అన్వేషించండి

AP Social Media Arrests: ఏపీలో సోషల్ మీడియా అరెస్టులు - నాడు వైసీపీ చేసిందే నేడు టీడీపీ చేస్తోందా ?

Andhra Pradesh: ఏపీలో సోషల్ మీడియా పోస్టుల్లో రెచ్చిపోతున్న వైసీపీ కార్యకర్తలను వరుసగా అరెస్టులు చేస్తున్నారు. దీనిపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నాడు మీరు చేసిందేమిటని టీడీపీ ప్రశ్నిస్తోంది.

Andhra Politics: ఆంధ్రప్రదేశ్ లో కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత నాలుగు నెలల పాటు ఎలాంటి కక్ష సాధింపు రాజకీయాలకు చోటు లభించలేదు. వారు చేసినట్లే మేము ఎందుకు చేయాలని టీడీపీ నేతలు అనుకున్నారు.కూటమి నేతలు కూడా అదే అనుకున్నారు. కానీ అది చేతకానితనంగా భావించారేమో కానీ సోషల్ మీడియాలో కూటమి నేతలు, వారి కుటుంబాల్లోని మహిళలపై అత్యంత దారుణంగా పోస్టులు పెట్టడం ప్రారంభమయింది. ప్రశ్నించడం అంటే ఇంట్లో ఆడవాళ్లను బూతులు తిట్టడమే అన్నట్లుగా మారిపోయింది. ఇది కూటమి నేతలకు ఎలాంటి అసహనానికి గురి చేసిందంటే..  హోంమంత్రిత్వ శాఖపై డిప్యూటీ సీఎం ఫైర్ అయ్యేంత. ఆయన అలా అనగానే ఇలా అరెస్టుల పర్వం ప్రారంభమయింది. 

మహిళలపై అనుచిత వ్యాఖ్యలు స్వేచ్చ కాదు !

సోషల్ మీడియాలో అభిప్రాయాలు పెడితే ఎవరూ ఏమీ అనరు.కానీ అభిప్రాయం పేరుతో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం, ప్రభుత్వ పెద్దల కుటుంబాలను లాగి తీవ్ర పదజాలంతో దూషించడం వంటివి చేస్తే మాత్రం ఎవరూ సహించే అవకాశం ఉండదు. ఇప్పటికి మూడు నాలుగు సార్లు పలువురికి నోటీసులు ఇచ్చిన పోలీసులు  వారి దాడి తగ్గకపోవడంతో అరెస్టులు ప్రారంభించారు. వీరిలో ఓ నిందితుడ్ని ఎంపీ అవినాష్ రెడ్డి చొరవతో వదిలేసినట్లుగా ఆరోపణలు రావడంతో ఏకంగా ఎస్పీని బదిలీ చేశారు. అంటే ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. భావప్రకటనా స్వేచ్చ అంటే.. బూతులు తిట్టడం కాదని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

'నీకు దమ్ముంటే అవి రాసుకో' - జగన్, అవినాష్ ప్రోటోకాల్ పాటించరా?, కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్

విస్తృతంగా ఫేక్ న్యూస్ 

ఏపీలో జరుగుతున్న ప్రతి అంశంపైనా విస్తృతంగా ఫేక్ న్యూస్ స్పెడ్ అవుతూ ఉంటుంది. విజయవాడ వరదలపై జరిగిన తప్పుడు ప్రచారంపై మంత్రులంతా కలిసి ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చారు. అయినా ఆపకపోగా మీడియాలోనూ రావడంతో ఓ పత్రిక ఎడిటర్ పై కేసు పెట్టేశారు. అనేక మంది సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెట్టారు. ఫేక్ పోస్టులపై అనేక సార్లు ఫ్యాక్ట్ చెక్ డిపార్టుమెంట్ హెచ్చరికలు జారీ చేసింది. ఉద్దేశపూర్వకంగా  తప్పుడు ప్రచారం చేస్తే కేసులు పెడతామని హెచ్చరించింది.  ఇప్పుడు అలాగే కేసులు పెడుతున్నారు. 

Also Read: Eluru Bike Recovery: స్కూటీని హత్తుకుని మహిళ కన్నీళ్లు - ఆ కష్టం వెనుక కథ ఏంటంటే?, వైరల్ వీడియో

వైసీపీ హయాంలో టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అర్థరాత్రి తలుపులు బద్దలు కొట్టి అరెస్టు చేసి తీసుకుపోయేవారు. ఇలా మొత్తం మూడు వేల కేసులు నమోదు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు టీడీపీ కూడా అదే చేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది.  అయితే తాము నాలుగు నెలల పాటు సంయమనం పాటించామని అదే అలుసుగా తీసుకున్నారని ఇక సహించేది లేదని అంటున్నారు. సోషల్ రాజకీయంలో అసలు బాధితులుగా కార్యకర్తలే మిగులుతున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MLAs Disqualification Petitions: దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు భారీ ఊరట.. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ - బీఆర్ఎస్ ఆగ్రహం
దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు భారీ ఊరట.. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ - బీఆర్ఎస్ ఆగ్రహం
Kerala Assembly Elections 2026: కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
Telangana Politics: బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
Andhra Pradesh alliance Politics: ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?

వీడియోలు

Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు
BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం
Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gas Cylinder shortage: గ్యాస్ కొరతతో అయోధ్య సహా అనేక దేవాలయాల్లో అన్నదానం నిలిపివేత - మరి తిరుమల పరిస్థితి ఏమిటి?
గ్యాస్ కొరతతో అయోధ్య సహా అనేక దేవాలయాల్లో అన్నదానం నిలిపివేత - మరి తిరుమల పరిస్థితి ఏమిటి?
Good news for AP farmers: ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
Harish Rana Case : 13 ఏళ్లు మంచంపై ఉన్న హరీష్‌ రాణా కేసు సుప్రీంకోర్టుకు ఎలా చేరింది? బ్రెయిన్ డెడ్, PVS మధ్య తేడా ఏంటీ?
13 ఏళ్లు మంచంపై ఉన్న హరీష్‌ రాణా కేసు సుప్రీంకోర్టుకు ఎలా చేరింది? బ్రెయిన్ డెడ్, PVS మధ్య తేడా ఏంటీ?
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
First Euthanasia: ఏ దేశంలో తొలి కారుణ్యమరణం (Mercy Killing) అమలులోకి వచ్చింది? దాని బ్యాక్‌డ్రౌండ్ పూర్తి వివరాలివే
ఏ దేశంలో తొలి కారుణ్యమరణం (Mercy Killing) అమలులోకి వచ్చింది? దాని బ్యాక్‌డ్రౌండ్ పూర్తి వివరాలివే
Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
Hansika Divorce : భర్త సోహైల్‌తో హీరోయిన్ హన్సిక డివోర్స్ - నాలుగేళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్
భర్త సోహైల్‌తో హీరోయిన్ హన్సిక డివోర్స్ - నాలుగేళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Embed widget