆశపడి పార్టీలో చేరిన వారిని ఎదగకుండా చేస్తున్నారన్న ప్రచారమే. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ను తప్పిస్తాని.. ఈటల రాజేందర్‌కు చాన్సిస్తారని ఇటీవల ఒక్క సారిగా గుప్పుమంది. ఇదొక్కటే కాదు..  వరుసగా ఇలాంటి ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ బీజేపీలో ఆల్ ఈజ్ నాట్ వెల్ అన్నట్లుగా పరిస్థితి ఉందని.. కాంగ్రెస్ పార్టీలా రోడ్డు మీదకు ఎక్కకపోయినా అంతర్గతంగా తీవ్ర సంక్షోభం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే వలసలు లేవంటున్నారు. 

వలస నేతలకు దక్కని ప్రాధాన్యం ! 

బీజేపీ కేంద్రంలో రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో చేరికల్ని ప్రోత్సహించింది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీలో మిగిలిపోయిన నేతలందరూ చేరారు. తర్వాత ఈటల చేరారు. ఈటలతో పాటు పలువురు నేతలు చేరారు. అంతకు ముందే డీకే్ అరుణ, జితేందర్ రెడ్డి వంటి నేతలు చేరారు. తర్వాత  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి వారు చేరారు. వీరందరితో మాత్రమే కాదు..వీరి రాకతో ఓ మూమెంటం వస్తుందని ... చేరికల వరద పారుతుందని అనుకున్నారు. కానీ బీజేపీ అనుకున్నది వేరు.. చేరిన స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ వంటి వాళ్లు బ్యాక్ టు పెవిలియన్ అయ్యారు.  బీజేపీలో కొత్తగా చేరిన ఈటల రాజేందర్, డీకే అరుణ, జితేందర్ రెడ్డి , విజయశాంతి, రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి వంటి వారి కిప్రాధాన్యత ఉండటం లేదు.  

ఇతర రాష్ట్రాల్లో వలస నేతలకు సీఎం పదవులూ ఇచ్చిన బీజేపీ !

బీజేపీకి ఓ ప్రత్యేకమైన సిద్దాంతం ఉంది. ఆ పార్టీ సిద్ధాంతాన్ని పాటించేవాళ్లు మాత్రమే ఆ పార్టీలో ఇమడగలుగుతారు. అయితే  పార్టీ మోదీ, అమిత్ షా  చేతుల్లోకి వచ్చాక.. అన్ని రాష్ట్రాల్లో బీజేపీలోకి నేతల వలస పెరిగింది. రావాలనుకునేవారిని మాత్రమే కాదు.. తాము కావాలనుకున్న వారినీ .. బీజేపీ ఆకర్షించింది.  ఇలా  బీజేపీ దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ బలపడింది. ఇలా తమ పార్టీలో చేరిన వారిని బీజేపీ ఎక్కడా నిరాశపర్చలేదు. అసోం లాంటి చోట్ల ఏకంగా ముఖ్యమంత్రి పదవుల్నే ఇచ్చారు. ఇదే ఫార్ములాను తెలంగాణలోనూ ప్రయోగించాలనుకున్నారు. కానీ బీజేపీ హైకమాండ్ ప్రయత్నాలు నిర్వీర్యం అయిపోతున్నాయి. దీనికి కారణం.. ఇతర పార్టీలు కాదు..  తెలంగాణ బీజేపీ నేతలే. 

పాత నేతల వల్ల ఇమడలేకపోతున్న వలస నేతలు ! 

తెలంగాణ బీజేపీలో వలస నేతల రాజకీయ భవిష్యత్ అంధకారంగా మారుతోందన్న అభిప్రాయం ఉంది.  బండి సంజయ్ తెలంగాణ  బీజేపీ అధ్యక్షుడు అయినప్పటి నుండి ఆయన మాత్రమే ఫోకస్ అవుతున్నారని..  ఈటల గెలిచినా.. కేసీఆర్ ను టార్గెట్ చేసుకునేందుకు స్కోప్ ఉన్నా పడనీయలేదన్న విమర్శలు ఆ పార్టీలో ఉన్నాయి.  తాను కేసీఆర్ పై పోటీ చేస్తానంటే.. దాన్నీ తప్పు పట్టారు. ఇక ఫైర్ బ్రాండ్ డీకే్ అరుణ, జితేందర్ రెడ్డి లాంటి వాళ్లు ఉపఎన్నికలు వస్తే ఆ సమయంలోనే కనిపిస్తారు. వీరంతా.. ఇప్పుడు తమ సంగతేమిటో తేల్చాలని హైకమాండ్ వద్ద పంచాయతీ పెట్టుకున్నట్లుగా చెబుతున్నారు. ప్రస్తుత బీజేపీలో ఈ పరిస్థితి ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉందంటున్నారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
Aamir Khan Weight Loss : జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో

వీడియోలు

Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు
Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
Aamir Khan Weight Loss : జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
RTC Bus Overturns: డ్రైవింగ్ చేస్తుండగా ఫిట్స్.. పొలాల్లోకి దూసుకెళ్లి ఆర్టీసీ బస్సు బోల్తా - విజయనగరంలో ఘటన
డ్రైవింగ్ చేస్తుండగా ఫిట్స్.. పొలాల్లోకి దూసుకెళ్లి ఆర్టీసీ బస్సు బోల్తా - విజయనగరంలో ఘటన
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
Embed widget