అన్వేషించండి

Nutrition vs ideology in Bengal School Meals : బెంగాల్ మిడ్-డే మీల్స్ వివాదం - చేపల రాజకీయం నుంచి గుడ్డు రద్దు వరకు.. బీజేపీ వ్యూహం బెడసికొడుతుందా?

School Meal Controversy Kolkata: ప బెంగాల్ ప్రభుత్వ పాఠశాలల మిడ్-డే మీల్స్ నుండి గుడ్లను తొలగించి ఇస్కాన్ శాకాహార భోజనాన్ని ప్రవేశపెట్టాలనే బీజేపీ ప్రభుత్వ నిర్ణయంపై రాజకీయ దుమారం రేగుతోంది.

TMC attacks BJP over imposing vegetarianism in Bengal:  పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో  ఆహార సంస్కృతి  చుట్టూ నడిచిన రాజకీయం అంతా ఇంతా కాదు. బీజేపీ అధికారంలోకి వస్తే బెంగాలీల ఇళ్లలో చేపలు, మాంసం తిననివ్వరు.. శాకాహారాన్ని బలవంతంగా రుద్దుతారు  అంటూ అప్పటి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ ఇమేజ్ డ్యామేజ్‌ను తిప్పికొట్టేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగి అలాంటిదేమీ ఉండదని హామీ ఇవ్వడం, అనురాగ్ ఠాకూర్ వంటి అగ్రనేతలు బహిరంగంగా చేపలు తింటూ మేము బెంగాలీ సంస్కృతిని గౌరవిస్తాం అని నమ్మబలికారు. ఫలితంగా బీజేపీ బెంగాల్ పీఠాన్ని దక్కించుకుంది. అయితే, అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల మిడ్-డే మీల్స్ నుంచి  గుడ్లను తొలగించాలని  ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ఇప్పుడు కలకలం రేపుతోంది.    

 ఇస్కాన్  చేతికి వంటశాలలు

పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి స్వపన్ దాస్‌గుప్తా ప్రవేశపెట్టిన నూతన బడ్జెట్‌లో ప్రాథమిక పాఠశాల విద్యార్థుల మిడ్-డే మీల్స్ మౌలిక ధరను  10 కి పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ పెంపును అందరూ స్వాగతించినప్పటికీ, కోల్‌కతా పరిధిలో పైలట్ ప్రాజెక్ట్ కింద వండిన భోజనాన్ని సరఫరా చేసే బాధ్యతను హిందూ ఆధ్యాత్మిక సంస్థ అయిన  ఇస్కాన్ అన్నమిత్ర ఫౌండేషన్  కు అప్పగించడం వివాదానికి కేంద్రబిందువైంది. ఇస్కాన్ నిబంధనల ప్రకారం వారు కేవలం సంపూర్ణ శాకాహారాన్ని మాత్రమే వండుతారు. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలల్లో వారానికి ఒకసారి విద్యార్థులకు అందించే అత్యంత ప్రజాదరణ పొందిన  కోడిగుడ్డు మెనూ నుంచి శాశ్వతంగా దూరమవబోతోంది. గుడ్డు స్థానంలో పనీర్, రాజ్‌మా, సోయాబీన్, పప్పుధాన్యాలు అందిస్తామని ఇస్కాన్ ప్రతినిధులు స్పష్టం చేశారు.

 పోషకాహార నిపుణుల వాదన 

 ఈ నిర్ణయంపై విద్యాశాఖ మంత్రి   శాకాహారంలో కూడా పిల్లల ఎదుగుదలకు అవసరమైన అన్ని రకాల ప్రోటీన్లు, విటమిన్లు లభిస్తాయని, సైన్స్ పరంగా ఇది సరైనదేనని వాదించారు. ముఖ్యమంత్రి సువేందు అధికారి సైతం అసెంబ్లీలో  ఇది ఎవరి  నమ్మకాలను ఇతరులపై రుద్దడం కాదు, కేవలం పిల్లలకు పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యం  అని పేర్కొన్నారు. అయితే, పోషకాహార నిపుణులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మాత్రం ఈ వాదనతో ఏకీభవించడం లేదు. బెంగాల్‌లోని పేద కుటుంబాల పిల్లలు పాఠశాలలకు రావడానికి వారానికి ఒకసారి దొరికే గుడ్డు  ఒక ప్రధాన ఆకర్షణ అని, కోడిగుడ్డులో ఉండే అత్యంత సులభంగా జీర్ణమయ్యే అమినో యాసిడ్ల నాణ్యత  సోయాబీన్ వంటి ప్లాంట్ ప్రోటీన్లలో లభించదని వారు హెచ్చరిస్తున్నారు.

