అన్వేషించండి

TRS Chief Kavitha Comments: బీఆర్ఎస్ ఖాతాలో రూ.1,400 కోట్ల అవినీతి సొమ్ము! టీఆర్‌ఎస్‌పై కుట్రలు! 20 నుంచి నిరవధిక దీక్ష! కవిత కీలక ప్రకటన! 

TRS Chief Kavitha Comments: బీఆర్ఎస్ ఖాతాలో రూ.1,400 కోట్ల అవినీతి సొమ్ము ఉందని దాన్ని వెంటనే అమరవీరులకు పంచాలని టీఆర్‌ఎస్ చీఫ్‌ డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్‌లోకి వెళ్లే ప్రసక్తి లేదని తేల్చేశారు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • బీఆర్ఎస్ రూ.1,400 కోట్లు అమరవీరులకు పంచాలని కవిత డిమాండ్.
  • బీఆర్ఎస్‌కు మళ్లీ వెళ్లే ప్రసక్తే లేదని కవిత స్పష్టం చేశారు.
  • కేటీఆర్ అవినీతి, పయనీర్ కొనుగోళ్లపై తీవ్ర ఆరోపణలు చేశారు.
  • సింగరేణి కార్మికుల కోసం 20 నుండి నిరవధిక దీక్ష ప్రకటించారు.

TRS Chief Kavitha Comments: సింగరేణిలో పర్మినెంట్, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై  మీడియాతో మాట్లాడిన టీఆర్‌ఎస్ చీఫ్‌ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఖాతాలో రూ.1,400 కోట్ల అవినీతి సొమ్ము ఉందని అన్నారు. దీన్ని వెంటనే అమరవీరుల కుటుంబాలకు పంచాలని డిమాండ్ చేశారు. తన కంఠంలో ప్రాణం ఉండగా మళ్లీ బీఆర్ఎస్‌లోకి వెళ్లేది లేదన్నారు. తాను మళ్లీ బీఆర్ఎస్‌లోకి వెళ్తానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సింగరేణి కార్మికులకు కోసం 20వ తేదీ నుంచి నిరవధిక దీక్ష చేస్తున్నట్టు ప్రకటించారు.   

టీఆర్ఎస్ అనే పేరు తనకు రాకుండా ఉండాలనే కుట్రతో ఈసీకి వెయ్యికి పైగా కంప్లైంట్స్ బీఆర్‌ఎస్ ఇచ్చిందని చెప్పారు. భయం లేదంటూనే  కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. నా ప్రజా పోరాటాలను ప్రజల్లోకి వెళ్లకుండా కాంగ్రెస్, బీజేపీతో చేతులు కలుపుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఒక నీతి, నియమం అంటూ ఏమీ లేవా అని ప్రశ్నించారు. తల్లి, చెల్లె అనే సభ్యత మరిచి బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఇష్టానుసారం కామెంట్లు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. 

సభ్యత మరిచి తిడితే ఊరుకునేందుకు ఇది ఆంధ్రా కాదు, కాళ్లు విరగొట్టి చేతుల్లో పెడతాం బిడ్డా అని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కేటీఆర్ తన మిత్రుడు ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్‌కు క్విడ్‌ప్రొ కో ద్వారా అక్రమ పర్మిషన్లు ఇచ్చారని అన్నారు. "కాళేశ్వరం అవినీతిలో అనకొండ అయిన హరీశ్‌రావు నే బీఆర్ఎస్ ఇంకా ముందు పెడుతోంది. ఇక ఆ పార్టీ జీవితంలో బాగుపడదని స్పష్టమైంది. చేసిన అవినీతి, పెద్ద ఆయనకు అంటించిన అవినీతి మరకలు చాలవన్నట్లుగా మూడు నెలలు మంత్రి పదవి కావాలంట?. బీఆర్ఎస్ మీద కోపంతో కాళేశ్వరం నీళ్లను ముఖ్యమంత్రి ఎత్తిపోయటం లేదు. అర కిలోమీటర్ రాళ్ల కట్ట కడితే మొత్తం నీళ్లు ఎత్తిపోసుకోవచ్చు." అని అన్నారు. 

