KTR vs Kavitha political war: కవిత వర్సెస్ కేటీఆర్ - ఈ రాజకీయం బీఆర్ఎస్ పునాదుల్ని కదిలించబోతోందా?
Kalvakuntla family internal dispute : బీఆర్ఎస్ పార్టీపై కవిత పగబట్టినట్లుగా కనిపిస్తోంది. తనకు పార్టీ పేరు కూడా పెట్టుకోనీయకుండా చేస్తున్న తీరుపై ఆమె అసహనం చెందినట్లుగా కనిపిస్ోదంది.

BRS corporate commissions from Andhra contractors: తెలంగాణ ప్రాంతీయ రాజకీయాల్లో గులాబీ గూటి పంచాయితీ ఇప్పుడు ఊహించని మలుపు తిరిగింది. సొంత పార్టీ పెట్టుకున్న కల్వకుంట్ల కవిత ఇప్పుడు భారత రాష్ట్ర సమితి అగ్ర నాయకత్వంపై, ముఖ్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లక్ష్యంగా కల్వకుంట్ల కవిత చేస్తున్న ఆరోపణలు రాజకీయ గీతల్ని దాటిపోతున్నాయి. నిన్నమొన్నటి వరకు రాజకీయ ఆరోపణలు చేసిన కవిత.. ఈసారి నేరుగా బీఆర్ఎస్ బ్యాంక్ అకౌంట్లలో ఉన్న పార్టీ ఫం, క్విడ్ ప్రో కో వ్యవహారాలను వీధిలోకి లాగడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. పా
ఆంధ్రా కాంట్రాక్టర్ల కమిషన్లు.. రూ.1400 కోట్ల గుట్టు!
బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల అధికార కాలంలో కూడబెట్టిన రూ.1400 కోట్ల నిధులపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజల సొమ్మును గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రా కాంట్రాక్టర్లకు దోచిపెట్టారని, దానికి ప్రతిఫలంగా ఆ కాంట్రాక్టర్ల నుండి భారీగా కమిషన్లు వసూలు చేసి బీఆర్ఎస్ పార్టీ ఫండ్గా మార్చారని ఆమె నేరుగానే ఆరోపిస్తున్నారు. సొంత పార్టీ అధినాయకత్వంపైనే ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక మూలాలపై దాడి చేయడం, అది కూడా క్విడ్ ప్రో కో కోణంలో మాట్లాడటం సాధారణ విషయం కాదు. ఈ ఆరోపణలు ప్రత్యర్థి పార్టీలకు బలమైన అస్త్రాలుగా మారే ప్రమాదం ఉంది.
సొంత విమానం నుంచి పయనీర్ పత్రిక కొనుగోలు వరకు..
గతంలో బీఆర్ఎస్ పార్టీ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు ఒక సొంత విమానాన్ని కొనుగోలు చేసిందనే ప్రచారం విస్తృతంగా సాగింది. ఆ వివాదం అలా ఉంచితే, తాజాగా జాతీయ ఆంగ్ల దినపత్రిక ది పయనీర్’ ను కూడా పార్టీ నిధులతోనే కొనుగోలు చేశారంటూ కవిత సరికొత్త బాంబు పేల్చారు. తనను పార్టీ నుంచి వెళ్లిపోయేలా చేసి.. వందల కోట్ల పార్టీ ధనాన్ని వాడుకుంటూ కేటీఆర్ తన సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్నారని, మీడియా సంస్థలను చేతుల్లోకి తీసుకుని బలపడుతున్నారనే ఆవేదన, ఆగ్రహం కవిత మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
పార్టీ గుర్తు రాకుండా చేస్తోంది కేటీఆరేనని ఆగ్రహం
పార్టీలో తనకు ప్రాధాన్యత లేకపోవడంతో కవిత తెలంగాణ రక్షణ సేన..టీఆర్ఎస్ అని పేరుతో పార్టీ పెట్టుకున్నారు. కానీ కేటీఆర్ ఆ పేరు రాకుండా పెద్ద ఎత్తున లాబీయింగ్ చేశారని కవిత నమ్ముతున్నారు. తెలంగాణ సెంటిమెంట్ బలాన్ని తాను పొందేందుకు, గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ను సమీకరించుకునేందుకు తాను కొత్తగా టీఆర్ఎస్ పేరుతో పొలిటికల్ ప్లాట్ఫారమ్ను పునరుద్ధరించాలని చేస్తున్న ప్రయత్నాలను కేటీఆర్ తీవ్రంగా అడ్డుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ పేరును తానే రిజిస్టర్ చేయించుకుని కవితకు చెక్ పెట్టాలని కేటీఆర్ చూడటంతో ఆమెలో అసహనం కట్టలు తెంచుకుంది. అటు సెంటిమెంట్ పేరు దక్కకపోవడంతో.. నైతికంగా దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
నైతికంగా దెబ్బతిన్న బీఆర్ఎస్.. కోలుకోవడం కష్టమేనా?
రాజకీయాల్లో ప్రత్యర్థులు చేసే ఆరోపణలకు, సొంత కుటుంబ సభ్యులు.. అదీ మాజీ ముఖ్యమంత్రి కూతురు చేసే ఆరోపణలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. కవిత చేసిన ఈ క్విడ్ ప్రో కో, రూ.1400 కోట్ల కమిషన్ల ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీని నైతికంగా కోలుకోలేని దెబ్బతీసే అవకాశం ఉంది. గతంలో కేసీఆర్ అవినీతి రహిత పాలన అందించారని చెప్పుకునే గులాబీ శ్రేణులకు ఇప్పుడు ఈ ఆరోపణలు మింగుడుపడటం లేదు. చెల్లెలి ఆరోపణలపై కేటీఆర్ ఎలా స్పందిస్తారు? లేదా దీనిని కేసీఆర్ ఎలా సర్దుబాటు చేస్తారు? అనే దానిపైనే బీఆర్ఎస్ భవిష్యత్తు ఆధారపడి ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















