అన్వేషించండి

YS Jagan and Sharmila : జగన్ , షర్మిల మధ్య రాజీ - ఏపీ రాజకీయాల్లో సంచలన మార్పులు ఖాయమా ?

Andhra Pradesh: జగన్ షర్మిల మధ్య రాజీ కుదిరిందన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సంపూర్ణంగా మారిపోయే అవకాశాలు ఉన్నాయి.

Compromise between Jagan and Sharmila : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన  మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి కారణం వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సోదరి ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల మధ్య రాజీ చర్చలు కొలిక్కి వస్తూండటమేనని చెబుతున్నారు. ఒకప్పుడు జగన్ అన్న వదిలిన బాణం అని ఉమ్మడి రాష్ట్రంలో వైసీపీ కోసం ప్రచారం చేసిన షర్మిల తర్వాత సొంత రాజకీయం ప్రారంభించారు. తెలంగాణలో పార్టీ పెట్టారు.  కానీ పెద్దగా ఫలితం ఉండదని అంచనాకు రావడంతో వ్యూహాత్మకంగా తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీ రాజకీయాల్లోకి వచ్చేశారు. అప్పట్నుంచి జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడుతూనే ఉన్నారు. గత ఎన్నికల్లో కడప జిల్లాల్లో కొన్ని స్థానాల్లో వైసీపీ ఓడిపోవడానికి కాంగ్రెస్ కారణంగా నిలిచింది. 

ఆస్తుల వివాదంతో ఇద్దరి మధ్య దూరం 

అన్నా చెల్లెళ్ల మధ్య ఎందుకు దూరం పెరిగిందన్నదానిపై ఎవరికీ స్పష్టత లేదు. అటు జగన్ కానీ ఇటు షర్మిల కానీ తమ మధ్య దూరం పెరగడానికి ఫలానా ఇష్యూ కారణం అని ఎప్పుడూ చెప్పుకోలేదు. కానీ పరోక్షంగా షర్మిల చేసిన కామెంట్ల వల్ల వారి మధ్య ఆస్తి గొడవలు ఉన్నాయన్న ప్రచారం ఉంది. ఆ లెక్క తేలకపోవడం, జగన్మోహన్ రెడ్డి ఆస్తిని పంచి ఇచ్చేందుకు నిరాకరించడంతో ఇద్దరి మధ్య సంబంధాలు తెగిపోయాయని అంటున్నారు. ఆ కోపంతోనే షర్మిల రాజకీయ ప్రవేశం చేశారన్న ప్రచారమూ ఉంది. అయితే షర్మిల మాత్రం ఇప్పుడు చాలా సీరియస్ గా రాజకీయాలు చేస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అనుకున్నంతగా ఓట్లు సాధించకపోయినా ఇప్పుడు యాక్టివ్ గా రాజకీయం చేస్తున్నారు. వైసీపీ కన్నా ఎక్కువగా ఆమె ఫీల్డ్ లో ఉంటున్నారు. ఎవరి రాజకీయం వారు చేసుకుంటున్నారు. 

దీపావళి నుంచి ఏపీలో కొత్త పథకం ప్రారంభం - మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్

కాంగ్రెస్‌కు దగ్గరయ్యేలా జగన్ వ్యూహాలు

అయితే ఎన్నికల్లో పరాజయం తర్వాత జగన్మోహన్ రెడ్డి షర్మిలతో రాజీకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరిగింది. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ ఎంత  బలపడితే వైసీపీకి అంత మైనస్ అవుతుంది. భవిష్యత్ లో రాబోయే సవాళ్లను తట్టుకోవాలంటే.. కాంగ్రెస్ నుంచి వచ్చే ముప్పును తప్ిపంచుకోవాలని జగన్ అనుకుంటున్నారని అందుకే ఆ  పార్టీతో సన్నిహిత సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ఢిల్లీలో జరిపిన ధర్నాకు కాంగ్రెస్ మద్దతు తెలియచేయలేదు కానీ.. ఇండియా కూడమి సభ్యులంతా వచ్చారు. ఇటీవల ఈవీఎంలపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను జగన్ సమర్థించారు. దీంతో ఆయన కాంగ్రెస్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం ఊపందుకుంది. అియతే ఇక్కడ ఏపీ పీసీసీ చీఫ్ గా ఉన్న షర్మిల ఆమోదం లేకపోతే ఆ దిశగా అడుగులు పడటం కష్టమేనంటున్నారు. 

