అన్వేషించండి

YSRCP : నెల రోజులు విదేశాలకు వైఎస్ఆర్‌సీపీ అధినేత - వచ్చే సరికి పార్టీ ఖాళీ అయిపోతుందా?

Jagan : వైసీపీ అధినేత జగన్ విదేశీ పర్యటన నుంచి వచ్చే సరికి మెజార్టీ ప్రజా ప్రతినిధులు పార్టీ మారిపోతారన్న ప్రచారం జరుగుతోంది. వీరిని ఎలా అడ్డుకుంటారు ?

Andhra Pradesh YSRCP Politics :  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు జంపింగ్‌ల సీజన్ నడుస్తోంది. నిన్నామొన్నటి వరకూ తిరుగులేని పార్టీగా ఉన్న వైఎస్ఆర్‌సీపీ నుంచి రోజుకు ఇద్దరు ముఖ్యనేతలు చొప్పున రాజీనామాలు చేస్తున్నారు. గురువారం ఇద్దరు ఎంపీలు రాజీనామా చేయగా.. శుక్రవారం ఇద్దరు ఎమ్మెల్సీలు ఆ పని చేశారు.  తర్వాత ఎవరు అన్నదానిపై అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ అధ్యక్షుడు జగన్ కోర్టు అనుమతి తీసుకుని విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. లండన్ లో ఉంటున్న కుమార్తె పుట్టిన రోజు వేడుకల కోసం వెళ్తానని ఆయన కోర్టుకు పెట్టుకున్న దరఖాస్తుకు ఆమోదం లభించింది. సెప్టెంబర్ రెండో తేదీన వైఎస్ వర్థంతి సందర్భంగా ఇడుపులపాయలో నివాళులు అర్పించి లండన్ కు  బయలుదేరుతారు. మళ్లీ నెలాఖరులో వస్తారు. ఇప్పుడు వలసలు పెరుగుతున్న  సమయంలో జగన్ అందుబాటులో లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందన్న సందేహం ఆ పార్టీ క్యాడర్ లో వినిపిస్తోంది. 

రాజ్యసభ సభ్యుల్లో ఎంత మంది ఉంటారో ?

ఏపీకి రాజ్యసభలో మొత్తం పదకొండు మంది సభ్యులు ఉన్నారు. ఆ పదకొండు మంది వైసీపీకి  చెందినవారే. టీడీపీకి ఒక్కరు కూడా లేరు. అయితే ఆ పదకొండు మందిలో గురువారం ఇద్దరు రాజీనామా చేశారు. వారి స్థానాలు ఖాళీ అయినట్లుగా గెజిట్ కూడా విడుదల అయింది. ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఆ రెండు స్థానాలు కూటమి ఖాతాలో పడిపోతాయి. ఇంకా వైసీపీకి మిగిలిన తొమ్మిది  మంది ఎంపీల్లో ఎంత మంది ఉంటారో ఎంత మంది ఉండరో అర్థం కాని పరిస్థితి . కొంత మంది  మీడియా ముందుకు వచ్చి .. తాము వైసీపీని వీడే ప్రశ్నే లేదని చెబుతున్నారు. కానీ రాజకీయాల్లో ఇలా చెప్పారంటే... ఏదో గూడు పుఠాణి ఉందని అనుకునే పరిస్థితి. 

విజయవాడ ఎంపీగా గెలిస్తే రాజకీయ భవిష్యత్ సమాధి - ఇప్పటి వరకూ జరిగింది ఇదే - ఇదిగో లిస్ట్

మండలిలో ఆధిపత్యం పోతుందా ?

ఏపీ శాసనమండలిలో వైసీపీకే మెజార్టీ ఉంది. మొత్తం 58 మంది సభ్యుల్లో 36 మంది ఆ పార్టీకి చెందిన వారు అధికారికంగా ఉన్నారు. కానీ రాజీనామాలు.. అనర్హతలతో ఇప్పటికీ ఆ సంఖ్య 28కి తగ్గిపోయింది. రెండు రోజుల్లో ముగ్గురు రాజీనామా చేశారు. అలాగే పలువురు ఎమ్మెల్సీలు రాజీనామాలు చేయలేదు కానీ.. టీడీపీ హైకమాండ్ తో టచ్ లో ఉన్నారు. గతంలో వైసీపీ ఆదేశాలు పట్టించుకోకుండా సభకు హాజరు కావడం.. వైసీపీ సమావేశాలకు వెళ్లక పోవడం వంటి వాటి ద్వారా తాము ఎవరి వైపో చెప్పారు. అసెంబ్లీలో వైసీపీ  ఆధిక్యతను తగ్గించడానికి టీడీపీ ఖచ్చితంగా ప్రయత్నిస్తుంది. జగన్ దేశంలో లేని సమయంలో ఇది  మరంత ఉద్ధృతంగా సాగుతుందిని భావిస్తున్నారు. దీనికి విరుగుడుగా వైసీపీ వద్ద ఏదైనా వ్యూహం ఏదైనా  ఉందా అని ఆ పార్టీ నేతలు మథనపడుతున్నారు. 

సజ్జల రామకృష్ణారెడ్డిపై వైఎస్ఆర్‌సీపీలో అసంతృప్తి - ఆయనను పక్కన పెడితేనే పార్టీకి భవిష్యత్ ఉంటుందా ?

మహారాష్ట్ర ఫార్ములాను ప్రయోగిస్తే మొదటికే మోసం

మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపలకు చెందిన మెజార్టీ ప్రజా ప్రతినిధులు చీలిపోయి.. తమదే అసలైన పార్టీ అని  ప్రకటించుకున్నారు. ఈసీ కూడా వారికే గుర్తింపు ఇచ్చింది. కోర్టుల్లో కూడా అదే తీర్పు వచ్చింది. ఇప్పుడు వైసీపీలోకిని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇలా మెజార్టీ వీడిపోయి తమదే అసలైన పార్టీ అని ప్రకటించుకుంటే రాజకీయం ఎలా మారుతుందన్న ఓ గుసగుస  ఏపీలో గట్టిగానే వినిపిస్తోంది. జగన్ అందుబాటులో లేకపోవడంతో ఇలాంటి రాజకీయం జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. రాజకీయాల్లో విశ్వాసపాత్రులు అనే వారు ఎవరూ ఉండరు. అవకాశాలను బట్టే ఎవరి వ్యవహరశైలి అయినా ఉంటుంది. గతంలో ఇలాంటి ప్రమాదం ఉంటుందని అంచనా వేసి జగన్ .. ఓ ప్లీనరీలో.. తనను  శాశ్వత అధ్యక్షునిగా ప్రకటించుకున్నారు. కానీ అది చెల్లదని ఈసీ ప్రకటించింది. బహుశా  ఇప్పుడు అలాంటి పరిస్థితి వచ్చే ప్రమాదం ఉందని అప్పుడే ఊహించారేమోనన్న సందేహం రాజకీయవర్గాలకు వస్తోంది. 

కారణం ఏదైనా రాబోయే రోజుల్లో జగన్ మోహన్ రెడ్డి చాలా కఠినమైన పరిస్థితుల్ని ఎదుర్కోబోతున్నారు. పాత కేసుల విచారణ.. ముంచుకొచ్చే కొత్త కేసులు.. రాజకీయపరమైన సవాళ్లతో ఆయన ఉక్కిరిబిక్కిరి కాబోతున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
AP Municipal Elections: ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
LPG Lite Instant Cylinder: విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Embed widget