అన్వేషించండి

Egg Attack On TMC Leaders In Bengal: బెంగాల్ పాలిటిక్స్‌లో కోడిగుడ్ల సంస్కృతి - తృణమూల్ నేతలు కనిపిస్తే దాడులే !

Egg Attacks On TMC Leaders: బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ నేతలకు గుడ్ల దాడి పెద్ద సమస్యగా మారింది. పలు చోట్ల ప్రజలు వీరు కనిపిస్తే గుడ్లతో దాడి చేస్తున్నారు.

Bengal Egg Attacks : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఎప్పుడూ వేడివేడిగా, హింసాత్మక ఘర్షణలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంటాయి. అయితే ఇటీవలి కాలంలో అక్కడ అధికార తృణమూల్ కాంగ్రెస్ నేతలను లక్ష్యంగా చేసుకుని సరికొత్త నిరసన సంస్కృతి తెరపైకి వచ్చింది. అదే  కోడిగుడ్ల దాడుల  పర్వం. తాజాగా నదియా జిల్లా కృష్ణనగర్‌ లోని మాజీ మంత్రి, సీనియర్ టీఎంసీ నేత ఉజ్జల్ బిస్వాస్ నివాసంలో జరిగిన హైడ్రామా బెంగాలీ మీడియాలో పెను సంచలనంగా మారింది. వరద బాధితులకు పంచాల్సిన ప్రభుత్వ సామాగ్రిని   తన ఇంట్లో అక్రమంగా దాచారంటూ ఆగ్రహించిన స్థానికులు, నిరసనకారులు ఆయన ఇంట్లోకి చొరబడి.. కుర్చీలో కూర్చున్న ఆయన ముఖంపై కోడిగుడ్లతో కొట్టి,  దొంగ.. దొంగ  అంటూ నినాదాలు చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ హైడ్రామా జరిగిన కొన్ని గంటల్లోనే కోల్‌కతా పోలీసులు ఆయనను అధికారికంగా అరెస్ట్ చేశారు.  

ఈ మొత్తం వివాదానికి మూలం టార్పాలిన్‌ల దుర్వినియోగం కేసు. బెంగాల్‌లో వరదలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పేద ప్రజలకు పంపిణీ చేయడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున  టార్పాలిన్లు,  ధోతీలు, శారీలను సరఫరా చేస్తుంది. అయితే, కృష్ణనగర్ సౌత్ మాజీ ఎమ్మెల్యే, మాజీ జైళ్ల శాఖ మంత్రి అయిన ఉజ్జల్ బిస్వాస్ నివాసం నుండి మంగళవారం మధ్యాహ్నం భారీ ఎత్తున ఈ ప్రభుత్వ మెటీరియల్‌ను ఒక గూడ్స్ వాహనంలోకి తరలిస్తుండటాన్ని స్థానిక ప్రజలు బీజేపీ శ్రేణులు గమనించారు. ప్రభుత్వ సొమ్మును అక్రమంగా నిల్వ ఉంచి బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారనే సమాచారం క్షణాల్లో దావానలంలా వ్యాపించడంతో వందలాది మంది ఆయన ఇంటిని ముట్టడించారు. ఆఫీస్ రూమ్‌లోకి దూసుకెళ్లి ఫైళ్లను పారేసి, చివరకు ఆయన ముఖంపై గుడ్లు విసిరి తమ కసితీర్చుకున్నారు. 

 ఇది కేవలం ఒక ఉజ్జల్ బిస్వాస్ సమస్య మాత్రమే కాదు. బెంగాల్ వ్యాప్తంగా టీఎంసీ నేతలకు   కుళ్లిన కోడిగుడ్ల  రుచి చూపించడం ఒక ట్రెండ్‌లా మారిపోయింది. గత కొన్ని వారాలుగా టీఎంసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు ఎక్కడ ప్రజా క్షేత్రంలోకి వచ్చినా స్థానికులు గుడ్లతో దాడులు చేస్తున్నారు. పార్టీ అగ్రనేత అభిషేక్ బెనర్జీపై మొదలైన ఈ  ఎగ్ ఎటాక్  సంస్కృతి.. ఇప్పుడు గ్రామస్థాయి నేతల వరకు పాకింది. నిధుల దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై ప్రజల్లో ఉన్న తీవ్ర అసంతృప్తికి, ఆగ్రహానికి ఈ కోడిగుడ్ల దాడులు ఒక ప్రతీకగా మారుతున్నాయి.   

మరోవైపు, ఈ అరెస్టులు,  దాడుల వెనుక పెద్ద రాజకీయ చదరంగమే నడుస్తోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఉజ్జల్ బిస్వాస్ బీజేపీ అభ్యర్థి సాధన్ ఘోష్ చేతిలో ఓడిపోయారు. అధికారం కోల్పోయిన వెంటనే ఇలాంటి అవినీతి అస్త్రాలు బయటకు రావడంపై టీఎంసీ వర్గాలు మండిపడుతున్నాయి. ఉజ్జల్ బిస్వాస్ కుటుంబ సభ్యులు ఈ ఆరోపణలను పూర్తిగా తిరస్కరించారు. ఒక మంత్రిగా, ఎమ్మెల్యేగా తన కోటాకు సంబంధించిన సామాగ్రిని ప్రజలకు పంచడానికే ఇంట్లో ఉంచారని.. వాటిని తిరిగి జిల్లా యంత్రాంగానికి అప్పగించడానికి సిద్ధమవుతుండగా, బీజేపీ కావాలనే ప్లాన్ ప్రకారం దాడి చేయించిందని ఆరోపిస్తున్నారు. అయితే, ఇదే రోజున మరో మాజీ మంత్రి ఇంద్రనీల్ సేన్‌పై కూడా దుర్గాపూజ నిధుల దుర్వినియోగం కేసు నమోదు కావడం, గతంలోనే సుజిత్ బోస్ వంటి నేతలు అరెస్ట్ కావడం చూస్తుంటే.. టీఎంసీని లీగల్‌గా, పబ్లిక్‌గా కార్నర్ చేయడంలో బీజేపీ సక్సెస్ అవుతోంది.  

ప్రజాప్రతినిధులు తప్పు చేస్తే చట్టపరంగా శిక్షించాల్సింది పోయి.. ఇలా ఇళ్లల్లోకి చొరబడి భౌతిక దాడులకు దిగడం, కోడిగుడ్లు విసరడం లాంటి సంఘటనలు శాంతిభద్రతల సమస్యను మరింత జటిలం చేస్తాయని తృణమూల్ నేతలంటున్నారు.   ప్రజా గ్రహాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని వీధుల్లో రచ్చ చేయడం చూస్తుంటే.. రాబోయే రోజుల్లో బెంగాల్ రాజకీయ క్షేత్రం మరిన్ని కోడిగుడ్ల దాడులకు, అరెస్టుల పర్వానికి వేదిక కాబోతోందని స్పష్టమవుతోంది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: విశాఖలో మత్స్యకార కుటుంబాలను పరామర్శించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్
విశాఖలో మత్స్యకార కుటుంబాలను పరామర్శించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్
FIFA Nice Attack Homage: ఫ్రాన్స్- స్పెయిన్ సెమీఫైనల్ పోరులో సైలెన్స్ పాటించ‌నున్న ప్లేయ‌ర్స్.. నిస్ టెర్రర్ అటాక్ బాధితులకు నివాళి, ఫిఫా వరల్డ్ కప్ వేదికగా అపూర్వ ఘట్టం!
ఫ్రాన్స్- స్పెయిన్ సెమీఫైనల్ పోరులో సైలెన్స్ పాటించ‌నున్న ప్లేయ‌ర్స్.. నిస్ టెర్రర్ అటాక్ బాధితులకు నివాళి, ఫిఫా వరల్డ్ కప్ వేదికగా అపూర్వ ఘట్టం!
ACB Raids: పెద్దపల్లిలో అడ్డంగా దొరికిన మున్సిపల్ ఏఈ.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ బుక్కయ్యాడు
పెద్దపల్లిలో అడ్డంగా దొరికిన మున్సిపల్ ఏఈ.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ బుక్కయ్యాడు
Warangal Airport: జూన్ 2, 2028 నాటికి వరంగల్ ఎయిర్‌పోర్ట్ పూర్తి: రేవంత్‌ రెడ్డితో భేటీ అనంతరం రామ్మోహన్‌ నాయుడు
జూన్ 2, 2028 నాటికి వరంగల్ ఎయిర్‌పోర్ట్ పూర్తి: రేవంత్‌ రెడ్డితో భేటీ అనంతరం రామ్మోహన్‌ నాయుడు
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gun At Shopping Mall: కూకట్‌పల్లి లులు మాల్‌లో గన్ కలకలం.. యాజమాన్యంపై కేసు నమోదు
కూకట్‌పల్లి లులు మాల్‌లో గన్ కలకలం.. యాజమాన్యంపై కేసు నమోదు
Tirupati Leopard News: తిరుపతి శివారులో చిరుత సంచారం.. వణికిపోతున్న స్థానికులు, అధికారులపై ఆగ్రహం
తిరుపతి శివారులో చిరుత సంచారం.. వణికిపోతున్న స్థానికులు, అధికారులపై ఆగ్రహం
POCSO Act: టీనేజ్ లవ్ అఫైర్లపై పోక్సో అస్త్రం.. చాలా కేసుల్లో చట్టం దుర్వినియోగం! సుప్రీంకోర్టు ఆందోళన
టీనేజ్ లవ్ అఫైర్లపై పోక్సో అస్త్రం.. చాలా కేసుల్లో చట్టం దుర్వినియోగం! సుప్రీంకోర్టు ఆందోళన
AP Local Body Elections November: నవంబర్‌లో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు! చంద్రబాబు, పవన్ కల్యాణ్ ముందస్తు సీట్ల ప్లాన్ ఇదే!
నవంబర్‌లో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు! చంద్రబాబు, పవన్ కల్యాణ్ ముందస్తు సీట్ల ప్లాన్ ఇదే!
Shruti Haasan: శృతి హాసన్ ఫ్యామిలీ ఎక్కడ... చెన్నై గృహ ప్రవేశంలో ఎవరూ లేరేందుకు?
శృతి హాసన్ ఫ్యామిలీ ఎక్కడ... చెన్నై గృహ ప్రవేశంలో ఎవరూ లేరేందుకు?
IND Predicted XI Vs Eng in 1st ODI: ఇంగ్లాండ్ తో పోరుకు రోకో గ్రాండ్ రీఎంట్రీ.. శుభారంభానికి గిల్ సూపర్ స్కెచ్, ఫస్ట్ వన్డేకు ఇండియా ప్రెడిక్టెడ్ ఎలెవన్ ఇదే!
ఇంగ్లాండ్ తో పోరుకు రోకో గ్రాండ్ రీఎంట్రీ.. శుభారంభానికి గిల్ సూపర్ స్కెచ్, ఫస్ట్ వన్డేకు ఇండియా ప్రెడిక్టెడ్ ఎలెవన్ ఇదే!
Kaleshwaram NDSA Report Medigadda: మేడిగడ్డ వద్ద ఎత్తిపోయకపోవడంతోనే పట్టిసీమకు గోదావరి -ఈ వాదనలో నిజం ఎంత?
మేడిగడ్డ వద్ద ఎత్తిపోయకపోవడంతోనే పట్టిసీమకు గోదావరి -ఈ వాదనలో నిజం ఎంత?
ట్రాఫిక్ చలాన్ పేరుతో కొత్త సైబర్ మోసం - కేంద్రం హెచ్చరిక, ఇలా జాగ్రత్తపడండి
ట్రాఫిక్ చలాన్ కట్టమంటూ మీ మొబైల్‌కు మెసేజ్‌ వచ్చిందా? అది మాయాజాలం కావచ్చు, జాగ్రత్త!
Embed widget