పార్టీ పెట్టుకొని తన పని తాను చేసుకుంటూ పోతున్నానని, ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ విషయంలో ఎక్కడ పర్సనల్ విషయాలు చెప్పలేదని కవిత అన్నారు. "పార్టీ పెట్టిన ఆరు నెలల వరకు అన్ని పార్టీల గురించి మాట్లాడి ఆ తర్వాత ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాను. కానీ నా పార్టీతో భయం లేదంటూనే బీఆర్ఎస్ వాళ్లు వెయ్యి కి పైగా ఈసీకి కంప్లైంట్స్ ఇచ్చారు. మా పార్టీకి సంబంధించిన వార్తలు రాసే వారికి గుంటనక్క ఫోన్లు చేస్తూ రాయవద్దని చెబుతోంది. అదే విధంగా 188 కోట్లు పెట్టి కేటీఆర్ ఇటీవలే పయోనీర్ అనే ఇంగ్లీష్ పేపర్ కొనుగోలు చేశాడు. క్విడ్ ప్రొకోలో భాగంగా తన మిత్రుడు ప్రదీప్ కన్ స్ట్రక్షన్‌కు అక్రమంగా పర్మిషన్లు ఇచ్చి పెద్ద భవనాలు కట్టుకునే అవకాశం ఇచ్చాడు. 

డబ్బు ఉంటే సోషల్ మీడియా, మీడియాను కొనుగోలు చేసి మా వార్తలు రాకుండా చేయాలని చూస్తున్నారా?. పార్టీని జోడెద్దుల మాదిరిగా నడపాల్సిన వాళ్లే అంబోతుల్లాగా సిగ్గు లేని వ్యవహారాలు చేస్తున్నారు. అసలు బీఆర్ఎస్ పార్టీకి నీతి, నియమం, ఒక విధానం అంటూ లేకుండా చేస్తున్నారు. ఒక పార్టీ తన విధానాలు చెప్పుకుంటూ ప్రజా పోరాటాలు చేసుకునే హక్కు లేదా? మేము ఉద్యమకారుల గురించి పోరాటం చేస్తే ఆ వార్తలు రాకుండా ఫోన్లు చేసి అడ్డుకున్నారు. అంటే మీరు ఉద్యమకారులకు అన్యాయం చేస్తే...మేము పోరాటం చేయటం మీకు సమస్యగా మారిందా?"

"అసలు బీఆర్ఎస్ పార్టీ అకౌంట్‌లో ఉన్న 14 వందల కోట్ల రూపాయలు క్విడ్ ప్రొ కో ద్వారా వచ్చినవి కావా? మీ పార్టీలో అకౌంట్‌లో ఉన్న డబ్బును అమరవీరుల కుటుంబాలకు కోటి చొప్పున పంచాలని డిమాండ్ చేస్తున్నా. ఒక ఆడబిడ్డ ఒంటరిగా ధైర్యంగా పోరాటం చేస్తే ఇన్ని కుట్రలు చేస్తారా? ప్రజల కోసం పోరాటం చేయాలంటే ప్రజాబలం, గుండె బలం ఉండాలి. దమ్ముంటే నాతో పాటు ప్రజా సమస్యల పోరాటం విషయంలో పోటీ పడండి. నేను మళ్లీ బీఆర్ఎస్ లోకి వెళ్తానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మళ్లీ బీఆర్ఎస్ లో చేరేదే లేదు. ఫినిక్స్ సంస్థకు 80 వేల కోట్ల విలువైన భూములు కట్టబెట్టారు. వాడు ఆంధ్రావాడా? తెలంగాణ వాడా? ఆ సంస్థ వాడు 33 లక్షల టన్నుల కలప కొట్టేస్తున్నాడు. ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ పెట్టిన కేసులను కూడా మళ్లీ పట్టించుకోవటం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన భూమికి ఇంకా ఎక్కువగా ఈ ప్రభుత్వం కూడా భూమి ఇస్తోంది. అవినీతి విషయంలో బీఆర్ఎస్ కిటికీలు తెరిస్తే కాంగ్రెస్ తలుపులు తెరిచింది." 

