అన్వేషించండి

పవన్ స్వరంలో మార్పు- పదే పదే అదే మాట- జనసైనికులు ఫుల్‌ హ్యాపీ

ఏపీ రాజకీయాల్లో ప్రధాన పోటీ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం మధ్యే అన్నది ఎవరు అవునన్నా కాదన్న అంగీకరించాల్సిన సత్యం. కానీ ఆ రెండు పార్టీలను ప్రభావితం చేసేది మాత్రం ఓవైపు జనసేన, మరోవైపు బీజేపీ.

ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోనివ్వను... ఇది మొన్నటి వరకు పవన్ కల్యాణ్ నోటి వెంట వచ్చిన మాట. నేను ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు సిద్ధం... ఇది నేడు చేస్తున్న కామెంట్. అసలు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు చాలా డైనమిక్‌గా ఉంటున్నాయి. ఏ గంటకు ఏం జరుగుతుందో అంత ఈజీగా అంచనాకు అందడం లేదు. 

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ప్రధాన పోటీ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం మధ్యే అన్నది ఎవరు అవునన్నా కాదన్న అంగీకరించాల్సిన సత్యం. కానీ ఆ రెండు పార్టీలను ప్రభావితం చేసేది మాత్రం ఓవైపు జనసేన, మరోవైపు బీజేపీ. అందుకే రెండు ప్రధాన పార్టీల భవిష్యత్‌, వారి గెలుపోటములు మాత్రం నిర్ణయించేది ఈ పార్టీలే. అందుకే బీజేపీ, జనసేన ఏం చేసినా పొలిటికల్ సర్కిల్‌లో మోతమోగిపోతుంటుంది. మొన్న బీజేపీ అగ్రనేతల మీటింగ్‌ నుంచి ఇవాళ్టి వారాహి యాత్ర వరకు ఏదైనా సరే టీడీపీ, వైసీపీతో ముడిపెట్టి విశ్లేషించాల్సిందే. 

వారహి యాత్రతో ఎవరికి నష్టం, ఎవరికి లాభం అనే చర్చ ఇప్పట్లో అంచనా వేయడం కష్టమే కానీ... ఈ యాత్ర సందర్భంగా పవన్ కల్యాణ్ చేస్తున్న కామెంట్స్ మాత్రం పెద్ద చర్చకే దారి తీస్తున్నాయి. మూడు రోజుల నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో యాత్ర చేస్తున్న పవన్ స్పీచ్‌లో చాలా మార్పు వచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 

మొన్నటి వరకు వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వను అంటూ బల్లగుద్ది మరీ చెప్పిన పవన్ కల్యాణ్‌ ఆ డైలాగ్‌నే మర్చిపోయారనే టాక్‌ నడుస్తోంది. మొన్నటి వరకు ఏ సభ పెట్టినా ఎక్కడ ప్రెస్‌మీట్‌ పెట్టినా, ఏ వేదికపై మాట్లాడినా ఇదే విషయాన్ని పదే పదే చెప్పేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ డైలాగ్ పెద్దగా వినిపించడం లేదు. తాను ఒంటరిగా పోటి చేస్తానో... కలిసి పోటీ చేస్తానో అంటూ కన్ఫ్యూజింగ్ స్టేట్‌మెంట్ ఇస్తున్నారు. కచ్చితంగా పొత్తులతో వెళ్తామని చెప్పిన జనసేనాని ఇప్పుడు సడెన్‌గా మాట ఎందుకు మార్చారనేది అంతుబట్టడం లేదు. 

పార్టీ బలంపై ప్రాక్టికల్‌గా ఉండాలని ఓసారి శ్రేణులకు దిశానిర్దేశం చేశారు పవన్ కల్యాణ్. తాను ముఖ్యమంత్రిగా అయిపోవాలంటే రాష్ట్రవ్యాప్తంగా 175 స్థానాల్లో పోటీ చేసి గెలిచే సత్తా ఉండాలంటూ చెప్పుకొచ్చారు. ఆ స్థాయిలో పార్టీ బలోపేతం లేనప్పుడు నినాదాలు చేసినంత మాత్రాన సీఎంలు అయిపోరని కామెంట్ చేశారు. తనకు ఆ కోరిక లేదని ప్రస్తుతానికి రాష్ట్రాన్ని రాక్షస పాలన నుంచి రక్షించడమే తన కర్తవ్యమని అన్నారు. జనసైనికులకు గౌరవం దక్కేలా చూసుకునే బాధ్యత తనదని కూడా భరోసా ఇచ్చారు. అందుకే ప్రభుత్వ ఓటు చీలిపోకుండా చూస్తనని పొత్తులతో పోటీ ఉంటుందని కూడా మాట్లాడారు. 

ఇప్పుడు ఆ ప్రస్తావనే తీసుకురావడం లేదు. తాను ముఖ్యమంత్రి అయ్యేందుకు సిద్ధమని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీకి సంపూర్ణ మద్దతు ఇచ్చి ముఖ్యమంత్రి స్థానం ఇవ్వగలిగితే ఏపీని దేశంలోనే ఉన్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని పవన్ అంటున్నారు. దశాబ్దం తర్వాత అన్ని అంశాలపై పూర్తి అధ్యయనం చేసి, సంపూర్ణ అవగాహనతో ఈ మాట చెబుతున్నాను అని వ్యాఖ్యలు చేస్తున్నారు. రాష్ట్ర బాధ్యత తీసుకోవడానికి తాను సంసిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. జనసేన ప్రభుత్వంలో సురక్ష ఆంధ్రప్రదేశ్‌ను సాధించి తీరుతామన్నారు. 

