అన్వేషించండి

Jogi Ramesh : జోగి రమేష్‌కు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ - కష్టాల్లో ఊరట లభించినట్లేనా ?

YSRCP : మైలవరం ఇంచార్జ్ గా జోగి రమేష్ ను జగన్ నియమించారు. గత ఎన్నికల్లో ఆయన అక్కడి నుంచే పోటీ చేయాలనుకున్నా.. పెనుమలూరు టిక్కెట్ ఇచ్చారు జగన్.

Jagan appointed Jogi Ramesh as Mylavaram in-charge : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైలవరం ఇంచార్జ్ గా జోగి రమేష్ ను నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకన్నారు. గత ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేసిన సర్నాల తిరుపతిరావును తొలగించారు. బీసీ వర్గానికి చెందిన ఆయనకు సామాజిక వర్గ సమీకరణాల్లో భాగంగా జగన్ టిక్కెట్ ఇచ్చారు. జడ్పీటీసీగా ఉన్న ఆయన గట్టి పోటీ ఇవ్వలేకపోయారు. అదే సమయంలో ఆయన ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండటంతో పార్టీ కార్యక్రమాలు కూడా నిర్వహించడం లేదు. ఇటీవల పార్టీ కార్యాలయాన్ని కూడా తీసేయడం వివాదాస్పదమయింది. చివరికి ఆయనను తప్పించాలని నిర్ణయించుకున్నారు. 

మైలవరం నుంచి పోటీ చేయాలనేది జోగి రమేష్ కోరిక                    

జోగి రమేష్ మొదటి నుంచి మైలవరం నియోజకవర్గంలోనే పని చేసుకునేవారు. 2014లో అదే నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత ప్రతిపక్షంలో ఉంటూ.. ఐదేళ్ల పాటు అదే నియోజకవర్గంలో పని చేసుకున్నాయి. అయితే 2019లో చివరి క్షణంలో వసంత కృష్ణ ప్రసాద్ పార్టీలోకి రావడంతో ఆయనకు మైలవరం టిక్కెట్ ఇచ్చి జోగి రమేష్ ను పెడన నియోజకవర్గానికి మార్చారు. వారిద్దరూ విజయం సాధించారు. అయితే ఆయన పెడన నుంచి మారిపోవాలని మళ్లీ మైలవరం నుంచి పోటీ చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు.  కానీ జగన్ మాత్రం ఆయనను పెడన నుంచి మార్చారు కానీ.. మైలవరం చాన్స్ ఇవ్వలేదు.. పెనుమలూరుకు మార్చారు. 

ఓర్వకల్లు, కొప్పర్తిలో ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీలకు కేంద్రం ఓకే: రామ్మోహన్‌ నాయుడు     

పెనుమలూరు టిక్కెట్ ఇచ్చినా గెలవలేకపోయిన జోగి రమేష్               

పెనుమలూరులో బోడె ప్రసాద్ చేతిలో జోగి రమేష్ ఘోర పరాజయం పాలయ్యారు. దాంతో ఆయన మళ్లీ తనకు మైలవరం ఇంచార్జ్ పదవి ఇవ్వాలని  గట్టిగా పట్టుబట్టారు. జగన్ ఆయన కోరికను మన్నించారు. పెనుమలూరు నియోజకవర్గానికి మరో నేత దేవభక్తుని చక్రవర్తిని ఇంచార్జ్ గా నియమించారు. ఆయన గత ఎన్నికల్లో పెనుమలూరు టిక్కెట్ కోసం గట్టిగానే ప్రయత్నించారు. కానీ ఇప్పుడు ఇంచార్జ్ అవకాశం లభించింది. పెనుమలూరు నుంచి గతంలో వైసీపీ తరపున పార్థసారధి విజయం సాధించారు. తర్వాత ఆయన పార్టీ టీడీపీ తరపున నూజివీడు నుంచి  పోటీ చేసి గెలిచారు. 

వైఎస్ఆర్‌సీపీలో రాజీనామాల విప్లవం - పెద్ద ఎత్తున రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్సీలు గుడ్ బై చెప్పే చాన్స్

పాత నియోజకవర్గాలు కోరుకుంటున్న వైసీపీ సీనియర్ నేతలు             

వైసీపీలో ఎన్నికలకు ముందు కీలక నేతల నియోజకవర్గాలను మార్పు చేశారు. దాదాపుగా యాభై, అరవై మందిని అటూ ఇటూ మార్చారు. వారెవరూ తమ తమ నియోజకవర్గాల్లో కుదురుకోలేకపోయారు. ఇప్పుడు మళ్లీ పాత నియోజకవర్గాల్లో రాజకీయాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే వారందర్నీ మళ్లీ ఇంచార్జులుగా నియమించేందుకు జగన్  ఆసక్తి చూపడం లేదు. ఓడిపోయిన వారు ఆయా నియోజవవర్గాలకు ఇంచార్జ్ లు గా ఉంటున్నారు. దీంతో కొత్త నియోజవకర్గాలకే ఇంచార్జులుగా ఉంటున్నారు. మార్పు కోసం హైకమాండ్ పై ఒత్తిడి తెస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

AP NDA Alliance: వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Embed widget