కచ్చితంగా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వం అప్పన్నంగా అప్పగించిన భూములు అన్నింటిపైన రివ్యూ చేస్తామన్నారు. మొత్తం అవినీతిని కక్కిస్తామన్నారు. ఎవరినీ కూడా వదలిపెట్టబోమని చెప్పారు. ఈ రెండు పార్టీలకు అసలు ప్రజా అజెండా అనేదే లేదని మండిపడ్డారు. కేవలం దోచుకోవటం మీద దృష్టి ఉందని ఫైర్ అయ్యారు. "తెలంగాణ ఉద్యమం సమయంలో చిన్న కాంట్రాక్టర్లు, స్కూల్ యాజమాన్యాలు ఎంత ఖర్చు చేశారు. తెలంగాణ సాధించిన తర్వాత వారికి న్యాయం జరగాలని నేను బీఆర్ఎస్ లో ఉండి కొట్లాడాను. అప్పుడు కూడా ఉద్యమకారులు, కార్మికుల కోసం నేను ఫైట్ చేశాను. కార్మికులతో ఎవరున్నారో, కాంట్రాక్టర్లతో ఎవరున్నారో ప్రజలందరికీ తెలుసు. బీఆర్ఎస్‌లో ఉండి కూడా ఉద్యమకారుల కోసం వారి పక్షాన నిలబడ్డాను. కానీ వారికి అన్యాయం జరిగింది. అందుకే చాలా ఆవేదనతో చెబుతున్నా. బీఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో ఉన్న డబ్బును అమరవీరుల కుటుంబాలకు పంచాలి. 

Frequently Asked Questions

బీఆర్ఎస్ ఖాతాలో ఉన్న అవినీతి సొమ్ము గురించి కవిత ఏమన్నారు?

బీఆర్ఎస్ ఖాతాలో రూ.1,400 కోట్ల అవినీతి సొమ్ము ఉందని కవిత ఆరోపించారు. ఈ సొమ్మును అమరవీరుల కుటుంబాలకు పంచాలని ఆమె డిమాండ్ చేశారు.

కవిత బీఆర్ఎస్‌లో మళ్లీ చేరుతారా?

తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్‌లోకి మళ్లీ వెళ్లేది లేదని కవిత స్పష్టం చేశారు. తాను మళ్లీ బీఆర్ఎస్‌లోకి వెళ్తానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.

కేటీఆర్ అవినీతి గురించి కవిత ఏ ఆరోపణలు చేశారు?

కేటీఆర్ తన మిత్రుడు ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్‌కు క్విడ్‌ప్రొ కో ద్వారా అక్రమ పర్మిషన్లు ఇచ్చారని కవిత ఆరోపించారు. పెద్ద భవనాలు కట్టుకునే అవకాశం ఇచ్చారని చెప్పారు.

సింగరేణి కార్మికుల సమస్యలపై కవిత ఏం చేయనున్నారు?

సింగరేణిలో పర్మినెంట్, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై కవిత మాట్లాడారు. ఈ సమస్యల పరిష్కారం కోసం 20వ తేదీ నుంచి నిరవధిక దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
Telangana Family Register: ఇక తెలంగాణలో సులభంగా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ - SIRకి ఉపయోగం - ఓవైసీ కోరినందుకేనా?
ఇక తెలంగాణలో సులభంగా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ - SIRకి ఉపయోగం - ఓవైసీ కోరినందుకేనా?
Supreme Court On NEET Paper Leak: పేపర్ లీక్ ఆందోళనలో విద్యార్థులకు గుడ్‌న్యూస్.. కేసులు ఎత్తివేసి, విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు
పేపర్ లీక్ ఆందోళనలో విద్యార్థులకు గుడ్‌న్యూస్.. కేసులు ఎత్తివేసి, విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Advertisement

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget