అన్వేషించండి

Congress alliance: ఇండియా కూటమిలో మారుతున్న బలాబలాలు- ప్రాంతీయ శక్తుల పతనం- కాంగ్రెస్ నాయకత్వానికి బలం వచ్చినట్లే!?

INDIA Colation: ప్రాంతీయ పార్టీల ఓటమి ఇండియా కూటమి స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తోంది. ఇప్పుడు తమ ఉనికిని కాపాడుకోవడానికి కాంగ్రెస్ గూటి కిందకు చేరక తప్పని పరిస్థితి ఏర్పడింది.

Congress leadership is gaining strength: దేశవ్యాప్తంగా ఇటీవల ముగిసిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పలికాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ, తమిళనాడులో డీఎంకే వంటి ప్రాంతీయ పార్టీల  ఓటమి ఇండియా కూటమి స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తోంది. అధికారం కోల్పోయిన మరుక్షణమే మమతా బెనర్జీ  ఐక్యత  మంత్రాన్ని పఠించడం, కూటమి నేతలతో వరుసగా ఫోన్లలో మాట్లాడటం వెనుక బలమైన రాజకీయ అవసరం కనిపిస్తోంది. ఒకప్పుడు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ప్రశ్నించిన వారంతా ఇప్పుడు తమ ఉనికిని కాపాడుకోవడానికి కాంగ్రెస్ గూటి కిందకు చేరక తప్పని పరిస్థితి ఏర్పడింది.

 అధికారం పోగానే  అలయెన్స్  గుర్తుకొచ్చిందా? 

బెంగాల్ ఎన్నికల సమయంలో ఒంటరిగా పోరాడి,  ఇండియా  కూటమిలో భాగంగా కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలను దూరం పెట్టిన మమతా బెనర్జీ, ఇప్పుడు ఓటమి తర్వాత అనూహ్యంగా స్వరం మార్చారు.  ఇకపై నా లక్ష్యం ఒక్కటే.. ఇండియా  టీమ్‌ను బలోపేతం చేయడం  అని ఆమె ప్రకటించారు.  అధికారం ఉన్నప్పుడు తనకంటూ ఒక ప్రత్యేక అజెండాతో నడిచిన దీదీ, ఇప్పుడు అధికారం కోల్పోయాక పోరాటానికి ఇతర పార్టీల మద్దతు అనివార్యమని గుర్తించారు. ఇదే తీరు తమిళనాడులోనూ కనిపిస్తోంది. అధికారాన్ని కోల్పోయిన డీఎంకే కూడా ఇప్పుడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అండ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 రాహుల్ నాయకత్వానికి పెరిగిన వెయిట్ 

ఒకప్పుడు మమత, నితీష్ కుమార్ లేదా అరవింద్ కేజ్రీవాల్ వంటి నేతలు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని తక్కువ చేసి చూశారు. కానీ, ప్రస్తుత ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ కేరళ, అస్సాం వంటి రాష్ట్రాల్లో మెరుగైన ప్రదర్శన కనబరచడం, అటు  దళపతి  విజయ్ కూడా కాంగ్రెస్ మద్దతు కోరడం వంటి పరిణామాలు రాహుల్ ఇమేజ్‌ను పెంచాయి. బలహీనపడిన ప్రాంతీయ పార్టీల కంటే, బలమైన ప్రతిపక్షంగా నిలబడ్డ కాంగ్రెస్ నాయకత్వంలోనే బీజేపీని ఎదుర్కోవడం సాధ్యమని ఇతర నేతలు ఒక అవగాహనకు వస్తున్నారు.

కాంగ్రెస్ కు లభించిన సువర్ణావకాశం 

ఈ సంక్షోభం కాంగ్రెస్‌కు ఒక గొప్ప అవకాశాన్ని కల్పించింది. ప్రాంతీయ పార్టీలు తమ రాష్ట్రాల్లో ఆధిపత్యం కోల్పోవడంతో, కూటమిని నడిపించే బిగ్ బ్రదర్  హోదా ఇప్పుడు సహజంగానే హస్తం పార్టీకి దక్కింది. ఇప్పటివరకు కాంగ్రెస్ చెప్పే మాట వినని నేతలు కూడా ఇప్పుడు రాహుల్ లేదా ఖర్గే గీసిన గీత దాటలేని పరిస్థితి. ఇది ఒక రకంగా ప్రతిపక్ష ఐక్యతను మరింత క్రమబద్ధంగా, ఒకే నాయకత్వం కింద నడిపించడానికి దోహదపడుతుంది.  ప్రాంతీయ పార్టీలు కేవలం తమ రాష్ట్రాలకే పరిమితమైతే బీజేపీని జాతీయ స్థాయిలో ఢీకొట్టడం కష్టమని ఈ ఎన్నికలు నిరూపించాయి. అందుకే మమతా బెనర్జీ తనను తాను స్వేచ్ఛా విహంగం గా ప్రకటించుకుని, దేశవ్యాప్త పర్యటనలకు సిద్ధమవుతున్నారు. కూటమిలోని పార్టీలన్నీ కాంగ్రెస్ నాయకత్వాన్ని అంగీకరిస్తూ ముందుకు సాగితేనే 2029 లోక్‌సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వగలమనే వాస్తవం ఇప్పుడు స్పష్టమైంది.

మారిన  పవర్ సెంటర్ 

  బెంగాల్, తమిళనాడు ఓటములు ఇండియా కూటమిలో  పవర్ సెంటర్ ను ప్రాంతీయ నేతల నుండి ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి మార్చేశాయి. ఈ పరిణామం కాంగ్రెస్‌కు మేలు చేయడంతో పాటు, విపక్షాల మధ్య అనవసర పోటీని తగ్గించి ఒక బలమైన ఫ్రంట్ ఏర్పడటానికి దారితీస్తోంది. అహంకారాలను పక్కన పెట్టి, మమత వంటి నేతలు కాంగ్రెస్‌తో కలిసి నడవడానికి సిద్ధమవ్వడం భారత రాజకీయాల్లో ఒక కీలక మలుపు.   

టాప్ హెడ్ లైన్స్

Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Telangana Congress Rift: కాంగ్రెస్ మార్క్ అంతర్గత ప్రజాస్వామ్యం - రేవంత్ ఉక్కిరిబిక్కిరి - దారిలో పెట్టలేకపోతున్నారా?
కాంగ్రెస్ మార్క్ అంతర్గత ప్రజాస్వామ్యం - రేవంత్ ఉక్కిరిబిక్కిరి - దారిలో పెట్టలేకపోతున్నారా?
Ponguleti Srinivas Reddy: రేవంత్ సర్కార్‌కు మంత్రి పొంగులేటి సమస్యగా మారారా? కాంగ్రెస్ ల్యాండ్ మార్క్ గ్రాఫ్‌కు గండి కొడుతున్నాయా?
రేవంత్ సర్కార్‌కు మంత్రి పొంగులేటి సమస్యగా మారారా? కాంగ్రెస్ ల్యాండ్ మార్క్ గ్రాఫ్‌కు గండి కొడుతున్నాయా?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
Embed widget