 గుజరాత్ జింఖానా బయటపడింది .. ప్రతిపక్షాల ఘాటు విమర్శలు

ఈ వ్యవహారంపై తృణమూల్ కాంగ్రెస్  ఎన్నికల ప్రచారంలో చేపలు తింటూ తమాషా చేసిన వారు.. ఇప్పుడు అధికారంలోకి రాగానే తమ అసలు  గుజరాత్ జింఖానా  రూపాన్ని బయటపెట్టారు. బెంగాల్ పిల్లలపై బలవంతంగా శాకాహారాన్ని రుద్దాలని చూస్తున్నారు. బెంగాల్ దీనిని ఎంతమాత్రం అంగీకరించదు  అని  మండిపడుతోంది.  విచిత్రమేమిటంటే, టీఎంసీ నుంచి తిరుగుబాటు చేసి ప్రస్తుతం అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తింపు పొందిన రీతబ్రత బెనర్జీ సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. బెంగాలీల ఆహారపు అలవాట్లను మార్చడానికి ప్రయత్నించడం సరికాదని, గుడ్లను తొలగించడాన్ని తాము తీవ్రంగా నిరసిస్తున్నామని స్పష్టం చేశారు.

 దీర్ఘకాలంలో బీజేపీ ఇమేజ్‌కు తీవ్ర నష్టం!

 రాజకీయ కోణంలో విశ్లేషిస్తే, ఈ నిర్ణయం బీజేపీకి దీర్ఘకాలంలో పెద్ద మైనస్‌గా మారే ప్రమాదం ఉంది. బెంగాలీ సమాజంలో దాదాపు 98 శాతం మంది మాంసాహారులు  చేపలు, గుడ్లు తినేవారు . ఆహారం అనేది అక్కడ కేవలం ఆకలికి సంబంధించింది కాదు, అది వారి సాంస్కృతిక అస్తిత్వంలో ఒక భాగం. గతంలో అమిత్ షా ఇచ్చిన హామీలను నమ్మి ఓటేసిన సాధారణ బెంగాలీ ఓటరుకు.. ఈ  గుడ్డు రద్దు  నిర్ణయం ఒక రకమైన అపనమ్మకాన్ని కలిగిస్తుంది. బీజేపీ కేవలం ఎన్నికల కోసమే అబద్ధాలు చెప్పింది, లోపల ఉన్న హిందుత్వ, శాకాహార ఎజెండాను ఇప్పుడు పిల్లల పళ్లాలపై చూపిస్తోంది  అనే ప్రతిపక్షాల ప్రచారానికి ప్రభుత్వమే స్వయంగా ఆయుధాన్ని అందించినట్లయింది.   

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana BJP: తెలంగాణపై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌! ఢిల్లీ నుంచి పెద్దల క్యూ! భారీగా చేరికలకు ప్లాన్!
తెలంగాణపై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌! ఢిల్లీ నుంచి పెద్దల క్యూ! భారీగా చేరికలకు ప్లాన్!
Prashna Ravan: రావణ్‌తో సంబంధం లేదంటున్న వైసీపీ - ఇప్పటి వరకూ చేసిన సపోర్టు తూచ్ - ఎందుకు ఈ యూటర్న్?
రావణ్‌తో సంబంధం లేదంటున్న వైసీపీ - ఇప్పటి వరకూ చేసిన సపోర్టు తూచ్ - ఎందుకు ఈ యూటర్న్?
TVK Govt Asks State Election Commissioner to Step Down: తమిళనాడులో జగన్ మార్క్ పాలిటిక్స్ - ఎస్ఈసీ వర్సెస్ సీఎం విజయ్.. ఆనాటి నిమ్మగడ్డ ఎపిసోడ్ రిపీట్ అవుతోందా?
తమిళనాడులో జగన్ మార్క్ పాలిటిక్స్ - ఎస్ఈసీ వర్సెస్ సీఎం విజయ్.. ఆనాటి నిమ్మగడ్డ ఎపిసోడ్ రిపీట్ అవుతోందా?
KTR vs Kavitha political war: కవిత వర్సెస్ కేటీఆర్ - ఈ రాజకీయం బీఆర్ఎస్ పునాదుల్ని కదిలించబోతోందా?
కవిత వర్సెస్ కేటీఆర్ - ఈ రాజకీయం బీఆర్ఎస్ పునాదుల్ని కదిలించబోతోందా?
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kagaznagar Thief Caught: ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
Breaking News: 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
Supreme Court Litigant Hurls Abuses Judges: సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
Youtuber Ravan: యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
Telangana BJP: తెలంగాణపై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌! ఢిల్లీ నుంచి పెద్దల క్యూ! భారీగా చేరికలకు ప్లాన్!
తెలంగాణపై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌! ఢిల్లీ నుంచి పెద్దల క్యూ! భారీగా చేరికలకు ప్లాన్!
Karur Stampede Case Update: కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
Psychological Thriller OTT : ఆరు ఓటీటీల్లో మెడికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ - ఎందుకంత స్పెషల్... తెలుగులోనూ చూసెయ్యండి
ఆరు ఓటీటీల్లో మెడికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ - ఎందుకంత స్పెషల్... తెలుగులోనూ చూసెయ్యండి
AP Cabinet Special Task Force: ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం! సోషల్ మీడియా సైకోల కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ .. డీజీపీ నివేదికతో యాక్షన్ ప్లాన్!
ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం! సోషల్ మీడియా సైకోల కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ .. డీజీపీ నివేదికతో యాక్షన్ ప్లాన్!
Embed widget