Falta ByPoll: ఫాల్టా ఉపఎన్నికలో చేతులెత్తేసిన తృణమూల్ అభ్యర్థి - పోలింగ్కు ముందే బీజేపీ విజయం
West Bengal Politics: బెంగాల్ ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గంలో మే 21న జరగాల్సిన రీ-పోలింగ్ ముందు టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ విస్మయానికి గురిచేశారు.

BJP Bengal Pushpa Vs Singham: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించి, సువేందు అధికారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత తృణమూల్ కాంగ్రెస్ కోటలు ఒక్కొక్కటిగా కూలిపోతున్నాయి. ముఖ్యంగా అభిషేక్ బెనర్జీకి అత్యంత సన్నిహితుడు, ఫాల్టా నియోజకవర్గ టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ అనూహ్య నిర్ణయం బెంగాల్ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది.
ఏప్రిల్ 29న జరిగిన పోలింగ్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో ఎన్నికల సంఘం మొత్తం 285 కేంద్రాల్లో రీ-పోలింగ్కు ఆదేశించింది. అయితే, అనూహ్యంగా జహంగీర్ ఖాన్ మీడియా ముందుకు వచ్చి, తాము ఇక పోటీలో ఉండటం లేదని ప్రకటించడమే కాకుండా.. బీజేపీ ముఖ్యమంత్రి సువేందు అధికారిని ప్రశంసలతో ముంచెత్తారు.
పుష్ప తగ్గాడు.. సింగం గెలిచింది!
ఎన్నికల ప్రచార సమయంలో యూపీకి చెందిన ఐపీఎస్ అధికారి అజయ్ పాల్ శర్మను ఉద్దేశించి నేను పుష్పని.. తగ్గేదే లే అంటూ జహంగీర్ ఖాన్ సవాల్ విసిరారు. సింగం వర్సెస్ పుష్ప గా సాగిన ఆ పోరులో చివరకు జహంగీర్ ఖాన్ తోకముడిచారు. మే 4న ఎన్నికల ఫలితాలు వెలువడి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పది రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన, ఇప్పుడు తిరిగి వచ్చి పూర్తిగా తన వైఖరిని మార్చుకున్నారు. మన ముఖ్యమంత్రి సువేందు అధికారి ఫాల్టా అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నారు, ఆయన నాయకత్వంలోనే అభివృద్ధి సాధ్యం అని చెప్పుకొస్తున్నారు.
అభిషేక్ బెనర్జీకి గట్టి దెబ్బ
ఫాల్టా నియోజకవర్గం టీఎంసీ సెకండ్ ఇన్ కమాండ్ అభిషేక్ బెనర్జీ పార్లమెంటు నియోజకవర్గమైన డైమండ్ హార్బర్ పరిధిలోకి వస్తుంది. అక్కడ తన అత్యంత నమ్మకస్తుడైన అభ్యర్థి ఇలా చివరి నిమిషంలో బీజేపీ సీఎంను పొగుడుతూ తప్పుకోవడం టీఎంసీకి కోలుకోలేని దెబ్బ. ముఖ్యమంత్రి సువేందు అధికారిని మన సీఎం అని జహంగీర్ సంబోధించడం బెంగాల్లో టీఎంసీ పతనావస్థకు నిదర్శనమని భావిస్తున్నారు. తన అభ్యర్థి ఎందుకు తప్పుకున్నాడో తమకు తెలియదని టీఎంసీ అధికార ప్రతినిధి అరూప్ చక్రవర్తి నీళ్ళు నమలడం చర్చనీయాంశంగా మారింది.
VIDEO | South 24 Parganas: Addressing a press conference, TMC leader Jahangir Khan said,
— Press Trust of India (@PTI_News) May 19, 2026
"I am the son of Falta and I want Falta to be at peace and grow. Our CM Suvendu Adhikari is giving a special package for the development of Falta, which is why I am separating myself from… pic.twitter.com/R95Lw7DpHo
వలసల పర్వం మొదలైందా?
బెంగాల్లో 15 ఏళ్ల టీఎంసీ పాలనకు చరమగీతం పాడుతూ బీజేపీ 200లకు పైగా సీట్లతో అధికారంలోకి రావడంతో, గతంలో బాహుబలులు గా చలామణి అయిన టీఎంసీ నేతలు ఇప్పుడు తమ రాజకీయ అస్తిత్వం కోసం బీజేపీ వైపు చూస్తున్నారు. జహంగీర్ ఖాన్ నిర్ణయం కేవలం ఒక నియోజకవర్గానికి పరిమితం కాదని, రాబోయే రోజుల్లో మరికొంత మంది టీఎంసీ నేతలు సువేందు అధికారి నాయకత్వాన్ని బలపరిచే సంకేతంగా కనిపిస్తోంది. పోలింగ్ ఏజెంట్లను కూడా పెట్టుకోలేని స్థితికి టీఎంసీ పడిపోయింది అని సీఎం సువేందు అధికారి ఎద్దేవా చేశారు.
ఫాల్టాలో పోలింగ్ జరగకముందే బీజేపీ విజయం దాదాపు ఖాయమైపోయింది. బెంగాల్లో బీజేపీ వేవ్ ఏ స్థాయిలో ఉందో జహంగీర్ ఖాన్ యూ-టర్న్ స్పష్టం చేస్తోంది. ఒకప్పుడు అధికారాన్ని శాసించిన నాయకులు ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి వినమ్రంగా మారుతుండటం చూస్తుంటే.. బెంగాల్ రాజకీయం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగినట్లు కనిపిస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















