అన్వేషించండి

Pulivendula ZPTC by-election : పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికల్లో టీడీపీ ఘన విజయం- డిపాజిట్ కోల్పోయిన వైసీపీ అభ్యర్థి 

Pulivendula ZPTC by-election : పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి లతా రెడ్డి ఆరువేలకుపైగా మెజార్టీతో గెలిచారు. వైసీపీ అభ్యర్థి డిపాజిట్‌ కోల్పోయారు.  

Pulivendula ZPTC by-election: పులివెందుల జడ్పీటీసీలో టీడీపీ పాగా వేసింది. రెండు రోజుల క్రితం జరిగిన ఉపఎన్నికల్లో విజయం సాధించింది. ఏడు వేలకుపైగా ఓట్లు పోలైతే టీడీపీ అభ్యర్థి లతారెడ్డికి భారీగా ఓట్లు వచ్చాయి. దీంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. 

అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్ని ఫలితాలు వచ్చాయి. ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది. ఇందులో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించారు. మొత్తం 7614 ఓట్లు పోలైతే... అందులో 6735 ఓట్లు టీడీపీ అభ్యర్థి లతారెడ్డికే వచ్చాయి. వైసీపీ అభ్యర్థి హేమంత్‌రెడ్డికి 685 ఓట్లు మాత్రమే పడ్డాయి. దీంతో ఆయన డిపాజిట్ కోల్పోయాయి. లతారెడ్డి 6వేలకుపైగా మెజార్టీతో విజయం సాధించారు.  

పేరుకే పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నిక. కానీ అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా వైసీపీ, టీడీపీ వ్యూహాలతో రాజకీయాన్ని వేడెక్కించాయి. పార్టీలు మారడాలు, డబ్బుల పంపిణీ, కొట్లాటలు ఇలా చాలా సీన్‌లు ఈ ఎన్నికల్లో కనిపించాయి. అందుకే నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఈ ఎన్నికలపై యావత్ రాష్ట్రం ఆసక్తిగా గమనించింది. పోలింగ్ రోజు అయితే రణరంగాన్నే తలపించాయి పరిస్థితులు. టీడీపీతో కుమ్మక్కైన అధికారులు ఓటర్లను బెదిరించి రిగ్గింగ్‌కు పాల్పడినట్టు వైసీపీ ఆరోపిస్తూ వచ్చింది. అధికార పార్టీ గెలవచ్చేమో కానీ ప్రజాస్వామ్యం ఓడిపోయిందంటూ ఎద్దేవా చేసింది. దానికి టీడీపీ నుంచి కూడా అదే స్థాయిలో కౌంటర్‌లు పడ్డాయి. 

ఇలా ఇరువైపుల నుంచి పరిస్థితి హాట్ హాట్‌గా ఉన్నటైంలోనే ఇవాళ ఉదయం నుంచి కౌంటింగ్‌  ప్రారంభమైంది. కడప శివారులో ఉన్న ఉర్దూనేషనల్ యూనివర్శిటీలో అధికారులు లెక్కింపు చేపట్టారు. ముందు అభ్యర్థులు, ఏజెంట్లు సమక్షంలో బ్యాలెట్‌ పత్రాలను కట్టలుగా కట్టారు. అనంతరం లెక్కింపు చేపట్టారు. ఇందులో టీడీపీ అభ్యర్థి విజయం సాధించినట్టు అధికారులు ప్రకటించారు. 

ఈ విజయంతో పులివెందులలో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి జై టీడీపీ అంటూ నినాదాలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నేతలు జగన్ మోహన్ రెడ్డి మారాల్సిన టైం వచ్చిందని అన్నారు. అనవసరమైన ఆరోపణలు చేయడం మాని వాస్తవాలు తెలుసుకోవాలని అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవానికి ఒక్కరోజు ముందే పులివెందులకు స్వేచ్ఛ వచ్చిందని అభిప్రాయపడ్డారు. నలభై ఏళ్లుగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పోలింగ్ జరగకుండా అడ్డుకుంటా వచ్చారని ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో ఆ కోపాన్ని ప్రజలు చూపించారన్నారు. 

పులివెందులలో విజయం గెలుపే కాదని దొంగఓట్లతో గెలిచారని ఆరోపిస్తోంది వైసీపీ. అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగలేదని విమర్శిస్తోంది. ఒక్కొక్కరితో కనీసం ఇరవై నుంచి ముఫ్పై ఓట్లు వేశామని చెబుతున్నారని ఓ ఫోన్ ఆడియోను తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో పెట్టింది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే ఈ దుష్ట సంప్రదాయానికి చంద్రబాబు,టీడీపీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది.  

అధికారులు కూడా టీడీపీతో కుమ్మక్కై రిగ్గింగ్‌కు పాల్పడ్డారని, నిజమైన ఓటర్ల వద్ద స్లిప్‌లు లాక్కొని ఓట్లు వేశారని ఆరోపించింది.ఇదీ ఓ గెలుపేనా అంటూ ఎద్దేవా చేస్తోంది. గెలుపుపై అంత ధీమా ఉంటే కేంద్ర బలగాల సహాయంతో మరోసారి పోలింగ్ పెట్టాలని బుధవారం జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. 

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Bonda Uma TDP: అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ - త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Bonda Uma TDP: అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ - త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
BCCI Coaching Sack: టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
Healthy Night Routine : మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే
మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే
Uday Krishna Reddy Arrest: పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
PCOS vs Iron Deficiency : PCOS ఉంటే ఐరన్ తగ్గిపోతుందా? రెండింటి మధ్య సంబంధం ఏంటి? గైనకాలజిస్ట్ సూచనలివే
PCOS ఉంటే ఐరన్ తగ్గిపోతుందా? రెండింటి మధ్య సంబంధం ఏంటి? గైనకాలజిస్ట్ సూచనలివే
Embed widget