అన్వేషించండి

Puivendula Latest News : పులివెందుల జడ్పీటీసీలో టీడీపీ విజయం జగన్‌కు ఎదురుదెబ్బేనా? వైసీపీ పని అయిపోయిందా?

Puivendula Latest News :ఉత్కంఠగా సాగిన పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికల ఫలితాల్లో వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ అభ్యర్థికి డిపాజిట్ కూడా రాలేదు. కానీ ఇది టీడీపీ బలుపుగా భావించవచ్చా? లేక వాపేనా?

Puivendula Latest News : పులివెందుల జడ్పీటీసీని అధికార టీడీపీ కైవశం చేసుకుంది. ఇది జగన్‌కు ఎదురు దెబ్బ అని వైసీపీ మరింత నీరసించిపోతుందని టీడీపీ శ్రేణులు సంబరపడుతున్నాయి. పులివెందుల గడ్డా ఇకపై జగన్ అడ్డా కాదని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే సీన్ రిపీట్ అవుతుందని జోస్యం చెబుతున్నాయి. ఇదంతా దొంగ ఓట్లతో సాధించిన విజయమని కచ్చితంగా నిజమైన ఓట్లతో తాము గెలిచి చూపిస్తామని వైసీపీ శపథం చేస్తోంది. ఇంతకీ ఈ విజయాన్ని ఎలా చూడాలి. ఇది టీడీపీ బలానికి ప్రతీకనా లేకా కేవలం వాపేనా అనేది పరిశీలిద్దాం. 
 
పులివెందుల అంటేనే వైఎస్‌ కుటుంబానికి అడ్డా. పార్లమెంట్ ఎన్నికల నుంచి సర్పంచ్ ఎన్నికల వరకు ఆ ఫ్యామిలీయే శాసిస్తుంది. వారు ఎవర్ని నిలబెడితే వాళ్లకే జనం ఓట్లేస్తారు. ఇది అక్కడ ప్రజల ప్రేమాభిమానాలకు నిదర్శనమని వైసీపీ నేతలు చెబుతుంటారు. కానీ అక్కడ ప్రజలకు స్వేచ్ఛ లేకుండా భయపెట్టి ఇలాంటి ప్రొజెక్షన్ ఇస్తుంటారని ప్రత్యర్థుల ఆరోపణ. ఏమైనా సరే ఇప్పటి వరకు వైఎస్ కుటుంబాన్ని దాటి వేరే వ్యక్తులు ఆ ప్రాంతంలో గెలించింది లేదు. అలానే జడ్పీటీసీ కూడా ఆ కుటుంబ ఆధిపత్యం సాగుతూ వచ్చింది. కానీ తొలిసారి ఈ ఉపఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత పులివెందుల జడ్పీటీసీలో సైకిల్ బెల్ మోగింది. 

Image

దశాబ్ధాలుగా కొనసాగుతున్న వైఎస్ కుటుంబ ఆధిపత్యానికి ఇది ఎదురుదెబ్బే అనొచ్చు. పులివెందుల జడ్పీటీసీగా ఉన్న తుమ్మల మహేశ్వర్‌రెడ్డి 2023లో ఓ ప్రమాదంలో మృతి చెందారు. అందుకే ఈ స్థానం కోసం ఉప ఎన్నిక జరిగింది. అధికారంలో ఉన్న టీడీపీ, అధికారం కోల్పోయిన వైసీపీ రెండు పార్టీలు కూడా ఈ పులివెందల జడ్పీటీసీ ఉపఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. హోరాహోరీగా ప్రచారం చేశాయి. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. పులివెందుల గడ్డ వైసీపీ అడ్డా అంటూ ఆపార్టీ రాష్ట్ర స్థాయి నేతలంతా వచ్చి ప్రచారం చేశారు. 

పులివెందుల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి వ్యూహాన్ని ఈ ఎన్నికల నుంచే అమలు చేయాలని భావించి టీడీపీ అందుకు తగ్గట్టుగా ప్లాన్ చేసింది. ఈ ఎన్నికల పూర్తి బాధ్యతను ఇద్దరు మంత్రులు, ఇతర సీనియర్ నేతలపై పెట్టింది. నిత్యం వారు పులివెందుల ప్రజల్లోనే ఉంటూ గెలుపు ప్రణాళికలను అమలు చేసారు. జగన్‌కు వ్యతిరేకంగా ఉన్న వర్గాలను చేరదీశారు. వైఎస్ కుటుంబంలోనే జగన్ అంటే పడని వారిని తమవైపు తిప్పుకున్నారు. ఇలా ఆరు నెలలుగా అక్కడ ఆపరేషన్ పులివెందుల చేపట్టారు. అందుకు తగ్గ ఫలితాన్ని రాబట్టారు. 

Image

అధికారులను, పోలీసులను విచ్చలవిడిగా పార్టీ కార్యకర్తల మాదిరిగా వాడుకున్న టీడీపీ పులివెందులలో అరాచకంగా ఎన్నికలు నిర్వహించిందని వైసీపీ ఆరోపించింది. నిజమైన ఓటర్లు ఓట్లు వేసుకోలేని విధంగా బూత్ క్యాప్చర్ చేసిందని మండిపడింది. అందుకు తగ్గట్టుగానే కొందరు వ్యక్తులు మీడియాతో మాట్లాడించారు. అటు టీడీపీ కూడా వాళ్లకు కౌంటర్ ఇచ్చింది. దశాబ్ధాలుగా ప్రజలను, నాయకులను బెదిరించి ఏకగ్రీవాలు చేసుకుంటూ వచ్చిన వైసీపీ ఇప్పుడు ఎన్నికలు జరుగుతుంటే తట్టుకోలేకపోతోందని మండిపడింది. వైసీపీ అరాచకాలను పోలీసులు అడ్డుకోవడంతో ప్రజలంతా ప్రశాంతంగా వచ్చి ఓటు వేశారని అన్నారు. ఇంకా చాలా మంది రావాల్సి ఉండేదని కానీ వైసీపీ నేతల బెదిరింపులకు భయపడిపోయారని అంటోంది. 

పులివెందులలో టీడీపీ అరాచకాలు చేస్తోందని ఆరోపిస్తున్న వైసీపీ నేతలకు గతాన్ని గుర్తు చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ప్రాంతంలో కూడా ప్రత్యర్థులు కనీసం నామినేషన్‌ వేసే అవకాశం లేకుండా చేశారని చెబుతున్నారు. నాడు వైసీపీ నేతలు చేసింది తక్కువ కాదని చెబుతున్నారు. నాడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచారానికి వెళ్లినా కూడా రానివ్వకుండా చేసిన విషయాన్ని మర్చిపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. 

పులివెందులలో విజయం సాధించిన టీడీపీ వచ్చే ఎన్నికలలో అసెంబ్లీలో గెలుస్తామని చెప్పడం అతి విశ్వాసం అవుతుంది. ఎందుకంటే గత స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వైసీపీ ఇలాంటి ప్రయత్నం చేసి బోల్తా పడింది. కుప్పంలో అన్ని లోకల్ బాడీ ఎన్నికల్లో విజయం సాధించింద. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోతారని ప్రచారం చేసింది. అప్పుడు మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడే మకాం వేసి చంద్రబాబును దెబ్బతీసేందుకు ప్రయత్నించారు. కానీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి సీన్ తిరిగబడింది. కుప్పంలో కాదు రాష్ట్రవ్యాప్తంగా వైసీపీని ప్రజలు తిరస్కరించారు. కేవలం 11 సీట్లే కట్టబెట్టారు. 

ఆ విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు పెట్టుకొని మసులుకోవాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల జయాపజయాలు కేవలం స్థానికంగా ఉండే రాజకీయ సమీకరణాలను ఆధారంగా చేసుకొని ఉంటాయి. అంతే కాకుండా అధికారంలో ఉన్న పార్టీకి కొద్దోగొప్ప అనుకూలంగా ఉంటాయి. అంత మాత్రాన నాలుగేళ్ల తర్వాత జరగబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తామని చెప్పుకోవడం అతి విశ్వాసం అవుతుంది. ఈ దెబ్బకు వైసీపీ ఢీలా పడుతుందని ఆ పార్టీ పని అయిపోయిందనే ఆలోచన సరికాదని అంటున్నారు. గత లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా టీడీపీ పని అయిపోయిందని వైసీపీ నేతలు స్టేట్మెంట్‌లు పాస్ చేశారు. ఇప్పుడు వారంతా ఏ పరిస్థితుల్లో ఉన్నారో అందరికీ తెలిసిందే. ఈ విజయం మెట్టుగా ఉపయోగపడుతుంది. అలానే చూడాలని అంటున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
Viral Video: ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
Sircilla Sarpanchs: సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
Prashant Kishor: దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?

వీడియోలు

Mancherial Durga Idol Viral Video | మంచిర్యాల గోదావరీ తీరాన బయటపడిన అమ్మవారు | ABP Desam
India vs South Africa 3rd T20 Records | మూడో టీ20లో 5 పెద్ద రికార్డులు
Hardik Pandya Records in 3rd T20 | చరిత్ర సృష్టించిన హార్దిక్
Shubman Gill in Ind vs SA 3rd T20 | మళ్లీ విఫలమైన శుభ్మన్ గిల్
Suryakumar Yadav about His Batting | తన ఫార్మ్ పై వరుస క్లారిటీ ఇచ్చిన సూర్య

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
Viral Video: ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
Sircilla Sarpanchs: సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
Prashant Kishor: దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
EPFO Update: ఇకపై ఎలాంటి కారణం లేకుండా PFలోని 75% డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు! ప్రభుత్వ కొత్త నియమం తెలుసుకోండి
ఇకపై ఎలాంటి కారణం లేకుండా PFలోని 75% డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు! ప్రభుత్వ కొత్త నియమం తెలుసుకోండి
IPS officer Sanjay: ప్రభుత్వం నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్‌ సంజయ్‌కు బెయిల్‌ మంజూరు!
ప్రభుత్వం నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్‌ సంజయ్‌కు బెయిల్‌ మంజూరు!
Axar Patel Ruled Out : భారత జట్టు నుంచి ఆల్ రౌండర్ అవుట్, దక్షిణాఫ్రికాతో నాల్గో టీ20 మ్యాచ్ ఆడే జట్టు ఇదే!
భారత జట్టు నుంచి ఆల్ రౌండర్ అవుట్, దక్షిణాఫ్రికాతో నాల్గో టీ20 మ్యాచ్ ఆడే జట్టు ఇదే!
UP bride: పెళ్లి మండపంలో కారు డిమాండ్ చేసిన వరుడు - పెళ్లి రద్దు చేసుకున్న వధువు -అచ్చం సినిమాలో జరిగినట్లే
పెళ్లి మండపంలో కారు డిమాండ్ చేసిన వరుడు - పెళ్లి రద్దు చేసుకున్న వధువు -అచ్చం సినిమాలో జరిగినట్లే
Embed widget