ఏపీ రాజధాని అమరావతికి రూ.11,000 కోట్లు, ఫలించిన ప్రభుత్వం చర్చలు

సీరియస్‌గా రాజకీయం చేస్తున్న షర్మిల 

రాజీ చర్చలు జరుగుతున్నా రాజకీయంగా రాజీ పడేందుకు షర్మిల వెనక్కి తగ్గుతున్న సూచనలు కనిపించడం లేదు. టీడీపీ ప్రభుత్వంపై రాజకీయ విమర్శలు చేయాల్సి వస్తే ముందుగా జగన్ హయాంలో జరిగిన తప్పుల్ని వివరిస్తున్నారు. తర్వాత టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. తన టార్గెట్ ను ఎప్పుడూ మిస్ కానని ఆమె నేరుగా చెబుతున్నట్లవుతోంది. అయితే జగన్ తో ఏ మాత్రం రాజీ పడినట్లుగా  కనిపించినా లేదా రాజీ చర్చలు జరుగుతున్నట్లుగా బయటకు వచ్చినా అది తన రాజకీయ భవిష్యత్ పై ప్రభావం చూపుతుందని షర్మిల అనుకుంటున్నారు. ఆస్తుల గొడవను ఎలా పరిష్కరించుకున్నా లేకపోయినా.. తన రాజకీయం మాత్రం ఆగదనే సంకేతాలను షర్మిల ఇస్తున్నారని అనుకోవచ్చు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Medchal Crime News: ఆన్లైన్ గేమ్స్ మహమ్మారికి మరో కుర్రాడు బలి; డబ్బులు నష్టపోయి మేడ్చల్ యువకుడు ఆత్మహత్య
ఆన్లైన్ గేమ్స్ మహమ్మారికి మరో కుర్రాడు బలి; డబ్బులు నష్టపోయి మేడ్చల్ యువకుడు ఆత్మహత్య
Guntur Railway Station: గుంటూరు రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్-రేట్ చాలా తక్కువ!
గుంటూరు రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్-రేట్ చాలా తక్కువ!
జనానికి ఏథర్ షాక్‌: జనవరి 1 నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు రూ.3,000 వరకు పెంపు
2026 నుంచి ఎలక్ట్రిక్‌ స్కూటర్ల రేట్లు పెంపు - ఇప్పుడు కొంటేనే డబ్బులు ఆదా!
DGCA Committee Report: ఇండిగో విమానాలు ఎందుకు రద్దు అయ్యాయి? ప్రభుత్వానికి చేరిన DGCA కమిటీ నివేదిక!
ఇండిగో విమానాలు ఎందుకు రద్దు అయ్యాయి? ప్రభుత్వానికి చేరిన DGCA కమిటీ నివేదిక!

వీడియోలు

Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam
World Cup 2026 Squad BCCI Selectors | బీసీసీఐపై మాజీ కెప్టెన్ ఫైర్
Trolls on Gambhir about Rohit Form | గంభీర్ ను టార్గెట్ చేసిన హిట్ మ్యాన్ ఫ్యాన్స్
Ashwin about Shubman Gill T20 Career | మాజీ ప్లేయర్ అశ్విన్ సంచలన కామెంట్స్
India vs Sri Lanka 3rd T20 | నేడు భారత్‌, శ్రీలంక మూడో టీ20

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Medchal Crime News: ఆన్లైన్ గేమ్స్ మహమ్మారికి మరో కుర్రాడు బలి; డబ్బులు నష్టపోయి మేడ్చల్ యువకుడు ఆత్మహత్య
ఆన్లైన్ గేమ్స్ మహమ్మారికి మరో కుర్రాడు బలి; డబ్బులు నష్టపోయి మేడ్చల్ యువకుడు ఆత్మహత్య
Guntur Railway Station: గుంటూరు రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్-రేట్ చాలా తక్కువ!
గుంటూరు రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్-రేట్ చాలా తక్కువ!
జనానికి ఏథర్ షాక్‌: జనవరి 1 నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు రూ.3,000 వరకు పెంపు
2026 నుంచి ఎలక్ట్రిక్‌ స్కూటర్ల రేట్లు పెంపు - ఇప్పుడు కొంటేనే డబ్బులు ఆదా!
DGCA Committee Report: ఇండిగో విమానాలు ఎందుకు రద్దు అయ్యాయి? ప్రభుత్వానికి చేరిన DGCA కమిటీ నివేదిక!
ఇండిగో విమానాలు ఎందుకు రద్దు అయ్యాయి? ప్రభుత్వానికి చేరిన DGCA కమిటీ నివేదిక!
AI Impact In India:భారత్‌లో ఉద్యోగాలపై AI ప్రభావం ఉండదు! ఒకే క్లిక్‌లో పూర్తి వివరాలు తెలుసుకోండి!
భారత్‌లో ఉద్యోగాలపై AI ప్రభావం ఉండదు! ఒకే క్లిక్‌లో పూర్తి వివరాలు తెలుసుకోండి!
శాంసంగ్‌ ఫోల్డ్‌బుల్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌- లక్షన్నర రూపాయల ఫోన్‌పై 65000 తగ్గింపు
శాంసంగ్‌ ఫోల్డ్‌బుల్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌- లక్షన్నర రూపాయల ఫోన్‌పై 65000 తగ్గింపు
Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపై భారత్‌ ఆందోళన- హిందువులపై దాడులు ఆపాలని డిమాండ్
బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపై భారత్‌ ఆందోళన- హిందువులపై దాడులు ఆపాలని డిమాండ్
Mowgli 2025 OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'మోగ్లీ' - న్యూ ఇయర్ సర్ప్రైజ్... నెల రోజుల్లోపే కొత్త మూవీ స్ట్రీమింగ్
ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'మోగ్లీ' - న్యూ ఇయర్ సర్ప్రైజ్... నెల రోజుల్లోపే కొత్త మూవీ స్ట్రీమింగ్
Embed widget