పవన్ కామెంట్స్‌కు కారణమేంటి
పవన్‌పై వైసీపీ ఒకే రకమైన దాడి చేస్తోంది. టీడీపీని గెలిపించడానికే జనసేన వచ్చిందని విమర్సలు చేస్తున్నారు. చంద్రబాబుకు పవన్ కల్యాణ్ దత్తపుత్రుడని కూడా సీఎం స్థాయి వ్యక్తి కామెంట్ చేస్తున్నారు. ఎప్పుడు చంద్రబాబుకు కష్టం వచ్చినా పవన్ రంగంలోకి దిగుతాడనే విమర్శను చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది వైసీపీ. అందుకే పవన్ రూట్ మార్చారా అనే విశ్లేషణ కూడా ఉంది. 

తనకు సీఎం పదవిపై ఆలోచన లేదని.... పొత్తులతో రాజకీయం చేస్తాంటూ గతంలో పవన్ చేసిన కామెంట్స్‌పై జనసైనికులే చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎప్పుడూ వేరే పార్టీలకు భుజం కాయడమేనా అంటూ విమర్శలు చేశారు. ఇది కూడా పవన్ కల్యాణ్‌లో మార్పునకు కారణమైందనే చెప్పాలి. ముందు పార్టీని బలోపేతం చేసి కేడర్‌ను స్టేబుల్ చేసుకుంటే తర్వాత రాజకీయం చేయవచ్చనే అంచనాకు పవన్ కల్యాణ్ వచ్చినట్టు తెలుస్తోంది. జనసైనికుల్లో తనపై నమ్మకాన్ని కలిగించగలిగితే మంచిదని ఆయన భావించినట్టు తెలుస్తోంది. 

ఇప్పటి వరకు పవన్‌లో రాజకీయంగా స్థిరత్వం లేదని విమర్శ గట్టిగానే ఉంది. అందుకే ఆయనకు ఫ్యాన్ బేస్డ్‌ కేడర్ ఉంది కానీ అది ఓట్లగా మారడం లేదన్నది మరో విశ్లేషణ. అందుకే జనసేన కొన్ని ప్రాంతాల్లో బలంగా కనిపించినా మరికొన్ని ప్రాంతాల్లో చాలా బలహీనంగా ఉందని చెప్పక తప్పదు. వేరే పార్టీ గెలుపు ఓటములను డిసైడ్ చేసే సత్తా ఉన్నప్పటికీ... తమ పార్టీ అభ్యర్థులను గెలిపించే ఓటు బ్యాంకు మాత్రం కూడగట్టుకోలేకపోయింది. అందుకే ఇప్పుడు పవన్‌ స్పీచ్‌లో మార్పు వచ్చిందని అంటున్నారు. 

మరోవైపు అమిత్‌షా, చంద్రబాబు భేటీ కూడా పవన్‌లో మార్పునకు కారణమై ఉంటుందనే వాదన ఉంది. ఆ రోజు ఆ సమావేశంలో ఏం జరిగిందో తెలియదు కానీ ఏపీ పొలిటికల్‌ వెదర్‌లో మాత్రం చాలా మార్పులు కనిపిస్తున్నాయి. అదే టైంలో పవన్ కల్యాణ్ మాటల్లో వచ్చిందంటున్నారు. పవన్ స్పీచ్‌ ఇప్పుడు జనసైనికుల్లో ఉత్సాహం నింపుతోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Weather Latest Update: ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
Revanth Gift to Chandrababu: భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Weather Latest Update: ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
Revanth Gift to Chandrababu: భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
IND vs ZIM 1st T20I : విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌
విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌
AP Crime: మైనర్ బాలికను కత్తితో నరికి హత్య చేసిన యువకుడు, హోం మంత్రి అనిత సీరియస్
మైనర్ బాలికను కత్తితో నరికి హత్య చేసిన యువకుడు, హోం మంత్రి అనిత సీరియస్
Bajaj Freedom CNG Vs Honda Shine: బజాజ్ ఫ్రీడమ్ సీఎన్‌జీ 125 వర్సెస్ హోండా షైన్ 125 - రోజువారీ వాడకానికి రెండిట్లో ఏది బెస్ట్?
బజాజ్ ఫ్రీడమ్ సీఎన్‌జీ 125 వర్సెస్ హోండా షైన్ 125 - రోజువారీ వాడకానికి రెండిట్లో ఏది బెస్ట్?
Raj Tarun Case: రాజ్‌ తరుణ్‌ - లావణ్య కేసు - స్పందించిన మాల్వీ మల్హోత్రా, ప్రియురాలిపై పోలీసులకు ఫిర్యాదు 
రాజ్‌ తరుణ్‌ - లావణ్య కేసు - స్పందించిన మాల్వీ మల్హోత్రా, ప్రియురాలిపై పోలీసులకు ఫిర్యాదు 
Embed widget