అన్వేషించండి

Jagan-Chiranjeevi Controversy :అసెంబ్లీలో బాలయ్య కామెంట్స్.. చిరంజీవి రియాక్షన్‌- వైసీపీ వ్యూహం ఏమిటి?

YSRCP: బాలకృష్ణ వంగ్యాస్త్రాలు, చిరంజీవి లేఖాస్త్రం, ఈ వివాదాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని వైసీపీ భావిస్తోంది. చాలా కాలంగా జగన్‌పై చేస్తున్న ప్రచారానికి ఫుల్‌స్టాప్‌ పెట్టాలని చూస్తోంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

YSRCP On Jagan Chiranjeevi Issue:  వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఆయన్ని కలిశారు. తాడేపల్లిలోని నివాసంలో జగన్‌ను కలిసిన టైంలో జరిగిన పరిణామాలు నాడు ఎంత హాట్‌ టాపిక్ అయ్యాయో నేడు అదే స్థాయిలో దుమారం రేపుతున్నాయి. మీటింగ్‌కు సంబంధించిన ఫుటేజ్‌ నాటి ప్రభుత్వం విడుదల చేసింది. కానీ అందులో చిరంజీవి లాంటి పెద్ద మనిషి ప్రాధేయపడుతూ అడుగుతున్న విజువల్స్‌, జగన్ మోహన్ రెడ్డి పట్టించుకోకుండా దృశ్యాలు ఉన్నాయి. దీన్ని చూసిన వారంతా రగిలిపోయారు. మెగా అభిమానులు, జనసైనికులు, జగన్‌ను వ్యతిరేకించే వారంతా ఆ చర్యను ఖండించారు. నాడు మొదలైన వివాదం నేటికీ కొనసాగుతూనే ఉంది. 

గురవారం అసెంబ్లీలో ఈ అంశాన్ని బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ ప్రస్తావించారు. నాడు ఇండస్ట్రీ పెద్దలను అవమానించారని గుర్తు చేశారు. అసలు గేటు నుంచి లోనికి రానివ్వకపోవడం, లోపలికి వెళ్లాక కూడా సినిమాటోగ్రఫీ మంత్రిని కలిసి వెళ్లాలని చెప్పారని అన్నారు. ముఖ్యమంత్రి కలవబోరని అనేసరికి చిరంజీవి గట్టిగా నిలదీశారని తెలిపారు. గట్టిగా చిరంజీవి నిలదీశారనే విషయాన్ని టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తప్పుపట్టారు. ఎవరూ అక్కడ గట్టిగా అడగలేదని అన్నారు. అంటే అక్కడ జరిగిన అవమానానికి వారు చెప్పిన దానికి సైలెంట్‌గా ఉండిపోయారే తప్ప మరో మాట మాట్లాడలేదని బాలయ్య అభిప్రాయంగా చెప్పుకొచ్చారు. 

Image

అసెంబ్లీలో తన పేరు ప్రస్తావించడం ఈ సందర్భంగా బాలయ్య వాడిన పదజాలంపై చిరంజీవి నొచ్చుకున్నారు. నాడు మేం గట్టిగా అగడటం వల్లే నాడు వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలకు టికెట్ల ధరలు పెరిగాయని గుర్తు చేశారు. నాడు ఏం జరిగిందో చెప్పుకొచ్చారు. ఓ లేఖనే విడుదల చేశారు. ఈ లేఖ నాడు ఏం జరిగిందో చెప్పారే తప్ప తమకు అవమానం జరిగిందా లేదా అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. 

ఈ లేఖను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న వైసీపీ మద్ధతుదారులు జగన్‌ అవమానించలేదని చిరంజీవి క్లారిటీ ఇచ్చేశారని ప్రచారం చేస్తున్నారు. వైసీపీ అనుకూల మీడియా కూడా ఇదే చెబుతోంది. కానీ బాలకృష్ణ మాటలకు కౌంటర్‌గా లేఖలను విడుదల చేశారు కానీ జగన్‌ ప్రవర్తించిన తీరును ఎక్కడా ప్రస్తావించలేదు. నాడు తాడేపల్లిలో జరిగిన విషయంపై ఇప్పటికే చాలా సార్లు పవన్, చంద్రబాబు, బీజేపీ నేతలు ప్రస్తావిస్తూ వచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అంశం కూడా ఓ ప్రచారాస్త్రంగా వాడుకున్నారు. అప్పుడు కూడా చిరంజీవి స్పందించేలేదు. 

నాడు జరిగిందని చిరంజీవి మనసులో ఉంది. దానిపై ఇప్పటి వరకు స్పందించలేదు. ఇకపై స్పందిస్తారో లేదో కూడా తెలియదు. కానీ ఆయన గురువారం విడుదల చేసిన లేఖలో మాత్రం బాలకృష్ణ అన్న మాటలపై నొచ్చుకుంటున్నట్టు తెలిపారు. ఈ వివాదాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని వైసీపీ, దాని అనుకూల  మీడియా భావిస్తోంది. అందుకే జగన్‌పై వస్తున్న ఆరోపణలు చిరంజవి కొట్టి పారేశారనే ప్రచారం చేస్తోంది. అదే టైంలో జగన్‌ను సైకో అన్న పదాన్ని కూడా ఖండిస్తోంది. అసలైన మానసిక రోగి బాలకృష్ణే అంటూ ఘాటుగా స్పందిస్తోంది. ఏమైనా సమస్య ఉంటే బావతో, పపన్ కల్యాణ్‌తో తేల్చుకోవాలే తప్ప తమ జోలికి రావద్దని హెచ్చరిస్తోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Advertisement

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget